రాజధాని అంశంపై జగన్ మౌనం.. బొత్స చేతిలో కీలుబొమ్మ అయ్యారా?

Publish Date:Aug 31, 2019

Advertisement

 

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది. ఈ మూడు నెలల్లో వైసీపీ సర్కార్ పాలన ఎలా ఉంది? ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా?లేదా? అని చర్చ జరగాల్సింది పోయి.. రాజధానిగా అమరావతే ఉంటుందా? లేదా? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. 

ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చేలా బొత్స వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. దీంతో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు విపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని, రాజధానిని మార్చేది లేదని సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలనీ.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.

సీఎం జగన్.. ప్రజావేదిక, పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వంటి అంశాలపై ముక్కు సూటిగా వ్యవహరించినప్పుడు.. రాజధాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని విషయంలో మంత్రి బొత్స వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. కాసేపు వరదలు వస్తే అమరావతిలో కష్టం అంటారు, మరోసారి అమరావతిలో నిర్మాణాలకు డబుల్ ఖర్చు అవుతుందంటారు, ఇంకోసారి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. తాజాగా.. ఒక్క కులం కోసమే రాజధాని నిర్మాణం ఉండకూడదన్నారు. మరో సందర్భంలో.. రాజధానిని తరలిస్తున్నామని ఎవరో అంటే మేం సమాధానం చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారే తప్పితే.. అమరావతినే రాజధానిగా ఉంచుతారా లేదా అన్నది కుండబద్ధలు కొట్టినట్లు చెప్పట్లేదు.

బొత్స వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇలాంటి కీలకమైన అంశంపై సీఎం జగన్ ఇంతవరకూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మాట్లాడాల్సిన అంశంపై మాటిమాటికీ బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బొత్స చేతిలో జగన్ కీలుబొమ్మ అయ్యారా? బొత్స చెప్పినట్లు జగన్ నడుచుకుంటున్నారా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఏ అంశంపైనైనా స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్లాలి. ముఖ్యమైన రాజధాని విషయంలో.. స్పష్టమైన ప్రకటన చెయ్యాల్సిన సమయంలో.. డొంకతిరుగుడు మాటలెందుకని విపక్షాలు నిలదీస్తున్నాయి.

ఇప్పటికే రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త కంపెనీలు రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాగైతే.. కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఖజానాకు ఆదాయం రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా సాగాలి. అది పూర్తైతేనే కంపెనీలు ఏపీవైపు చూస్తాయి. లేదంటే మిగతా రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. ఇది ఏపీకి తీరని నష్టం. కానీ ఇవేం పట్టనట్టు రాజధాని విషయంలో ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు?. అసలు జగన్ మనసులో ఏముంది?. జగన్ మౌనాన్ని వీడాలి. రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలి. అంతే తప్ప.. మంత్రులతో నాన్చుడు ప్రకటనలు చేయించడం వల్ల ఇటు రాష్ట్రానికి, అటు వారి పార్టీకి కూడా నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.