Publish Date:Aug 11, 2022
వడ్డించేవాడు మనవాడైతే భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఫరవాలేదంటారు. అలాగే మనవాడైతే చాలు లోపాలన్నీ కూడా సుగుణాలుగానే కనిపిస్తాయనివ కూడా అంటారు. ఇప్పుడు అమిత్ షాపై రాజ్ నాథ్ సింగ్ పొడగ్తలు చూస్తే అది నిజమేనని పించక మానదు.
కేంద్రంలో ప్రభుత్వ విజయాలన్నీ అమిత్ షా ఖాతాలో వేసే ప్రయత్నం చేసిన రాజ్ నాథ్ సింగ్ వైఫల్యాల గురించి ఇసుమంతైనా మాట్లాడలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసేలా గోవా తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసిన ఉదంతాలనూ ప్రస్తావించలేదు. అఖరికి శివసేనను నిలువునా చీల్చి మహా రాష్ట్రలో షేండేను గద్దెనక్కించిన సంగతీ మాట్లాడలేదు.. కానీ బీజేపీ విజయాలకు తెరవెనుకనున్న శక్తి అమిత్ షాయే అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అమిత్ షా గాంభీర్యం వెనుక కొండంత మానవత్వం ఉందని చెప్పారు.
అమిత్ సా ప్రసంగాలను గ్రంథస్తం చేసిన శబ్దాంత్ పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన అమిత్ షాను అరుదైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. పేరు ప్రఖ్యాతల కోసం ఇసుమంతైనా పాకులాడని నిరాడంబరడుగు అమిత్ షా అని చెబుతూ పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తారన్నారు. తెర వెనుక ఉంటూనే పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తారని పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన గాంభీర్యం వల్లనే జనం ఆయనను వేరుగా అర్ధం చేసుకుంటారని అన్నారు.
పలు విషయాలను అవగాహన చేసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు ఆయన టైమ్ మేనేజ్ చేసే తీరు తనను అబ్బుర పరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇంతెందుకు రాజ్ నాథ్ సింగ్ మాటల్లో అమిత్ షా జీవితమే ఒక ప్రయోగశాల. ఆరోపణలను ఎదుర్కొని జైల్లో గడిపినా నిర్దోషిగా అమిత్ షా బయటకు వచ్చారనీ, అయినా ఎన్నడూ తనపై అసత్య ఆరోపణలను చేసిన వారిని పన్నెత్తు మాట అనలేదనీ, ఏ రోజూ రాద్ధాంతం చేయలేదనీ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లారని పొగిడేస్తూ పనిలో పనిగా.. ఈడీ విచారణకు పిలవడంపై రాద్ధాంతం చేసి ఆందోళనలకు దిగిన సోనియా, రాహుల్ గాంధీలను పరోక్షంగా విమర్శించారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్, అర్టికల్ 370పై అమిత్ షా చేసిన ప్రసంగాలు బ్రహ్మాండమని ఆకాశానికి ఎత్తివేసిన రాజ్ నాథ్ సింగ్ శబ్దాంక్ పుస్తకం భవిష్యత్ తరాలకు ఒక దీపస్తంభంగా నిలుస్తుందని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajnathsingh-praises-amitsha-as-great-orator-39-141712.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.