దూకుడు పెంచిన రేవంత్‌.. 26 నుంచి స‌రికొత్త పాల‌న!

Publish Date:Jan 5, 2025

Advertisement

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఈనెల 26వ తేదీ నుంచి స‌రికొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చిన రేవంత్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల‌పై ఎదురు దాడినీ కొన‌సాగించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తూ   సాగుతున్నారు. అయితే  ఈ ఏడాది కాలంలో రేవంత్ స‌ర్కార్ పాల‌న‌కు అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ కొంత‌ మేర విఫ‌ల‌మైంద‌న్న వాద‌న తెలంగాణ సమాజంలో బలంగా  వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రైతుల‌కు మేలుచేసే విష‌యంలో ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో విజ‌యవంతం కాలేద‌న్న అభిప్రాయం ఉంది. రెండు ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేసిన‌ప్ప‌టి.. రైతులందరికీ రుణ‌మాపీ అంద‌లేదు. దీంతో రుణ‌మాఫీ కాని రైతులు రేవంత్ స‌ర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని చెబుతోంది.  అయితే, ఏడాది కాలంలో వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుకుంటూ స‌రికొత్త పాల‌నకు శ్రీ‌కారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జ‌న‌వ‌రి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.  

జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ‌డిచిన ఏడాదిలో పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా జ‌రిగిన లోటుపాట్ల‌ను గ్ర‌హించి వాటిపై ప‌ట్టు సాధించేందుకు  రేవంత్‌ ఫోక‌స్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన త‌రువాత 26వ తేదీన రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రేవంత్ శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ప‌థ‌కంతో పాటు మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచే రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. అంత‌కు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ ప్రారంభించ‌బోయే ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌నున్నారు. 

కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్వ‌యంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు బంధు ప‌థ‌కం కింద రెండు ద‌ఫాలుగా ఎక‌రానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి రైతు భ‌రోసాగా నామ‌క‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప‌రిమితి లేకుండా రైతు బంధు ప‌థ‌కం అమ‌లైంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయం యోగ్యం కాని భూములు, రాళ్లుర‌ప్ప‌లు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసిన భూముల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌కు సైతం రైతు బంధు నిధులు ప‌డ్డాయి. దీంతో ప్ర‌జాధ‌నం భారీగా వృథా అయ్యిందని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేవ‌లం వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూముల‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా సాయం అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో ఉంటూ భూమి లేని వ్య‌వ‌సాయ రైతు కుటుంబాల‌కు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాగా పేరును ఖ‌రారు చేశారు. రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌ వుతు న్నాయి. అస‌లైన రైతుల‌కు, భూమిలేని కుటుంబాల‌కు మేలు జ‌రిగేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉంద‌ని పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్త‌కార్డులు రాలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్  హ‌యాంలో అర్హులైన వారంద‌రికీ కొత్త రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి 26వ తేదీనే శ్రీ‌కారం చుట్టాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాల‌న‌లో లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జానీకానికి అందించేందుకు రేవంత్ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతున్నది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.