పాపం సబ్బం...

Publish Date:Sep 29, 2013

Advertisement

 

వైజాగ్ మాజీ మేయర్ సబ్బం హరి కాంగ్రెస్ యంపీగా కొనసాగుతున్నపటికీ ఇంతకాలంగా వైకాపాకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చారు. అయితే అనేకమంది కాంగ్రెస్ నేతలు వైకాపాలో జేరినప్పటికీ, ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని చెపుతూ ఇంత కాలంగా తన రెండు పడవల ప్రయాణం సాఫీగా లాగించేస్తున్నారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిలుపై విడుదలయ్యి బయటకి వచ్చేసారు గనుక ఇక నేడో రేపో వైకాపాలో జేరవచ్చునని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మళ్ళీ తన పాత పాటే పాడుతూ త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని తాజాగా మరోమారు ప్రకటించారు.

 

అయితే, ఈ లోగా అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీగానే కొనసాగుతున్నననే సంగతి మరిచిపోయి, తమ పార్టీ (వైకాపా) 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి మాత్రమే మద్దతు ఇస్తుందని ప్రకటించేశారు.

 

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అవడం వలనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా ఆరోపణలు చేస్తున్నఈ తరుణంలో సబ్బం హరి, ఇంకా వైకాపాలో చేరక ముందే వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటించడంతో వైకాపా కంగు తింది. గతంలో విజయమ్మ, భారతి, షర్మిల ముగ్గురూ కూడా 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే లేదా తర్డ్ ఫ్రంట్ కి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అదే మాట సబ్బంహరి సమయం కాని సమయంలో ప్రకటించడంతో తెదేపా చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన ఋజువు చేసినట్లయింది. పైగా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండటంతో అ రెండు పార్టీల మధ్య గట్టి బంధమే ఉన్నట్లు దృవీకరించినట్లయింది.

 

ఈ ప్రకటన చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తరువాత వైకాపాలో చేరుతానని సబ్బం హరి ప్రకటించడం వైకాపాకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకే ఆ పార్టీ సీనియర్ నేత శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సబ్బం హరి ఒక సీనియర్ రాజకీయనేత అని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాల గౌరవం ఉండేది. కానీ మొన్నఆయన మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధ పడ్డారు. సబ్బం హరి మాటలతో కానీ, ఆయనతో గానీ మా పార్టీకి ఎటువంటి సంబంధము లేదు. ఆయన మా పార్టీ సభ్యుడు కూడా కాదు. ఒకవేళ ఆయన వచ్చి పార్టీలో చేరుతామన్నా మేము చేర్చుకోదలచుకోలేదు,” అని తెలిపారు.

 

ఇంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, జగన్ కి జై కొడుతూ, తన పార్టీ అధిష్టానాన్ని విమర్శించిన పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతనిని పట్టించుకొనేవారు లేరు. పాపం అత్యుత్సాహానికి పోయి నోరు జారినందుకు ఇప్పుడు వైకాపా తలుపులు మూసుకు పోయాయి. రెంటికీ చెడిన రేవడి అంటే ఇదేనేమో. సబ్బం సంగతి ఎలా ఉన్నపటికీ, కుమ్మక్కు ఆరోపణలను ఎదుర్కోలేక అవస్థలు పడుతున్న వైకాపాకి సబ్బం హరి, పార్టీలో చేరకపోయినా పార్టీ పరువు మాత్రం తీసిపోయాడు.

 

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.