రాంగోపాల్ వర్మ రిటర్న్స్

Publish Date:Sep 30, 2015

Advertisement

 

దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరు చూస్తుంటే పనిలేని మంగలాడు పిల్లి బుర్ర గోరిగాడనే పాతకాలం సామెత ఒకటి గుర్తుకు వస్తోంది. రాజమౌళి, కోట్ల శివ వంటి ఆయన తోటి దర్శకులు అద్బుతమయిన సినిమాలు తీసి తమ సత్తా చాటుకొని ప్రజాధారణ పొందుతుంటే, రాంగోపాల్ వర్మ మాత్రం వారితో పోటీపడి సినిమాలు తీయలేక, వారు తీస్తున్న సినిమాల గురించి, వారి అభిమానుల గురించి, చిరంజీవి 150వ సినిమా గురించి ట్వీటర్ మెసేజులు పెడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ఆపసోపాలు పడుతున్నారు.

 

బాహుబలి కంటే గొప్ప సినిమా తీయకపోతే చిరంజీవి స్థాయికి తగదని, పూరీ జగన్నాద్ తో సినిమా తీయడం కంటే రాజమౌళితోనే చిరంజీవి సినిమా చేయడం మంచిదని ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు వేసిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ట్వీటర్ మెసేజులు పెట్టారు.

 

ట్వీటర్లో మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి తక్కువ ఫాలోయర్లు ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మహేష్ బాబు కంటే పవన్ కళ్యాణ్ ఆలశ్యంగా ట్వీటర్లో ప్రవేశించడం వలననే బహుశః ఆయనకి తక్కువ ఫాలోయింగ్ ఉండి ఉండ వచ్చనుకొన్నా ఆయన వంటి ఒక సూపర్ స్టార్ ఒకసారి ట్వీటర్లో ప్రవేశించగానే అమాంతం ఫాలోయర్ల సంఖ్య పెరగాలి. కానీ హీరోయిన్ సమంతకి ఉన్నంత ఫాలోయింగ్ కూడా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి లేకపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తోందని మెసేజ్ పెట్టారు. దీనికి గల కారణాల గురించి రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులలో ఎక్కువ మందికి ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను ఏవిధంగా ఉపయోగించాలో తెలియనందునే ఆయనను ట్వీటర్లో ఫాలో కాలేకపోతున్నారని, కనుక వారు ఒకరికొకరు సహకరించుకొని సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.

 

పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి అంత తక్కువ ఫాలోయింగ్ ఉండటం ఆయన అభిమానిగా తనకు చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. “నేను పవన్ కళ్యాణ్ నటన, డ్యాన్సులని చాలా ఇష్టపడతాను. కాని ఆయన రాజకీయాలను కాదు,” అని వర్మ తన మేసేజులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ పేజిలో రైతుల సమస్యల గురించి ఎక్కువగా మెసేజులు పెడుతుంటారని అందుకే తను కూడా ఆయనని ఫాలో చేయడం లేదని వర్మ తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయదలచుకొంటున్నారు కనుక ముందుగా ట్వీటర్లో తన అభిమానుల సంఖ్య పెంచుకోవాలని వర్మ సూచించారు.

 

పవన్ కళ్యాణ్ ట్వీటర్లోకి చాలా ఆలస్యంగా ప్రవేశించారని రాంగోపాల్ వర్మే చెపుతున్నారు. ట్వీటర్లో ఆయన తన సినిమాల గురించి కాకుండా రాజకీయాలు, రైతు సమస్యల గురించి మాత్రమే మెసేజులు పోస్ట్ చేస్తున్నారని అందుకే తను కూడా ఆయన్ని ఫాలో అవడం లేదని చెప్పారు. అటువంటప్పుడు మళ్ళీ ఈ వెర్రిమొర్రి ప్రశ్నలు, సలహాలు ఎందుకు ఇస్తున్నట్లు?

 

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫాలోయర్ల గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా చాలా అవివేకంగా ఉన్నాయి. మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన ట్వీటర్ పేజీని తన సినిమా విశేషాల గురించి, ఇతర సినిమాల కబుర్లతో అప్ డేట్ చేస్తుంటారు. కనుక సహజంగానే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తన ట్వీటర్ పేజీలో తన సినిమాల గురించి ఒక్క అప్ డేట్ కూడా పెట్టలేదు. కేవలం రాజకీయాలు, రైతుల సమస్యల గురించి మాత్రమే పెడుతుంటారు. అది కూడా ఏ మూడు నాలుగు నెలలకో ఒకసారి. పవన్ కళ్యాణ్ ఆగస్ట్ 28న తన ట్వీటర్ అప్ డేట్ చేసారు. మళ్ళీ అప్పటి నుండి ఇంతవరకు ఒక్క మెసేజ్ కూడా పోస్ట్ చేయలేదు. అసలు యాక్టివ్ గా లేని ట్వీటర్ పేజీని సందర్శించి ప్రయోజనం ఏమిటి? పైగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమా విశేషాలు వినాలనుకొంటారే తప్ప రాజకీయాల గురించి కాదు. రాజకీయాలపై కూడా ఆసక్తి ఉన్న అభిమానులు ఆయనని ఫాలో అవుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు తన ట్వీటర్ పేజిని అప్ డేట్ చేయనప్పుడు వారు మాత్రం ఏమి చేయగలరు?

 

ప్రపంచంలో చాలా మంది ప్రముఖులకు లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. కానీ దాని వలన పవన్ కళ్యాణ్ కొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ రాంగోపాల్ వర్మకి మాత్రం అందులో ఏదో పెద్ద తప్పు కనబడుతోంది ఎందుకో...బహుశః పనిపాటు లేకపోవడం వలననేమో. ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధంగా వృధా ప్రయత్నాలు చేస్తూ కాలక్షేపం చేసే బదులు వీలయితే నాలుగు మంచి, గొప్ప సినిమాలు తీసి ఆయన తన సామర్ధ్యం నిరూపించుకొంటే బాగుంటుంది కదా.

By
en-us Political News

  
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.