Publish Date:Feb 21, 2022
ఆరడుగుల ఆజానుబాహుడు. హాండ్సమ్. ఫుల్ స్ట్రాంగ్గా ఉంటారు. రెగ్యులర్గా జిమ్ చేస్తుంటారు. వయసు కూడా మరీ పెద్దదేమీ కాదు. 50 ఏళ్లు అంతే. ఆయన్ను చూస్తే.. ఆ అంత ఏజ్ ఉన్నట్టు కూడా కనిపించరు. అలాంటి మేకపాటి గౌతమ్రెడ్డి ఇంత సడెన్గా చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. అంతటి గట్టి శరీరం ఉన్న ఆయన.. అలా ఎలా చనిపోయాడనే చర్చ నడుస్తోంది.
గౌతమ్రెడ్డికి మద్యం, దూమపానంలాంటి అలవాట్లు లేవంటున్నారు. వారం పాటు దుబాయ్లో ఉండి వచ్చారు. నెల క్రితం రెండోసారి కొవిడ్ బారిన పడ్డారు. అంతకుముందు ఓసారి కరోనా సోకింది. బయటకు చూస్తే.. హెల్దీగానే ఉన్నారు. కానీ, రెండుసార్లు కొవిడ్ అటాక్ కావడంతో.. ఇంటర్నల్గా బాడీ డ్యామేజ్ అయుంటుందని అంటున్నారు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరిగుంటుందని అంచనా వేస్తున్నారు వైద్య నిపుణులు.
కరోనా సోకిన వారు తిరిగి కోలుకున్నా.. వారిలో రక్తం చిక్కబడటం లాంటి సమస్యలు వస్తున్నాయి. అలా రక్తం చిక్కబడితే గుండెపోటు వచ్చే అవకాశం అధికం. ప్రస్తుతం మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతోనే మరణించారని అపోలో ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తమ ఆసుపత్రికి వచ్చే సరికి ఆయన శరీరం స్పందించడం లేదని.. ఆయన్ను కాపాడటానికి చాలా శ్రమించినా.. ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు.
ఇక, 50 ఏళ్ల వయసుకే హార్ట్ స్ట్రోక్ రావడం.. అదికూడా ఆరోగ్యంగా ఉండి.. రెగ్యులర్గా వ్యాయామం చేసే వ్యక్తికి.. ఇలా సడెన్ స్ట్రోక్ రావడానికి కారణం.. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్ కావొచ్చని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reasons-behind-mekapati-goutham-reddy-death-25-132064.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.