గాంధీ భవన్ ను విడిచిపెట్టేది లేదు: రాపోలు ఆనందభాస్కర్
Publish Date:Mar 26, 2012
Advertisement
తాను రాజ్యసభకు ఎన్నికయినప్పటికీ గాంధీభవన్ ను మాత్రం విడిచిపెట్టబోనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ స్పష్టం చేశారు. ఆయన తెలుగువన్.కామ్ ప్రతినిధితో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటానని, మిగిలిన సమయంలో గాంధీభవన్ లోనే అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. గాంధీభవన్ లోనే తన రాజకీయ జీవితం ఆరంభమైందని, గాంధీభవన్ లో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆనందభాస్కర్ అంటున్నారు. తెలంగాణా అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రత్యేక తెలంగాణాను తేవాల్సిన బాధ్యత జాతీయ పార్టీలదేనన్నారు. జాతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు భయపడి తెలంగాణా విషయంలో చొరవ చూపించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందేనని, ఆ పార్టీ ద్వారానే ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న కార్యకర్తలకు సైతం కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభిస్తుందనడానికి తన ఉదంతమే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని చెడిపోయిన వారెవరూ లేరన్నారు. రాజ్యసభ టిక్కెట్ కోసం కోట్లాది రూపాయలు సైతం కుమ్మరించడానికి అనేకమంది సిద్ధంగా ఉన్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తనలాంటి నిరుపేదకు రాజ్యసభ అవకాశం కల్పించిందని, అందుకు ఆ పార్టీకి జీవితాంతం ఋణపడి ఉంటానని ఆయన అంటున్నారు.
http://www.teluguone.com/news/content/rapolu-anand-bhaskar-congress-party-leader-24-12921.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





