Publish Date:Nov 14, 2025
వీడెవడండీ బాబూ! వంద మంది వీరేంద్ర సెహ్వాగ్ లు ఒకే సారి బ్యాటింగ్ చేస్తున్నట్లు.. యాభై మంది రిషబ్ పంత్ ల ఇన్నింగ్స్ ఇన్ స్పిరేషన్ గా తీస్కున్నట్టు.. ఒక పద్ధతి ప్రకారం.. ప్రతి రెండో బాల్ కి ఒక సిక్స్ కొడుతూ.. స్కోర్ బోర్డుకు రన్నింగ్ రేస్ నేర్పిస్తున్నట్టు ప్రతి బాల్ నీ ఫోర్ గానీ సిక్స్ గానీ వెళ్లేలా చేస్తూ.. ఆ మాటకొస్తే.. బాలు ఉన్నదే తాను ఫోర్లూ సిక్స్ లు కొట్టేందుకన్నట్టు.. కలలో రాకుమారుడుగానీ బ్యాటు పట్టుకుని ఫటా ఫటా బాదినట్టూ.. పుస్తకాల్లో మాత్రమే కనిపించే కామిక్ క్యారెక్టర్ గానీ మాయలూ మంత్రాలు చేసినట్టు..
ఇలా ఒకటా రెండా ఆ విశేషణాలు అన్నీ ఇన్నీ కావు.. యూఏఈ తో ఇండియా ఏ జట్టు ఆడిన ఈ ట్వంటీ ట్వంటీలో స్టేడియంలో కూర్చున్నదే పట్టుమని పాతిక మంది.. వారంతా కలసి వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే..స్టేడియం నిండా జనమున్నట్టు ఆ అరుపులేంటి కేకలేంటి..???
జస్ట్ 17 బంతుల్లో హాఫ్ సెంచురీ, జస్ట్ 32 బంతుల్లో సెంచురీ.. ప్రతి బంతినీ ఆకాశం చూడాలా అన్నట్టు చితకబాదుతూనే వెళ్లాడంటే నమ్మండీ..
అబ్బబ్బబ్బ 10 ఫోర్లు 15 సిక్సులూ.. ఇలా చెబుతూ పోతుంటే ఆ ఇన్నింగ్స్ లో వైభవ్ సూర్యవంశీ పారించిన పరుగుల వరదకు ఒక అంతే లేదా అన్నట్టు మారింది అతడి బ్యాటింగ్ సెన్సేషన్.
అసలు వీ అన్న అక్షరంతో పేరున్న వాళ్లంతా ఒక్కో వీరేంద్ర సెహ్వాగ్ లా చెలరేగుతారా? అన్నట్టుగా సాగిందా విధ్వంసకర ఇన్నింగ్స్. కేవలం 41 బంతుల్లో 144 పరుగులు చేసి.. ఎట్టకేలకు అతడు ఔట్ అయితే ప్రదత్యర్ధి ప్లేయర్లు కూడా హర్ట్ అయ్యారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.. అది కోత కాదు.. మామా ఊచ కోత!
అతడు ఆడిన మొదటి బంతికే ఇచ్చిన క్యాచ్ ని ఎందుకు డ్రాప్ చేశామా? అని ప్రత్యర్థి జట్టు ఫీలవలేదంటే ఒట్టు. ఒక సమయంలో ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ని మనం కూడా చూడలేక పోయే వాళ్లం కదాని యూఏఈ జట్టు ఆటగాళ్లు కూడా ఫీలయ్యేలా చేశాడు పట్టుమని పదిహేను ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/runs-tsunami-in-vaibhav-suryavamshi-batting-36-209552.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.