ఆశల పల్లకిలో కేసీఆర్!

Publish Date:Apr 19, 2024

Advertisement

అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.  

లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు. 

ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.