ఊహించని ప్రధాని రాజీవ్!

Publish Date:May 14, 2022

Advertisement

భారతజాతీయ కాంగ్రేస్ గాంధీ-నెహ్రు కుటుంబాల వారసత్వ పార్టీగా అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి ఈ పార్టీనే దేశాన్ని నడిపిస్తూ వచ్చింది. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి దగ్గర సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రు తరువాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమెకు పుట్టిన ఇద్దరు కొడుకులలో రాజీవ్ గాంధీ పెద్దవాడు కాగా, సంజయ్ గాంధీ చిన్నవాడు.

రాజకీయ కుటుంబంలో పుట్టినా చిన్నతనం నుండి రాజీవ్ గాంధీకి ఎలాంటి ఆసక్తి  లేదని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. ఆయన ఏ రోజూ రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని కోరుకోలేదు. అయితే ఎలాంటి ఆసక్తి లేని రాజీవ్ భారతదేశానికి అతి చిన్న వయసు ప్రధానిగా ఎలా ఎంపికయ్యాడు?? ఆయన మరణం ఎలా సంభవించింది?? ఆయన ప్రధానిగా చేసిన కొద్ది కాలంలో దేశంలో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి?? 

బాల్యం, విద్యాభ్యాసం!!

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 బోంబేలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. రాజీవ్ చిన్నతనం ఆయన తాతగారు అయిన నెహ్రూతో గడిచింది. తరువాత డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు.

స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని ఆయన తోటి విద్యార్థులు  చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురంచి ఆయ‌నకు ఆసక్తి కాదు. అయితే సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్ర‌ఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్య‌మైన‌వి.

ఈయన ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ప్లయింగ్  క్లబ్ లో సభ్యత్వం తీసుకుని ఎంట్రన్స్ ఎక్సమ్ పాసయ్యి కమర్షియల్ ఫైలట్ గా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఫైలట్ గా ఎంపికయ్యి, ఫైలట్ గా కొత్త జీవితం మొదలుపెట్టారు.

పెళ్లి, పిల్లలు!!

ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న సమయంలోనే ఇంగ్లీష్ చదివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. రాహుల్, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉండేవారు.

రాజకీయ ప్రవేశం!!

1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు.

రాజీవ్ పాలనలో ముఖ్య విషయాలు!!

1982 న‌వంబ‌ర్‌లో భార‌త్ ఆసియా క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌పుడు అంత‌కు చాలా సంవ‌త్స‌రాల ముందు జ‌రిగిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి స్టేడియంలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని రాజీవ్‌గాంధీ విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఇది ఆయన సమర్త్యాన్ని బయటకు తెలిసేలా చేసింది. 

ప్రధానిగా నిర్ణయాలు!!

ఇందిరా గాంధీ మరణం తరువాత ఈయన పాలనలో ప్రధానిగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముఖ్యమైనది. ఎన్నికైన పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తరువాత ఎన్నికలు వచ్చేవరకు పార్టీలు మారడానికి వీల్లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

అంతేకాకుండా ఈయన కాలంలో మైనారిటీలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందుకే ఈయన పాలనలో మైనారిటీలకు పెద్ద పీట వేసినట్టు చెబుతారు.

ఇంకా ఆర్థిక విధానం పరంగా రాజీవ్ నిర్ణయాలు కొంచం సంచనాలు అయ్యాయి. ప్రైవేట్ ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని, ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేలా నిర్ణయాలు జరిగాయి . ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మరియు పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థను బాహ్య ఆర్థిక ప్రభావాలకు తెరతీస్తుందని అందరూ భావించారు. 

అయితే గ్రామీణ మరియు గిరిజన ప్రజలు వాటిని ధనవంతులకు మరియు నగరాల్లో నివసించేవారికి అనుకూలమైన సంస్కరణలుగా భావించి నిరసన వ్యక్తం చేశారు. 

ఈయన  సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్‌లైన్స్, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్‌లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించారు. 1986లో, అతను భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ, ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది.

మరణం!!

జూలై 1987లో గాంధీ ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు . ఈ ఒప్పందం తమిళం-మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను ఊహించింది, LTTEని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది.  ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత, విజిత రోహన అనే గౌరవ గార్డు తన రైఫిల్‌తో రాజీవ్ భుజంపై కాల్చారు. అయితే ఆయన ఇది పసిగట్టి తప్పుకోవడం వల్ల భుజానికి మాత్రమే తగిలింది. నిజానికి అది తలకు పడాల్సింది. 

రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ 21 మే 1991న, శ్రీపెరంబుదూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు జరిగింది.  హత్యకు గురైన మద్రాసు నుండి దాదాపు 40 కిమీ దూరంలో ఇది ఉంది. రాత్రి 10:10 గంటల  తర్వాత తెన్మొళి రాజరత్నంగా గుర్తించబడిన ఒక మహిళ - లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సభ్యురాలుగా రాజీవ్ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించింది.  అయితే ఆమె కిందకు వంగినప్పుడు ఆమె తన శరీరానికి అమార్చుకున్న బాంబులను పేల్చింది. ఈ సంఘటనలో రాజీవ్, రాజారత్నం అనే మహిళతో సహా  14 మంది మరణించారు.

ఇలా అనుకోకుండా ప్రధానిగా మారి మరణం బారిన పడింవారు రాజీవ్ గాంధీ.


◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.