రేవంత్ దూకుడు.. 14లోక్ సభ స్థానాల్లో గెలుపే టార్గెట్!

Publish Date:Apr 19, 2024

Advertisement

 తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది.  నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా  ప్ర‌క‌టించాల్సి ఉంది. ముఖ్యంగా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. అందుకు త‌గ్గట్లుగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా సీఎం రేవంత్ రెడ్డి అమ‌లు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని అమలు కాలేదు. అయితే హామీల అమలు విషయంలో రేవంత్ చిత్తశుద్ధి కారణంగా   ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్  గ్రాఫ్ పెరిగింది. మూడు నెల‌ల కాలంలో ఇచ్చిన హామీల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌రిష్క‌రించామ‌ని, ఎన్నిక‌ల కోడ్ తొల‌గించిన వెంట‌నే మిగిలిన హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం ద్వారా వారి నుంచి మ‌రింత మ‌ద్ద‌తు పొందేలా కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీక‌రించింది. 

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే  ప్రపకటించిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.   మే 11వ తేదీ వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శుక్ర‌వారం (ఏప్రిల్ 19) మహబూబ్ నగర్ లో పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌.. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈనెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ర్యాలీ, సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 21న భువనగిరి లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న మధ్యాహ్నం ఆదిలాబాద్ లో నిర్వహించే సభ లో పాల్గోనున్న రేవంత్‌.. 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహిరాబాద్, సాయంత్రం వరంగల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించే స‌భ‌ల్లో పాల్గొంటారు. 25న చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మద్దతుగా ర్యాలీలో పాల్గొని అనంత‌రం జ‌రిగే సభలో రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తారు. ఇలా మే 11వ తేదీ వ‌ర‌కు  రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప‌ర్య‌టన‌లు చేయ‌నున్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి పార్టీలో చేరిక‌ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావులు కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. రెండు రోజుల్లో ఆయ‌న‌సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంది. గ్రేట‌ర్‌లో మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ తో పాటు కొంద‌రు కార్పొరేట‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నుంచి ముఖ్య‌నేత‌లు, ద్వితీయ శ్రేణి నేత‌లు కాంగ్రెస్ లోకి క్యూ క‌డుతుండ‌టంతో పార్టీ బ‌లం రోజురోజుకు పెరుగుతున్నది.   దీంతో రాష్ట్రంలో 17 లోక్‌స‌భ స్థానాల్లో 14  నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమాతో ఉన్నారు. 

కాంగ్రెస్ పార్టీ మూడు నెల‌ల పాల‌నకు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రెఫ‌రెండమ్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ‌కొట్ట‌డం ద్వారా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీది గాలివాటం గెలుపేన‌ని నిరూపించేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  మ‌రోవైపు బీజేపీ అధిష్టానంసైతం కాంగ్రెస్ కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల నేత‌లు రేవంత్ రెడ్డి మూడు నెల‌ల పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇచ్చిన హామీల‌ను అమలు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డానికే అధికారాన్ని వినియోగిస్తున్నార‌ని మాజీ సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌తామ‌ని అన్నారు. అయితే,  బీజేపీ, బీఆర్ ఎస్   నేత‌ల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌ల‌కు రేవంత్ రెడ్డి  ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం ఇస్తూ తిప్పికొడుతున్నారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్ట‌డంతోపాటు.. రాబోయే కాలంలో ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండ‌గా ఉంటుందో స్ప‌ష్టం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ ను రేవంత్ ఏమేర‌కు రీచ్ అవుతాడ‌నే అంశం తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

