మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 22, 2026

Advertisement

 

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం.  పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం.  అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి. 

సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఉద్యోగుల వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరించాలి. దీని ద్వారా పాలనపై ప్రజల్లో మంచి భావన కలుగుతుంది.  మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులు పాలనా పరంగా సామర్ధ్యాలను పెంచుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పని విధానం మార్చుకోవాలి.  క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలి. 

ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరం. పాలనలో సంస్కరణలపై ఉద్యోగులకు, అధికారులకు శిక్షణ ఇప్పించాం. పాత రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి పెద్ద టాస్క్ గా ఉండేది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సులభంగా వాటిని క్లియర్ చేయగలిగే పరిస్థితి ఉంది. వినూత్నంగా ఆలోచన చేయకపోతే  వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి.”అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

పాత కేసుల ట్రేసింగ్

“రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులను, అధికారులను బద్నాం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారు. 

డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పు దారి పడుతున్నారు. పాత కేసులను పరిష్కరిస్తున్నాం. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. శిక్షలు కూడా పడుతున్నాయి. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో నిబంధనలను పక్కాగా పాటించాలి. 

ప్రమాణాల ప్రకారం నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలి. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంఛ్ చేయాల్సి ఉంది. ఈలోగా క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సంరక్షణ, నదీ జలాలను కాలుష్యం నుంచి కాపాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు


 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పారుపూడి రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే దేశంలో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన రాజీనామాకు దారితీసిన ముఖ్య కారణాలు ఏంటంటే.. గత మే నెలలో జరిగిన బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి స్టార్మర్ నాయకత్వ సామర్థ్యంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తింది.
భారతీయ రైల్వేస్ థర్మల్ ప్లాంట్ల నుండి 340 మిలియన్ టన్నుల ఫ్లై యాష్ (బొగ్గు బూడిద) రవాణా కోసం సరికొత్త మెగా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. 40 శాతం డిస్కౌంట్‌తో సిమెంట్, ఇటుకల ధరలను తగ్గించి, వ్యర్థాలను జాతీయ సంపదగా మార్చే ఈ అద్భుతమైన గ్రీన్ ఇనిషియేటివ్ విశేషాలు ఇక్కడ చదవండి.
కర్ణాటకలో ప్రభుత్వ బస్సు ప్రయాణం మరింత ప్రియం కానుంది. డీజిల్ ధరలు, ఉద్యోగుల జీతాల పెంపుతో పాటు రూ. 6,000 కోట్ల అప్పుల్లో ఉన్న రవాణా సంస్థలు 12% వరకు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ కోసం కేరళ పోలీసులు, దేవస్వం బోర్డు అధునాతన ఏఐ (AI) డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలను ప్రవేశపెడుతున్నారు. గత ఏడాది 51 లక్షల మంది భక్తులు దర్శించుకున్న నేపథ్యంలో, తొక్కిసలాటలు నివారించడానికి మరియు 26 పార్కింగ్ స్థలాలను డిజిటలైజ్ చేయడానికి ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య దౌత్య వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనే గందరగోళంలో ఉన్నారా? ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి మరియు మార్కెట్ నిపుణుల కీలక విశ్లేషణ, బంగారం ధరల తాజా అంచనాలు మీకోసం.
ఆసియా పసిఫిక్ రీజియన్‌లోనే మొట్టమొదటిసారిగా హాంగ్‌కాంగ్ వేదికగా జరగనున్న పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2027 (PUMA HYROX 2027) పూర్తి వివరాలు, రికార్డు గణాంకాలు ఇక్కడ చూడండి
హైదరాబాద్‌లో సంచలన గోల్డ్ స్కామ్...
వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలలకు అరుదైన మత్స్య సంపద చిక్కింది. వారు వేసిన వలలో ఏకంగా లక్షల రుూపాయల విలువైనఅరుదైన కచిడి చేపలు మూడు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన తొలి వేటలోనే ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
పాలమూరు జిల్లా దేవరకద్ర వద్ద డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు.
మూసీ నది పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.