అత్యాచార భాదితురాలిని రేప్ చేసిన పోలీసులు

Publish Date:Dec 25, 2012

Advertisement

 

ఒక వైపు ‘దామిని’ (డిల్లీ బాదితురాలికి, ఆందోళనచేస్తున్న యువత పెట్టుకొన్న పేరు.) సామూహిక అత్యాచారం పై డిల్లీ నగరం అట్టుడికిపోతున్న ఈ తరుణంలో అంతకంటే హీనాతిహీనమయిన సంఘటనలు ఒక్కొకటిగా నిత్యం వెలుగులోకి వస్తూనేఉన్నాయి.

 

ఒక కుటుంబం తనకు అడిగినప్పుడు ఆహారం ఈయనందుకు పగబట్టి, ఇంట్లో అక్కపక్కలోనిద్రిస్తున్న పాపం,పుణ్యం తెలియని ఐదు సం.ల పసిపిల్లని ఒక క్రూర మగమృగం ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేయగా, మన ఊరి పెద్దాయనే అని నమ్మి స్కూటరు ఎక్కి ఇంటికి జేరుకోవలనుకొన్న ఒక 7వ క్లాసు చదివే విద్యార్దిని ఘోరంగా బలత్కారింపబడింది. మణిపూర్ రాష్ట్రంలో అందరి ముందూ ఒక అధికారి సినిమా నటితో అసభ్యంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చెడు.

 

మదమెక్కిన మగాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటే, అటువంటి వారిని కటినంగా శిక్షించాల్సిన మన రక్షకబటులు స్వయంగా ఆ నేరానికి పాల్పడుతూ ఇక ప్రజలు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలీని పరిస్తితిని కల్పిస్తున్నారు.

 

కంచే చేను మేసినట్లు గా కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. గత నెల నవంబరులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువతిని కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసారు. తీవ్ర మానసిక శారీరిక క్షోభ అనుభవిస్తున్న ఆమె కుటుంబం దైర్యంచేసి అంబేద్కర్ నగర్ లో ఉన్న పోలీసుస్టేషనులో పిర్యాదు చేసారు. అయితే, అక్కడా కొన్ని మగ మృగాలున్నాయని ఆమెకి, ఆమె కుటుంభ సభ్య్యులకీ తెలియదు పాపం. ఒకవేళ, తెలిసుంటే అసలు పిర్యాదే చేసిఉండేవారు కాదేమో.

 

స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ దృష్టి ఆమెపై పడింది. కొన్ని రోజులు స్టేషన్ చుట్టూ ఆమెను తిపించుకోన్నాక, “నీకేసును ఫజియబాదులో ఉన్న డి.ఐ.జి.గారికి చెప్పుకొన్నట్లయితే దోషులకు వెంటనే శిక్షపడేలా చేయోచ్చు” అని పోలీసు ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ చెప్పినప్పుడు అతనిని అమాయకంగా నమ్మిన ఆ యువతి అతని పోలీస్ జీప్ ఎక్కింది. ఆమెను ఫజియాబాద్ కు బదులు స్థానిక హోటల్ కి తీసుకువెళ్లి ఆమెను బలాత్కారం చేసాడు. అతనితో బాటు వచ్చిన అక్బరాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ ఎ.కె. ఉపాద్యాయ్ కూడా ఆమెపై అత్యాచారం చేసాడు. తనను కాపాడవలసిన ఇద్దరు రక్షక భటుల చేతుల్లోనే మరోమారు తానూ అత్యాచారానికి గురవడం ఆ యువతికి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. అయితే, ఆఖరు ప్రయత్నంగా ఎలాగో వీలుచూసుకొని అదే ఊరులో ఉన్న తన స్నేహితురాలికి తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా తన పరిస్తితి తెలియజేస్తూ కాపాడవలసినదిగా మెసేజ్ పంపగలిగింది. అది అందుకొన్న ఆమె స్నేహితురాలు వెంటనే పోలీసు ఆఫీసరు (యస్.యస్.పి.) డి.యస్. యాదవ్ ను అప్రమత్తం చేయగానే, ఆయన తన సిబ్బందిని తీసుకొని ఆ యువతిపై అత్యాచారం జరుగుతున్నహోటల్ కి చేరుకొని, ఇంకా తమ మధనఖండాని కొనసాగిస్తున్న తన ఇద్దరు పోలీసు ఆఫీసరులను పట్టుకొన్నారు.

 

అయితే, ఆ యువతి అప్పటికి పోలీసు కబంధ హస్తాలలోంచి బయట పడగలిగింది. గానీ, తనపై అత్యాచారం చేసిన ఇద్దరు పోలీసు ఆఫీసరులకు శిక్ష పడేలా మాత్రం చేయలేకపోయింది. నేరస్తులిద్దరూ పోలీసు శాఖకే చెందినవారయి ఉండటమే దానికి కారణం. ఆమె ఇప్పుడు ఇక ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే నేరుగా ఒక లేఖ వ్రాసి తనగోడు వెళ్ళబోసుకోంది. అయితే, ముఖ్యమంత్రి ఇంకా స్పందిచేడా లేదా అనేది ఇంకా తెలియలేదు.

 

ఇటువంటి దయనీయ పరిస్తితుల్లోకి నెట్టిన కిరాతుకులను నిందించాలో లేక తనను కాపాడవలసిన వారే కభళించిన రక్షకభటులని శిక్షించాలని అడగాలో ఆమెకి తెలియట్లేదు.

 

డిల్లీలో జరిగిన అన్యాయాన్ని వేలదిగొంతులు ఖండిస్తూ దోషులకు ఉరిశిక్ష వేయవలసిందే అని ఉద్యమిస్తుండగా, మరోపక్క ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ అబల ఒంటరిపోరాటం చేస్తోందిప్పుడు. ఆమెకి మద్దతుగా ఒక్క గొంతుకూడా ఎందుకు పలకట్లేదో మరితెలియదు. ఎవరి మద్దతూ దొరకని అటువంటి వారికి న్యాయం జరగుతుందని అనుకోలేము. ఎందుకంటే, కుల రాజకీయాలు చేయడంలో మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో ‘మనోడయితే’ ఇక ఏ నిబందనలూ అతనిని ఏమి చేయలేవు.

 

కొసమెరుపు ఏమిటంటే నిన్న రాత్రి మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణగారు అసలు “ఆడవాళ్ళూ ఎప్పుడు ఇంట్లో ఉండాలో ఎప్పుడు వీధులోకి రావచ్చునో తెలుసుకోకపోతే ఎలాగా” అని అసహనం వ్యక్తం చేసారు. అంతేగాకుండా “స్వాతంత్రం వచ్చిందకదాని అర్ధరాత్రీ అపరాత్రీ చూడకుండా ఆడవాళ్ళూ వీధులోకి వస్తే మరిలాగే ఉంటుంది పరిస్తితి” అని కూడా ఉద్బోదించారు. అయినా, జరిగినది “చిన్నసంఘటనే” అయినప్పటికీ తమ పార్టీ నేత స్వయంగా, అర్ధరాత్రి అనికూడా చూడకుండా వీధుల్లోకివచ్చి ఉద్యమం చేస్తున్న విద్యార్దులతో మాట్లాడటం అంటే గొప్పవిషయమే కదా అని ప్రజలని ప్రస్నించేరు ఆయన. ఇటువంటి నేతలు, పోలీసు వ్యవస్థా మనకున్నపుడు మనం గర్వపడక ఆందోళనలు చేయడం అవివేకం కాదా?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.