Publish Date:Aug 11, 2022
వడ్డించేవాడు మనవాడైతే భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఫరవాలేదంటారు. అలాగే మనవాడైతే చాలు లోపాలన్నీ కూడా సుగుణాలుగానే కనిపిస్తాయనివ కూడా అంటారు. ఇప్పుడు అమిత్ షాపై రాజ్ నాథ్ సింగ్ పొడగ్తలు చూస్తే అది నిజమేనని పించక మానదు.
కేంద్రంలో ప్రభుత్వ విజయాలన్నీ అమిత్ షా ఖాతాలో వేసే ప్రయత్నం చేసిన రాజ్ నాథ్ సింగ్ వైఫల్యాల గురించి ఇసుమంతైనా మాట్లాడలేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేసేలా గోవా తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చివేసిన ఉదంతాలనూ ప్రస్తావించలేదు. అఖరికి శివసేనను నిలువునా చీల్చి మహా రాష్ట్రలో షేండేను గద్దెనక్కించిన సంగతీ మాట్లాడలేదు.. కానీ బీజేపీ విజయాలకు తెరవెనుకనున్న శక్తి అమిత్ షాయే అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అమిత్ షా గాంభీర్యం వెనుక కొండంత మానవత్వం ఉందని చెప్పారు.
అమిత్ సా ప్రసంగాలను గ్రంథస్తం చేసిన శబ్దాంత్ పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన అమిత్ షాను అరుదైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. పేరు ప్రఖ్యాతల కోసం ఇసుమంతైనా పాకులాడని నిరాడంబరడుగు అమిత్ షా అని చెబుతూ పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తారన్నారు. తెర వెనుక ఉంటూనే పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తారని పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన గాంభీర్యం వల్లనే జనం ఆయనను వేరుగా అర్ధం చేసుకుంటారని అన్నారు.
పలు విషయాలను అవగాహన చేసుకునేందుకు, అధ్యయనం చేసేందుకు ఆయన టైమ్ మేనేజ్ చేసే తీరు తనను అబ్బుర పరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇంతెందుకు రాజ్ నాథ్ సింగ్ మాటల్లో అమిత్ షా జీవితమే ఒక ప్రయోగశాల. ఆరోపణలను ఎదుర్కొని జైల్లో గడిపినా నిర్దోషిగా అమిత్ షా బయటకు వచ్చారనీ, అయినా ఎన్నడూ తనపై అసత్య ఆరోపణలను చేసిన వారిని పన్నెత్తు మాట అనలేదనీ, ఏ రోజూ రాద్ధాంతం చేయలేదనీ అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు పిలిచినా వెళ్లారని పొగిడేస్తూ పనిలో పనిగా.. ఈడీ విచారణకు పిలవడంపై రాద్ధాంతం చేసి ఆందోళనలకు దిగిన సోనియా, రాహుల్ గాంధీలను పరోక్షంగా విమర్శించారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్, అర్టికల్ 370పై అమిత్ షా చేసిన ప్రసంగాలు బ్రహ్మాండమని ఆకాశానికి ఎత్తివేసిన రాజ్ నాథ్ సింగ్ శబ్దాంక్ పుస్తకం భవిష్యత్ తరాలకు ఒక దీపస్తంభంగా నిలుస్తుందని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajnathsingh-praises-amitsha-as-great-orator-25-141713.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.