Publish Date:Jul 11, 2022
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో దూకుడు పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు సీనియర్ల మద్దతు అంతంత మాత్రంగానే లభించింది. లభిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీలో సీనియర్లు చేయని ప్రయత్నం లేదు. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ విజయంతో పార్టీ హై కమాండ్ కూడా రేవంత్ పై విశ్వాసాన్ని ఉంచింది. సీనియర్ల ప్రయత్నాలను పట్టించుకోకుండా ముందుకు సాగమని భరోసా ఇచ్చిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కు వచ్చిన భారీ స్పందనతో ఈ సారి నిరుద్యోగ డిక్లరేషన్ తో యువతకు దగ్గరవ్వాలన్న వ్యూహంతో రేవంత్ ఉన్నారని చెబుతున్నారు. వరంగల్ సభ విజయవంతం అయిన సందర్భంలోనే రాహుల్ గాంధీ స్వల్ప వ్యవధిలోనే మరో సారి రాష్ట్ర పర్యటనక వస్తానని రేవంత్ కు హామీ ఇచ్చారు. అప్పట్లోనే హై కమాండ్ అండ ఉంటుంది.. దూకుడు తగ్గించొద్దు అన్న హామీని రాహుల్ రేవంత్ కు ఇచ్చారనీ, గో ఎహెడ్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆ ఉత్సాహంతోనే ఈ సారి రాహుల్ పర్యటనలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేసీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహణకు రేవంత్ తలపెట్టారు. కుంభస్థలాన్నే ఢీ కొనే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ కు ఉందని చాటడమే లక్ష్యంగా ఆయన సిరిసిల్లను ఎన్నుకున్నారని పరిశీలకులు అంటున్నారు. సిరిసిల్ల సభ వేదికగా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా యువత కాంగ్రెస్ కు చేరువ అవుతారని రేవంత్ భావిస్తున్నారు. కేసీఆర్ తరువాత పార్టీలో వాగ్థాటి ఉన్న నేతగా.. అలాగే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఈ సారి ఎన్నికలలో బలంగా ఢీ కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని చాటడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు.
ముందస్తు సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం రాజకీయ డ్రామాలాడుతున్నాయని రేవంత్ విమర్శించారు. ఆ రెండు పార్టీలూ కాదు.. తాము తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన రేవంత్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ కు బీజేపీ అనుమతి ఎందుకు అని ప్రశ్నించారు. దమ్ముంటే ముందస్తుకు వెళ్లాలని ఆయన బీజేపీ, టీఆర్ఎస్ లకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో ప్రకటించి ఊరుకోవడం కాకుండా ముందుగానే మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయో డిక్లరేషన్ ల ద్వారా ప్రకటించి ప్రజలలో నమ్మకాన్ని కలిగించే కొత్త వ్యూహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తెరలేపారు. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా రచ్చబండలు నిర్వహిస్తున్నారు.
సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్ను ప్రకటించి దానిపై కూడా ప్రజాభిప్రాయాన్ని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని రేవంత్ ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ సర్కార్పై రైతులు, నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఈ డిక్లరేషన్ల ప్రకటనతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-strategic-move-with-declaration-in-sirisilla-meeting-25-139514.html
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.