Publish Date:Sep 30, 2013
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్నిధిక్కరించి మరీ చేస్తున్న సమైక్యవాదనతో సీమంధ్రలో ఆయన రేటింగ్స్ అమాంతం పెరిగిపోవడంతో, అనేక మంది మంత్రులు కలవరపడుతున్నారు. తాము ఎంత ప్రయత్నించినా ప్రసన్నం చేసుకోలేని ఉద్యోగులను, ముఖ్యమంత్రి ఒకే ఒక మీడియా సమావేశం నిర్వహించి తన వైపుకి తిప్పుకొంటున్నరనే దుగ్ధ వారి మనసులో ఉంది. ఒకవైపు అధిష్టానం నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంటే, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి తమ అందరినీ కలుపుకొని పోకుండా ఒంటరిగా తన సమైక్యవాదంతో తన ఇమేజ్ పెంచుకోవడం చాల మందికి జీర్ణం కావడం లేదు. అందుకే ఇటీవల కొందరు సీమంధ్ర మంత్రులు ప్రత్యేక సమావేశం అవడం, గవర్నర్ ను కలవడం వంటివి మొదలయ్యాయి.
ఎప్పటికయినా ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్నబొత్స సత్యనారాయణ, ఇంతకాలం ఏమిచేయాలో పాలుపోక చేతులు ముడుచుకొని కూర్చొన్నపటికీ, ఇంకా అలాగే కూర్చొంటే తన రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించి రంగంలోకి దూకారు. ఇంతవరకు శాసన సభ్యులను రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ఆయనే స్వయంగా (కేవలం మంత్రి పదవికే) రాజీనామా చేసేసి, ప్రజలలో తన పొలిటికల్ రేటింగ్ పెంచుకోవాలని భావించారు. అయితే మళ్ళీ ఎందుకో మనసు మార్చుకొన్నట్లు సమాచారం.
అయితే ఏదో ఒక హడావుడి చేస్తే తప్ప మనుగడ కష్టమని గ్రహించిన ఆయన సోనియా గాంధీకి లేఖ వ్రాసి మీడియాను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని, కనుక “టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అంటోనీ కమిటీని రాష్ట్ర పర్యటనకు పంపవలసిందిగా ఆయన తన లేఖలో సోనియమ్మను అభ్యర్దిoచారు. అంతే గాక నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో హాట్ లైన్లో మాట్లాడి ఆయనను సూత్రప్రాయంగా అంగీకరింపజేసినట్లు కూడా వార్తలకెక్కారు.
“టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అనే షరతు లేదా విన్నపాన్నికాంగ్రెస్ అధిష్టానం గనుక మన్నిస్తే, ఆయన కూడా ‘రాష్ట్ర విభజనకు (ఆపలేకపోయినా) బ్రేకులేసిన హీరో’గా ప్రజల ముందుకు రాగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకొనే మిగిలిన మంత్రులు కూడా, తమ రాజకీయ మనుగడ కోసం ఎవరికి తోచిన మార్గాలను వారు అన్వేషించుకోక తప్పదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-39-26243.html
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.