జగన్ ఏలుబడిలో సజ్జల రాజ్యం?

Publish Date:May 3, 2022

Advertisement

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాడేపల్లి ఫ్యాలెస్‌లో బాగా వినపడే పేరు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సలహదారుడిగా పేరుకే ఉన్నా.. సజ్జల మాత్రం అన్ని తానే అయి.. జగన్ ప్రభుత్వాన్ని నడిపించేస్తారనే టాక్ అయితే సదరు ప్యాలెస్‌లోనే కాదు.. ప్రతిపక్ష టీడీపీలో సైతం ఉంది. అందుకే ఆయన్ని సకల శాఖల మంత్రి అంటూ ఓ టాగ్ లైన్ కూడా తగిలించేశారీ పసుపు పార్టీ నేతలు. 

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వెనుక విజయసాయిరెడ్డి ఉండి నడిపిస్తే.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వెనుక సజ్జల ఉండి నడిపిస్తున్నారని... అందుకే నడిచేవాడు వైయస్ జగనే అయిన ఆయన్ని నడిపించేవాడు మాత్రం సజ్జల అనే టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్ తిరిగినట్లు తెగ తిరుగుతోంది.

ఇటీవల వైయస్ జగన్ కొత్త కేబినెట్‌ కొలువు తీరింది. అందులో 11 మంది పాత వారినే ఉంచి.. మరో 14 మందిని కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలో ఈ సజ్జల వారు తన అగ్‌మార్కు రాజకీయాన్ని చూపించారని మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు తెగ  చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం. 

అదీకాక.. ఎన్నికల్లో గట్టి పోటి ఇచ్చి.. గెలిచిన ఎమ్మెల్యేలు.. అంటే పవన్ కల్యాణ్‌పై భీమవరం, గాజువాకలో గెలుపొందిన ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, మంగళగిరిలో నారా లోకేశ్‌పై గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిలాంటి వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టకుండా.. ఇలా పార్టీలోకి వచ్చి.. అలా అసెంబ్లీ టికెట్ తీసుకుని అలా అలా గెలిచి... అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వారికి.. అదీ కూడా కీలక మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సబబు అని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం ఆగ్రహంతో లొలోపల కుతకులాడిపోతుందట. ఇదంతా.. సజ్జల వారి యవ్వారమంటూ ఈ సకల శాఖల మంత్రిపై సదరు వర్గం వ్యంగ్య బాణాలు సంధిస్తోందట. వచ్చేది ఎన్నికల సీజన్.. మళ్లీ కేబినెట్ కూర్పు ఉండదు.... ఉండబోదు. అలాంటి వేళ... కేబినెట్ కూర్పు అంటే ఆచి తూచి అడుగులు వేయాలి. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలపై గెలుపొందిన వారిని ఎంపిక చేసి.. వారికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టి.. వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా.. ఎవరెవరినో మంత్రి పదవులు కట్టబెట్టడం ఏమిటని వారంతా సందేహం వ్యక్తం చేస్తున్నారట.  

మరోవైపు తాజాగా మాజీ మంత్రులు అయిన వారిలో చాలా మంది అంతా సజ్జల వారే చేశారంటూ ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకు మేకతోటి సుచరిత ఎపిసోడే ఓ ఉదాహరణ. కొత్త మంత్రులు పేర్లు ప్రకటించగానే.. ఆమె నివాసం వద్ద సుచరిత అభిమానులు అయితే సజ్జలపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోయడమే కాదు.. రచ్చ రచ్చ చేసి పెట్టారు. ఇక సీఎం జగన్ సమీప బంధువు బాలినేని అలకపాన్పు ఎక్కితే.. ఆయన ఇంటికి సజ్జల కాలిగాలిన పిల్లిలా  ముచ్చటగా మూడు సార్లు వెళ్లి వచ్చారు. 

అలాగే పాత కేబినెట్‌లో 11 మందిని మళ్లీ కొత్త కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగించడంపై.. నాటి వారి సహచరులు అయితే .. వాళ్లు చేసిన పుణ్యమేమిటి? మనం చేసిన పాపమేమిటని వారు.. తాజాగా మాజీలు అయిన తమ తమ సహచరుల వద్ద ప్రశ్నించుకొంటున్నట్లు ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అందుకే అప్పుడెప్పుడో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా అర్థమైందీ. నిన్న కాక మొన్న బాపు దర్శకత్వంలో వచ్చిన రామరాజ్యం సినిమా కూడా అర్థమైందీ. కానీ జగన్ డైరక్షన్‌లో వస్తుందో లేక సజ్జల సొంత డైరెక్షన్‌లో వస్తున్న ఈ సజ్జల రాజ్యం మాత్రం అర్థం కావడం లేదని మంత్రి పదవులు పోయి తాజా తాజాగా మాజీలు అయిన వారు... మంత్రి పదవులు వస్తాయని తెగ ఆశ పడి తీవ్రంగా భంగ పడ్డవారంతా ఓ చర్చకు తెర తీసినట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది.

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.