టీడీపీ గూటికి పెద్దారెడ్లు!.. వైసీపీలో ఊహించ‌ని ట్విస్ట్‌!.. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్‌

Publish Date:Apr 14, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని పెద్దారెడ్లు ఏకమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణను భారీగా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇంతకాలం సమయం కోసం ఎదురుచూసిన పెద్దారెడ్లు ఇప్పుడు జగన్ పై దండయాత్రకు సమాయత్తం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత జగన్ కు చుక్కలు చూపించాలని నెల్లూరు పెద్దారెడ్లు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండీ ఆ సామాజికవర్గ నేతలు జగన్ కు అంతా తామై పార్టీని నడిపించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడెవరైనా పక్క పార్టీలో ఉంటే నయానో భయానో చెప్పి జగన్ పంచన చేరేలా చేశారు. ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు జగన్ కు దూరంగా ఉన్నా 2019 ఎన్నికల నాటికి అందరూ ఏకమయ్యారు. రెడ్డి రాజ్యం రావాలంటే జగన్ గెలవాలనే నినాదంతో ముందుకెళ్లారు. ఫలితం అనుకున్న దాని కంటే ఆరు రెట్లు ఎక్కువగానే వచ్చింది.

సీన్ కట్ చేస్తే.. రెడ్డి రాజ్యం వచ్చింది.. కాని.. రెడ్లు ఏలడానికి రాజ్యం లేకుండా జగన్ చేశారు అంటున్నారు. ఇతర సామాజికవర్గాల చోటా నేతలకు బడా పదవులు కట్టబెట్టి.. తమను జగన్ తీవ్రంగా అవమానించారనే భావం పెద్దారెడ్లలో గూడుకట్టుకుపోయింది. ఈ మధ్య కాలంలో రాయలసీమకు చెందిన ఓ నేత ‘సమయం లేదు మిత్రమా.. త్వరగా కలుద్దాం.. కార్యాచరణ సిద్ధం చేద్దామ’ని నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల పెద్దారెడ్లను ఏకం చేసే పనిలో పడ్డారట. అందుకు మంత్రివర్గ విస్తరణ తరువాత తమ విశ్వరూపం జగన్ కు చూపించాలని నిర్ణయం తీసుకుంటున్నారట. మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారంతా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఏకం అవుతున్నారని తెలుస్తోంది. 

అసలు జగన్ కు పెద్దారెడ్లకు అంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది..? రాజకీయ పదవుల కోసమే కాదు.. ఆర్థిక వెసులుబాటు కోసం కూడా తాము ఏకం కాక తప్పలేదని పెద్దారెడ్లు చెబుతున్నారు. ఆదాల,  మాగుంట, ఆనం, డీఎల్ ఫ్యామిలీలను వైసీపీలో చేర్చుకోవడంతో జగన్ కు మరింత బలం వచ్చినట్లయింది. ఎన్నికల అనంతరం ముందుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆర్ధిక మూలాలను దెబ్బతీసే విధంగా ఒంగోలు దగ్గర లిక్కర్ ఫ్యాక్టరీ మూతపడేలా జగన్ చేశారు. ఆ తరువాత ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఆయన రాజకీయభిక్ష పెట్టిన అనిల్ కు మంత్రి పదవి ఇచ్చి ఆనంను అనిల్ చేత అవమానపరిచేలా జగన్ ప్రవర్తింపచేశారనే ఆగ్రహం ఉంది. ఇక ఆదాల, మహీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్ర రెడ్డిలను కూడా జగన్ చాలా చిన్నచూపు చూశారంటారు.

ఇలా అవమానాలు భరించి, సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకేను జగన్ రెడ్డి గెలికారు. జీవీకే నెల్లూరు జిల్లా వాసి. మాజీ రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి బంధువు కూడా. ఆనం, ఆదాల లాంటి వారికి సన్నిహితుతుడు జీవీకే. అలాంటి జీవీకే ఆర్దిక ములాలను జగన్ దెబ్బకొట్టారు. దీంతో జీవీకేకు కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పెద్దారెడ్లు అందరినీ ఏకంచేసే పనిలో జీవీకే పడ్డారు. ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టి, అందరినీ ఒకతాటిపై తేవాలని రాజకీయ దిగ్గజం ఆనం రామనారాయణరెడ్డిని జీవీకే కోరారట.

ఈ క్రమంలోనే ఈ సారి టీడీపీలో చేరి జగన్ ను ఇంటికి పంపించాలని వారు చాలా సీరియస్ గా చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు పూర్తిగా సఫలం కావడంతో పెద్దారెడ్లకు మరింత ఊపొచ్చిందంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ కీల‌క రెడ్డి నేత‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌ర‌గ‌డంతో.. ఇక ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్నారు. జిల్లాల వారీగా తిరిగి మిగిలిన రెడ్లను కూడా ఏకంచేసి జగన్ పై దండయాత్ర చేసేందుకు సర్వం సిద్దం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో ఈ నేతలందరూ చంద్రబాబుతో కూడా రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎవరేం చేయాలనే రోడ్ మ్యాప్ కూడా పెద్దారెడ్లు రెడీ చేశారట. జ‌గ‌న్ హ‌యాంలో తీవ్ర ఇబ్బందులకు గురైన పెద్దారెడ్లందరూ టీడీపీలో చేరడం ఖాయమని, ఇక వైసీపీ ఖేల్ ఖతం అనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.