సీబీఎన్ మీకు సెల్యూట్‌.. ఇదిక‌దా గెలుపంటే!

Publish Date:Sep 6, 2024

Advertisement

ఆయనో రాజ‌కీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త‌.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాల‌జీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆప‌ద‌లో ఉన్న‌వారికి ఆప‌ద్భాంద‌వుడు.. క‌ష్ట‌ కాలంలో అండ‌గా నిలిచే పెద్ద‌న్న‌.. మొత్తంగా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్ర‌జ‌ల క్షేమం కోసం ఎంత‌దూర‌మైనా వెళ్లే జననేత. ఏపీని తాకిన ఎలాంటి ఉప‌ద్ర‌వ‌మైనా సీఎం కుర్చీలో ఆయ‌న‌ ఉన్నాడంటే తోక ముడ‌వాల్సిందే.. ఆయ‌నే ఎవ‌రో కాదు.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇవ‌న్నీ ఆయ‌న అభినుమాలు, టీడీపీ శ్రేణులు  మాట‌లే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  తెలుగు ప్ర‌జ‌ల హృదయాంతరాళాలలోంచి గ‌ర్వంగా వస్తున్న పలుకులు. 

మ‌రోసారి ఆ మాట‌లు అక్ష‌ర‌స‌త్యాల‌య్యాయి. చంద్ర‌బాబు సీఎం సీటులో ఉంటే.. ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవ‌నం సాగించొచ్చని మ‌రోసారి రుజువైంది.  గ‌తంలో విశాఖ‌.. నేడు విజ‌య‌వాడ‌. ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు ఆ 74ఏళ్ల నవ యువ‌కుడు. విజ‌య‌వాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు త‌న ప్రాణాల‌ను అడ్డుగా పెట్టి అండ‌గా నిలిచాడు. బాధితులంతా వ‌ర‌ద‌ ముంపు నుంచి బయటకు వచ్చేవరకూ తానూ ఓ వరద బాధితుడాగా గడిపారు.  ప‌గ‌లు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలన్న ఊసే ఎత్తకుండా వ‌ర‌ద‌ల్లో  బోట్ల‌పై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో దైర్యాన్ని, స్థైర్యాన్ని నింపారు.. వారిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో మొన్నటి ఎన్నిక‌ల్లో సాధించిన విజయం కంటే.. ఉగ్ర‌రూపందాల్చిన కృష్ణమ్మ‌ను శాంతింప‌ జేసి చంద్ర‌బాబు సాధించిన విజ‌యం వంద రెట్లు గొప్ప‌ది.

ఏపీ ప్ర‌జ‌ల‌కు మొద‌టి నుంచి సీఎం చంద్ర‌బాబుపై అపార న‌మ్మ‌కం ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ అయిన చంద్ర‌బాబు సీఎం కుర్చీలో ఉంటే మ‌న క‌ష్టాలు తీరుతాయ‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంటుంది. అందుకే.. ఏపీ ఎప్పుడు క‌ష్టాల్లో కూరుకుపోయినా జనం చంద్ర‌బాబు వైపే చూస్తారు.  చంద్ర‌బాబు కూడా ఎన్నికలలో జయాపజయాలను  ప‌ట్టించుకోకుండా   నాలుగు దశాబ్దాలుగా మచ్చలేని చంద్రుడిలా ప్రజాజీవితంలో కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  తొమ్మిదేళ్లు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు అద్భుతాలు చేశారు.  ముఖ్యంగా హైద‌రాబాద్ వైపు ప్ర‌పంచం చూసేలా చేశాడు. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేం మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి  ప్ర‌పంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయాల‌ని చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగుతున్నారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఎదురైన ప్ర‌కృతి విప‌త్తుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ.. ప్ర‌జ‌ల‌కు నేనున్నాన‌ని భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చంద్ర‌బాబు నాయ‌డు. 

రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు వ‌చ్చిన స‌మ‌యంలో..  ఏ ముఖ్య‌మంత్రి అయినా వ‌ర‌దల తీవ్ర‌త‌ను గ‌మ‌నించేందుకు ఏరియ‌ల్ స‌ర్వే చేస్తారు. లేకుంటే అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అల‌ర్ట్ చేస్తూ బాధితుల‌కు అండ‌గా నిలిచే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప‌లు సంద‌ర్భాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏరియల్ స‌ర్వే ద్వారా ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. కాలు కింద‌ కూడా పెట్ట‌లేదు. దీంతో ముంపు ప్రాంతాల‌ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, సీఎం చంద్ర‌బాబు నాయుడు అలాకాదు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ముంపుకు గురైన ప్రాంతాల్లోకి నేరుగా వెళ్తారు.. పీక‌ల్లోతు నీళ్లున్నా ప‌ట్టించుకోరు.. నేరుగా బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి వారికి భ‌రోసా క‌ల్పిస్తారు. గ‌తంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విల‌యం అంతాఇంతా కాదు.. ఆ తుఫాన్‌ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ చంద్రబాబు కొండంత అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయడం కాదు బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు   భుజం కాశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లుచేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుపాను గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చారు.

అప్ప‌ట్లో విశాఖ ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితి.. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు ఎదురైంది. కుండ‌పోత వర్షానికి తోడు..  కృష్ణానదికి రికార్డు స్థాయిలో వ‌చ్చిన వ‌ర‌ద‌,  బుడ‌మేరు ముంపుతో  విజ‌య‌వాడ‌లోని అనేక ప్రాంతాల్లోకి మ‌నిషి లోతు వ‌ర‌ద‌ నీరు చేరింది. ఇళ్లు నీట‌మునిగాయి. ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోయారు. వెంట‌నే రంగంలోకి దిగిన చంద్ర‌బాబు నాయుడు.. నేనున్నాను మీకేం కాదు అంటూ వ‌ర‌ద బాధితుల్లో భ‌రోసా క‌ల్పించేందుకు వ‌ర‌ద నీటిలోకి దిగారు. బోటులో ముంపు ప్రాంతాలలోకి వెళ్లారు. పొక్లెయిలో ప్రయాణించి మరీ ముంపు ప్రాంతాల్లో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అధికారుల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించి త‌క్ష‌ణ‌మే ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు.  వ‌ర‌ద బాధితులకు భరోసా ఇచ్చారు. తమను ఆదుకోవడానికి చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్నిచ్చారు. ఆయన వచ్చారు ఇక భయం లేదు వ‌ర‌ద ముంపు నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తాం అనే ధీమాను క‌ల్పించారు. ఐదు రోజులు నిర్విరామంగా వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం, తాగునీరు అందించ‌ డంతోపాటు.. వర‌ద ముంపు నుంచి బ‌య‌ట‌ప‌డిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప‌నులు చురుగ్గా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసు కున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో బుర‌ద‌తో నిండిపోయిన బాధితుల ఇళ్ల‌ను క్లీన్ చేయించే బాధ్య‌త‌ను తీసుకున్నారు. 74ఏళ్ల వ‌య‌స్సులో విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితులను కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్నిచూసి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లే కాదు.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు చంద్ర‌న్నా సెల్యూట్ అంటున్నారు.

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.