Publish Date:Apr 29, 2022
కేటీఆర్ కామెంట్లు ఏపీలో కాక రేపుతున్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ ఉండదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వానం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. మంత్రులంతా పోలోమంటూ కౌంటర్ ఇస్తూ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి, జోగి రమేశ్, బొత్స, రోజా.. ఇలా మంత్రులంతా ఎవరికి తోచిన బాషలో వాళ్లు మా ఏపీ గొప్ప.. అంటూ కవర్ చేస్తున్నారు.
ఇక రోజా అయితే సంథింగ్ డిఫరెంట్. ఓ వైపు కరెంట్ మంటలు సెగలు పుట్టిస్తుంటే.. రోజా మాత్రం నేరుగా ప్రగతిభవన్ వెళ్లారు. సీఎం కేసీఆర్ను కుటుంబ సమేతంగా కలిశారు. తనకు మంత్రి పదవి వచ్చినందుకు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కట్ చేస్తే.. ప్రగతి భవన్ నుంచి బయటకు రాగానే.. కేటీఆర్కు కౌంటర్ వేసి మరింత కామెడీ చేశారు. ఏపీకి వస్తే అభివృద్ధి చూపిస్తానంటూ రోజా ఆహ్వానించారు. అదేంటి.. ప్రగతిభవన్లో నవ్వుతూ ఫోటోలు దిగి.. బయటకు రాగానే విమర్శలా? అంటూ నెటిజన్లు రోజాను సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు. జబర్థస్త్ కామెడీ అంటూ.. దొందు దొందేనంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక, ఏపీ మంత్రుల విమర్శల్లో బొత్స సత్యనారాయణ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ చెప్పేదంతా అబద్దం.. నేను ఇటీవలే హైదరాబాద్లో ఉండివచ్చా.. అక్కడ కరెంట్ లేదు.. జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందంటూ పిచ్చ కామెడీ చేశారు. అయితే, బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్ పోదు. బహుషా, బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో. అందుకే కరెంట్ కట్ చేశారు కావొచ్చు. వైసీపీ నేతల కుటుంబాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయి. ఇక్కడే ఉన్న జగన్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాలన బాగుందని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ ఆయన వేసిన సెటైర్ భలే పేలింది. మంత్రి బొత్సను సైతం హైదరాబాద్లో ఉండే ఏపీ వాసులు పోస్టులతో ఆటాడుకుంటున్నారు. బొత్స ఉన్నది ఎక్కడో చెప్పాలని.. మాకు మాత్రం ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవట్లేదని.. బొత్స చెప్పేదంతా అబద్దమని.. హైదరాబాద్లో ఉన్న ఏపీ వాసుల బంధువులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్తో బొత్సను చెడుగుడు ఆడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-and-botsa-on-ktr-comments-39-135226.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.