టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం?

Publish Date:May 31, 2025

Advertisement

భార‌త‌మ్మ సైన్య‌మేనా?
వీరెంత మంది వ‌ర‌కూ ఉన్నారు?
టీటీడీలో రంగ ప్ర‌వేశం ఎప్పుడు జ‌రిగి ఉండొచ్చు? 

తిరుమ‌ల‌లో త‌ర‌చూ   వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి?  ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి?  త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం..  ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస వివాదాలు న‌డుస్తున్నాయ్. ఆల‌య ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఇవి ఉంటున్నాయ్. వీటి వెన‌క  రెండు వేల వ‌ర‌కూ ఉన్న‌ భార‌త‌మ్మ సైన్యం దాగి ఉందా? అన్న‌దొక డౌట్ ఫుల్ డిబేట్.  ఇంత‌కీ వీరెలా ఈ వ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్నారు? దీనంత‌టికీ కార‌ణం భూమ‌న వంటి  క్రిష్టియ‌న్లు చైర్మ‌న్ కావ‌డ‌మేనా? అన్న‌దొక అనుమానం కాగా..  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడంటే కేవ‌లం భూమ‌న‌కే కాదు.. వైయ‌స్ కి కూడా ఏమంత గౌర‌వం లేదని అంటారు.  ఏడు కొండ‌లు ఎందుకు?  రెండు కొండ‌లు చాలు క‌దా అన్న సీఎం వైయస్. అలాంటి వైయ‌స్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు అనుకుంటే..  ఆయ‌న  కొడుకు జ‌గ‌న్ వ‌చ్చీ రావ‌డ‌మే గొడ‌వ గొడ‌వ‌.

హైంద‌వాల‌యాల్లో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని ఆనాటి  సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం జీవో తేవాల‌ని భావిస్తే కొంద‌రు క్రిష్టియ‌న్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవ‌రికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని చూసిన జ‌గ‌న్   క్రిష్టియ‌న్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌న్నారట‌. ఈ ఆగ్ర‌హంతో ఆయ‌న ఆనాటి ప్ర‌భుత్వం నుంచి ఎల్వీ వైదొలిగారని చెబుతారు. ఆ స‌మ‌యంలో కొన్ని క్రిష్టియ‌న్ సంఘాలు కేకులు క‌ట్ చేసిన  ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వ‌చ్చాయని చెబుతారు. అంతేనా కావాల‌ని తిరుమ‌ల అట‌వీ సిబ్బందికి జీతాలు పెంచ‌క వారి ద్వారా వ‌న్య‌ప్రాణుల‌ను భ‌క్తులు న‌డిచే దారుల్లోకి ర‌ప్పించి.. ఏకంగా చిన్న పిల్ల‌ల ప్రాణాలు తీసే వ‌ర‌కూ తేవ‌డం కూడా అప్ప‌ట్లో పెను దుమారం న‌డిచింది. దీని వెన‌క కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న అనుమానాలున్నాయి. 

ఇక అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న రోజ‌మ్మ అయితే ఏకంగా క్రీస్తు డాల‌ర్ క‌లిగిన కెమెరామెన్ తో స‌హా వ‌చ్చి చేసిన హ‌డావిడి హంగామా మాములుగా లేదని అంటారు.  అంతేనా కిరాక్ ఆర్పీ చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే 30 వేల‌కు పైగా ఆమె సిఫార్సు లెట‌ర్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. దీని వెన‌క కూడా అతి పెద్ద స్కామ్ న‌డిచేద‌ని టాక్. ఇలాక్కూడా రొజ‌మ్మ వెన‌కేసిన‌ట్టుగానూ చెబుతారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని క్రిష్టియ‌న్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాల‌యాల్లోకి క్రిష్టియ‌న్లు ప్ర‌వేశించి.. అప్ప‌ట్లో ఆల‌య ప్ర‌తిష్ట మంట‌గ‌ల‌పాల‌ని చూసేవార‌ని అంటారు. ఆనాటి పాపాల కార‌ణంగానే జ‌గ‌న్ అధికారం కోల్పోయినట్టు అంచ‌నా క‌డ‌తారు..  అయినా స‌రే జ‌గ‌న్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో తాము ప్ర‌వేశ పెట్టిన ఈ బీ- సైన్యాన్ని అడ్డు పెట్టుకునే.. ఇప్పుడు వి త‌ర‌చూ వాదాల‌ు రాజుకునేలా చేస్తున్నారట‌. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని.. భార‌త‌మ్మ అదే ప‌నిగా త‌మ ఇంట్లోనే తిరుమ‌ల సెట్ వేయించార‌నీ చెబుతారు.   లేకుంటే ఎవ‌రో ఒక భ‌క్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అత‌డి ఆలోచ‌న ఏంటంటే త‌న‌కు త్వ‌ర‌గా దైవ ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే భావిద్దాం... బేసిగ్గా వెంక‌న్న‌లాంటి దేవ‌దేవుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు.. అంతా ఆయ‌న మీదే భార‌మేసి.. ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు త‌న మొక్కులు చెల్లించుకుని రావ‌ల్సి ఉంటుంది. 

గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో ఉన్న‌పుడు అనాల్సింది టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అని కాదు. గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్ర‌క్షాళ‌న జ‌రిగేది. కంపార్ట్ మెంట్ల‌లో ఉన్న‌పుడు మ‌న‌కున్న స‌మ‌స్త రేడియేష‌న్ రోగాలు పోతాయ్. కార‌ణం మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బ‌య‌ట ప‌డేస్తామో,  అప్పుడు వాటి తాలూకూ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌భావాల నుంచి దూర‌మ‌వుతాం. అది మ‌న శారీర‌క మాన‌సిక స్థితిగతుల‌కు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ‌కు చెందిన అచ్చారావ్ అనే ఆ భ‌క్తుడు  చేసిందే ఒక త‌ప్ప‌యితే.. దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భ‌యం లేక పోవాలి? 

స‌రే ఇప్పుడున్న జ‌మానాలో సెల్ ఫోన్లు కామ‌నే కాద‌న‌డం లేదు. కానీ వెంక‌న్న లాంటి  మ‌హిమాన్విత దేవుడి విష‌యంలో న‌మ్మ‌కం వారిని ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు న‌మ్మ‌కాన్ని అతిక్ర‌మించి బ‌య‌ట‌కొచ్చేలా చేశారంటే దాన‌ర్ధ‌మేంటంటే వెంక‌న్న అంటే భ‌యం లేద‌ని. భక్తి లేదని. ఇలాంటి వారు అయితే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ కి చెందిన వారు, లేదంటే అన్య‌మ‌త‌స్తులే అయి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు శ్రీవారి భ‌క్తులు. 

By
en-us Political News

  
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.