Publish Date:Jul 12, 2022
ఒక డెబ్బయ్యేళ్ల పెద్దాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. చాలాసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత ఇంటికి అని బయలు దేరాడు. కానీ దారి మర్చిపోయాడు. ఆ సంగతి గ్రహించి ఆయన స్నేహితుడి కొడుకు కార్లో ఇంటి దగ్గర దింపి మరీ వెళ్లాడు. ఇది మతిమరుపునకు పరాకాష్ట.. అంటూ మనవరాలు అందరికీ చెబుతూ తెగ నవ్వుకుంది ఓ పూటంతా. పిల్లలకు, విన్నవాళ్లకు సరదాగా, నవ్వులాటగానే వుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు తాలూకు బాధ అనుభవిస్తేగాని వివరించ డం చాలా కష్టం. మనిషంటే మరచిపోయాడు, పావురం మరచిపోవడమేమిటి?
పక్షులు చాలా దూరమూ వెళుతూంటాయి, మళ్లీ అదే దారిలో తిరిగి వస్తూంటాయి. అది వాటి సహజ లక్షణం. కానీ బ్రిటన్కి చెందిన ఒక పావురం ఒకటీ రెండు కాదు ఏకంగా నాలుగు వేల మైళ్లు దూరం వెళ్లి ఇంటికి దారి మర్చిపోయింది!
ఒక బ్రిటన్ పావురం యుఎస్లో 4,000 మైళ్ల దూరంలో ఎగురుతూ చాలా దూరం వెళ్లింది. చాలాసేపటికి అది బ్రిటన్లోని టైన్సైడ్ ప్రాంతానికి వస్తూ ఇంటి దారి కోల్పోయింది. దాన్ని ఆ తర్వాత పక్షుల సంరక్షణ నిపుణులు గుర్తించి పట్టుకున్నారు. ఈ రేసింగ్ పక్షి విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అని అధికారులు చెప్పారు.
మూడు వారాల క్రితం, ఛానల్ దీవులలోని గ్వెర్న్సీ నుండి హోమింగ్ పావురం బయలుదేరింది. అది ఇంగ్లాండ్ ఈశాన్య ప్రాంతం లోని తన ఇంటికి తిరిగి పోటీ చేయవలసి ఉంది ప్రయాణం అతనికి 10 గంటలు పట్టింది. అయితే, బహుమతి పొందిన పావురం తప్పిపోయింది దానికి ఏమి జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. బాబ్ అనే పేరున్న ఈ రేసింగ్ పావురం వారం రోజుల క్రితం ఛానెల్ ద్వీపం నుంచి వెళ్లింది. గట్టిగా పది గంటలు పట్టింది ఆ ప్రయాణం. అయితే ఆ పావురం కనిపించకపోవడంతో చాలామంది అది ఎక్కువగా కనిపించే ప్రాంతాలన్నీ వెతికారట. అది వాస్తవానికి ఇంగ్లండ్ ఈశాన్యప్రాంతానికి తిరిగి రావాలి. అది తన గూడు వున్న ప్రాంతం. అది వెళ్లిన సంగతీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అది కనపడటం లేదన్న వార్త గుప్పుమంది. అంతే రోజూ దాన్ని చూస్తూ ఆడుకునే పిల్లలంతా దిగులుపడ్డారు.
ఈ మిస్టరీని జూలై ఆరో తేదీన పరిష్కరించారు. ఆ రోజు అలబామాలోని మాన్రో అనే వూళ్లో ఓ పెద్దాయన తోటలో కనపడిందట. ఆ తోట దానికి ఎంతో నచ్చినట్టుంది. అక్కడే వుండడానికి ఇష్టపడింది. బాబ్ అని పిలిచే ఈ పావురం కాళ్లకి ఏదో బ్యాండ్ కట్టి వుంది. దానితో ఇది సముద్రానికి అవతల వేపు యునైటెడ్ కింగ్డమ్కి చెందినది అని పక్షుల సంరక్షణ విభాగం వారు కనుగొన్నారు. అంత దూరం నుంచి వచ్చినా బాబ్ ఆరోగ్యంగానే వుందని అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ పావురం యుకెలోని విన్ టా లోన్ నివాసి అలాన్ టాడ్కి చెందినదని తేలింది. బాబ్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత పొరపాటున అట్లాంటా వెళ్లే ఓడ మీద వాలి అలా సముద్రానికి అవతలి తీరం వేపు వెళ్లిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bird-lost-its-way-back-25-139518.html
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.