సజ్జలకూ చెరశాల?.. అటవీ భూముల కేసులో అడ్డంగా బుక్

Publish Date:May 22, 2025

Advertisement

 వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు పిల్ల సజ్జల జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా చేసిన నిర్వాకానికి అజ్ణాతంలో గడుపుతున్నారు. కేసుల్లో అరెస్టు బెయిలు రక్షణ ఉన్నప్పటికీ భయంతో బెంబేలెత్తుతున్నారు. నోరు విప్పి మాట్లాడడానికి జంకుతూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇక  ఇప్పుడు పెద్ద సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి బూబాగోతాన్ని తేల్చేందుకు సర్కార్ సమాయత్తమైంది. తాజాగా ఆయన ఆక్రమించి అనుభవిస్తున్న 55 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  క‌డ‌ప జిల్లా సీకే దిన్నెమండ‌లం ప‌రిధిలోని అట‌వీ భూముల్లో 55 ఎక‌రాల‌ను సజ్జల ఆక్రమించి   సజ్జ‌ల ఎస్టేట్‌ నిర్మించిన‌ట్టు వచ్చిన ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  

దీంతో  క‌లెక్ట‌ర్ ఆదేశాలతో రెవెన్యూ, అట‌వీ శాఖల అధికారుల‌ బృందం స‌జ్జ‌ల ఎస్టేట్‌లో ప‌ర్య‌టించి.. నిజనిజాల నిగ్గు తేల్చింది. సజ్జల అటవీ భూముల ఆక్రమణ వాస్తవమేనని అధికారుల బృందం నివేదిక సమర్పించింది.  ఆ నివేదిక ఆధారంగా  సజ్జల ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సంబంధిత భూముల‌ను స్వాధీనం చేసుకుని.. కంచె ఏర్పాటు చేయ‌డంతోపాటు.. హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు.   అయితే సజ్జల కబ్జాల పర్వం, ఆక్రమణల వ్యవహారం ఇంతటితో ఆగేది కాదు. ఆగే అవకాశమూ లేదు. ఎందుకంటే.. జగన్ హయాంలో సజ్జల కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి సజ్జలకు సహకరించిన అధకారులందరిపైనా అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా సజ్జల కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు చెబుతున్నారు. 

ఆక్ర‌మిత భూమిలో ఉన్న చెట్ల‌ను న‌రికి వేయ‌డం.. అట‌వీ సంప‌ద‌కు న‌ష్టం క‌లిగించ‌డం పైనా ప‌రిహారం వ‌సూలు చేయడమే కాకుండా,  కేసు న‌మోదు చేసి.. జైలుకు త‌ర‌లించే అవ‌కాశం కూడా ఉంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో జగన్ హయాంలో నిబంధనలు, విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా చట్ట, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఘనులంతా ఇప్పుడు చట్టం ముందు దోషులుగా నిలవక తప్పదని అంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసు, గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసు, ముంబై నటి కాదంబరి జత్మలాని కేసుల్లో పలువురు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ జాబితాలో సజ్జల కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. 

By
en-us Political News

  
మొక్కే క‌దాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. స‌రిగ్గా అలాగే వెంట్రుకే క‌దా పీక‌లేర‌న్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మ‌ల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటిక‌ల్ సిట్యువేష‌న్. మాములుగా పాములు ప‌గ‌బ‌డ‌తాయ‌ని అంటారు. స‌రిగ్గా అలాగే వెంట్రుక‌లు కూడా ఈ లీడ‌ర్ జ‌నాల మీద ప‌గ‌బ‌ట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది.
అహ్మదాబాద్‌‌లో కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రూపానీకి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే.. వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము.
ఈ నెల 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణీకులతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా ఏ1 171 విమానం టేకాఫ్ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఒక వ్య‌క్తి అర‌సెంటులో ఏ చిన్నా చిత‌కా ఇల్లో క‌ట్ట‌లేదు. ఏకంగా మూడంత‌స్తుల మేడ లేపేసేశాడు. ఒక్క‌సారి మెడ పైకెత్తి ఎంత ఎత్తులో క‌ట్టాడో చూద్దామ‌నుకున్న వాళ్ల మెడ ప‌ట్టేస్తుందంటే న‌మ్మ‌రే.  అంత‌గా క‌ట్టేశాడీ మూడంతస్తుల మేడ‌.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నానికి నకిలీ పట్టాల వ్యవహారంలో ఉచ్చు గట్టిగా బిగిసిందా? అంటూ ఔనన్న సమాధానమే వస్తున్నది. ఇప్పటికే వైసీసీ సీనియర్లు, కీలక నేతలు అన్న ఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు.
ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో కొమ్మినేని, కృష్ణంరాజు వివాదం నడుస్తున్న తరుణంలో అమరావతి మహిళా రైతులపై సజ్జల కామెంట్స్ అగ్గికి అజ్యం పోసినట్లు అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ జగన్ సొంత మీడియా చానెల్ లో జరిగిన లైవ్ డిబెట్ లో చేసిన వ్యాఖ్యలపై నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం జరిగింది.
అమరావతి ప్రాంత మహిళలపై అనుచితంగా, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలను రాక్షసులు, పిశాచులు, సంకర జాతి అంటూ నోరు పారేసుకున్న సజ్జలకు ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ సమన్లు జారీ చేసింది.
హీరో నిఖిల్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ చిత్రం షూటింగ్ లో భారీ ప్రమాదం సంభవించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.