బూమరాంగ్ అవుతున్న జగన్ బలప్రదర్శన యత్నాలు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను చేసే ప్రతి పర్యటనలోనూ.. క్కడ అడుగుపెట్టినా బలప్రదర్శన చేయాలన్న ఆత్రం తప్ప.. తాను ఎందుకు పర్యటన చేస్తున్నారు అన్న ధ్యాస కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా ఆయన బుధవారం (జులై 15) భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు.   రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి. దీంతో ఆశించిన సానుకూలతకు బదులుగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా బుధవారం (జులై 15)పర్యటనల్లోనూ అదే జరిగింది.  

ముందుగా ఆయన భీమవరంలో మత్స్య పరిశ్రమకు సంబంధించి  రవాణా సమస్యలతో బాధపడుతున్న స్థానిక ఆక్వా రైతులకు మద్దతుగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అయితే ఆయన భీమవరం పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్వయంగా జగనే దాని వల్ల ఇబ్బందులు పడ్డారు. సొంత మద్దతు దారులే ముందుకు తోసుకుని రావడంతో ఆయన వేదికపై బొక్కబోర్లా పడినంతపనైంది.  భీమవరం  సభకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో  తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై జగన్ చుట్టూ చేరిన అభిమానులు ఆయనను తాకేందుకు, ఆయన దృష్టిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయి.

స్వయంగా తన మద్దతు దారుల తోపులాట కారణంగానే  జగన్ వేదికపై అదుపు తప్పి బోర్లా పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు కనుక సరిపోయింది కానీ.. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పరిశీలకులు అంటున్నారు. 

 సరే బలప్రదర్శన కారణంగా భీమవరంలో జరిగిన నిర్వాకం చాలదన్నట్లుగా దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు కూడా జగన్ భారీ ర్యాలీతో వెళ్లారు. జగ్గయ్య పేట నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి చేరుకున్న జగన్ పర్యటన అంత్యక్రియలకు వెడుతున్నట్లుగా కాకుండా ఏదో యుద్ధానికి వెడుతున్నారా అన్నట్లుగా భారీ ర్యాలీగా సాగింది.  మరణించిన నేతకు నిశ్శబ్దంగా నివాళు లర్పించాల్సిన   సమయంలో ఇలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేదిక వద్ద జగన్ రాకతో  హడావుడి, గందరగోళం నెలకొన్నాయి సీనియర్ నేత చివరి వీడ్కోలు కార్యక్రమం కాస్తా, రాజకీయ బలప్రదర్శనగా  ప్రదర్శనగా మారిందని ముద్రగడ అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.  

YS Jagan Mohan Reddys tour, Bhimavaram aqua farmers protest, Mudragada Padmanabham's funeral, YSRCP turmoil

By
en-us Political News

  
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.