By
en-us Political News

  
రాత్రి సమయంలో డిన్నర్ చేయడం కోసం అపార్ట్ మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్ కు నడుచుకుంటూ వెడుతున్న శ్రీజవర్మను వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీజ అక్కడికక్కడే మరణించింది.
తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు నివేదికను తనకే అందజేయాలని కూడా సుప్రీం కోర్టు విస్పష్టంగా ఆదేశించింది
హైదరాబాద్ సిటీ నడి మధ్యలోనుంచి మూసీ వెళ్తుంది. గండిపేట్ వరకు ఓకే.. ఆ తర్వాతే మూసీ దుర్గంధభరితంగా మారుతుంది. సిటీలోకి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం 55 కిలోమీటర్లు మూసీ రివర్ ఉంటుంది. ఇదంతా బాగు పడితే ఒక అద్భుతమే అవుతుంది. భవిష్యత్ తరాలకు చాలా మేలు జరుగుతుంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఆయన సినిమాలు సంచలనం. అద్భుత టేకింగ్ తో తనదైన మేకింగ్ స్టైల్ తో అలనాడు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు మరో రికార్డు సృష్టించింది. సత్వర న్యాయం, పటిష్టమైన పోలీసింగ్‌లో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ప్రజలకు న్యాయ సహాయం అందించటంలో, శాంతిభద్రతల్లో ఏపీ టాప్‌లో ఉందని ఇండియా జస్టిస్ రిపోర్టు 2025 వెల్లడించింది.
జ‌నం సొమ్ము ప‌ప్పుబెల్లాల్లా ఖ‌ర్చు చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అదే జ‌నం చేత దారుణ‌మైన ప‌రాభ‌వానికి లోనై ఘోర‌మైన ఓట‌మి పాల‌య్యారు. ఒక‌ప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్ల‌లో కొంద‌ర్ని లాక్కుంటే ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా పోతుంద‌ని బాబును భ‌య‌పెట్టిన జ‌గ‌న్ చివ‌రికి ప్ర‌తిప‌క్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. క‌ర్మ రిట‌ర్న్స్ థియ‌రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మిగిలిపోయారు.
బోయే ఉపరాష్ట్రపతి ఎవరనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్త మవుతోంది. మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవంక అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధి ఎంపిక బాధ్యతను కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించారు.
భాగ్యనగరంలో గన్ కల్చర్ పెరిగిపోతున్నది. అమెరికాను తలదన్నేలా ఇటీవలి కాలంలో భాగ్యనగరంలో కాల్పులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ చందానగర్ లో దుండగులు కాల్పులతో చెలరేగిపోయారు. గ్రేటర్ పరిధిలోనే అత్యంత రద్దీగా ఉండే చందానగర్ లో దుండగులు తుపాకులతో ఖజానా జువెల్లర్స్ లోకి ప్రవేశించి భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలన్న నినాదంతో ఆలోచనపరుల వేదిక ఆధ్యర్యంలో ఈ నెల 4 నుంచి 6 వరకు శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మితమైన ప్రాజెక్టులపై అధ్యాయనం జరిగింది. అలా అధ్యయనానికి వెళ్లి వచ్చిన ఆలోచనాపరుల సంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
ఢిల్లీలో ఒక్క కుక్క కూడా రోడ్లపై క‌నిపించ‌కూడ‌దు. ఎనిమిది వారాల్లోగా వాటిని షెల్ట‌ర్ల‌కు చేర్చండి అంటూ సుప్రీం కోర్టు ఆదేశాల జారీ వెన‌క అస‌లు స్టోరీ ఏంటి? ఎందుక‌ని సుప్రీం కోర్టు అంత క‌ఠిన‌మైన ఆదేశాలు జారీ చేసింది? అని చూస్తే ఢిల్లీలో నానాటికీ కుక్క‌ల బెడద తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృశ్యం క‌నిపిస్తోంది.
మూడేళ్ల‌య్యింది మాకు జీతం పెంచి అని కార్మికులు అంటుంటే, మీక‌స‌లు టాలెంటే లేదు. మేం ఐటీ ఎంప్లాయిస్ క‌న్నా ఎక్కువ వేత‌నాలిస్తున్నాం అని నిర్మాత‌లంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెగ పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా రోజుకో ట్వీట్ పెడుతూ కాకరేపుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తాని ఇప్పడు మోసం చేశారని రగిలిపోతున్నారు.
వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.