ఊహించని ప్రధాని రాజీవ్!

Publish Date:May 14, 2022

Advertisement

భారతజాతీయ కాంగ్రేస్ గాంధీ-నెహ్రు కుటుంబాల వారసత్వ పార్టీగా అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి ఈ పార్టీనే దేశాన్ని నడిపిస్తూ వచ్చింది. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి దగ్గర సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రు తరువాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమెకు పుట్టిన ఇద్దరు కొడుకులలో రాజీవ్ గాంధీ పెద్దవాడు కాగా, సంజయ్ గాంధీ చిన్నవాడు.

రాజకీయ కుటుంబంలో పుట్టినా చిన్నతనం నుండి రాజీవ్ గాంధీకి ఎలాంటి ఆసక్తి  లేదని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. ఆయన ఏ రోజూ రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని కోరుకోలేదు. అయితే ఎలాంటి ఆసక్తి లేని రాజీవ్ భారతదేశానికి అతి చిన్న వయసు ప్రధానిగా ఎలా ఎంపికయ్యాడు?? ఆయన మరణం ఎలా సంభవించింది?? ఆయన ప్రధానిగా చేసిన కొద్ది కాలంలో దేశంలో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి?? 

బాల్యం, విద్యాభ్యాసం!!

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 బోంబేలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. రాజీవ్ చిన్నతనం ఆయన తాతగారు అయిన నెహ్రూతో గడిచింది. తరువాత డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు.

స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని ఆయన తోటి విద్యార్థులు  చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురంచి ఆయ‌నకు ఆసక్తి కాదు. అయితే సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్ర‌ఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్య‌మైన‌వి.

ఈయన ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ప్లయింగ్  క్లబ్ లో సభ్యత్వం తీసుకుని ఎంట్రన్స్ ఎక్సమ్ పాసయ్యి కమర్షియల్ ఫైలట్ గా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఫైలట్ గా ఎంపికయ్యి, ఫైలట్ గా కొత్త జీవితం మొదలుపెట్టారు.

పెళ్లి, పిల్లలు!!

ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న సమయంలోనే ఇంగ్లీష్ చదివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. రాహుల్, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉండేవారు.

రాజకీయ ప్రవేశం!!

1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు.

రాజీవ్ పాలనలో ముఖ్య విషయాలు!!

1982 న‌వంబ‌ర్‌లో భార‌త్ ఆసియా క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌పుడు అంత‌కు చాలా సంవ‌త్స‌రాల ముందు జ‌రిగిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి స్టేడియంలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని రాజీవ్‌గాంధీ విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఇది ఆయన సమర్త్యాన్ని బయటకు తెలిసేలా చేసింది. 

ప్రధానిగా నిర్ణయాలు!!

ఇందిరా గాంధీ మరణం తరువాత ఈయన పాలనలో ప్రధానిగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముఖ్యమైనది. ఎన్నికైన పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తరువాత ఎన్నికలు వచ్చేవరకు పార్టీలు మారడానికి వీల్లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

అంతేకాకుండా ఈయన కాలంలో మైనారిటీలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందుకే ఈయన పాలనలో మైనారిటీలకు పెద్ద పీట వేసినట్టు చెబుతారు.

ఇంకా ఆర్థిక విధానం పరంగా రాజీవ్ నిర్ణయాలు కొంచం సంచనాలు అయ్యాయి. ప్రైవేట్ ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని, ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేలా నిర్ణయాలు జరిగాయి . ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మరియు పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థను బాహ్య ఆర్థిక ప్రభావాలకు తెరతీస్తుందని అందరూ భావించారు. 

అయితే గ్రామీణ మరియు గిరిజన ప్రజలు వాటిని ధనవంతులకు మరియు నగరాల్లో నివసించేవారికి అనుకూలమైన సంస్కరణలుగా భావించి నిరసన వ్యక్తం చేశారు. 

ఈయన  సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్‌లైన్స్, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్‌లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించారు. 1986లో, అతను భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ, ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది.

మరణం!!

జూలై 1987లో గాంధీ ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు . ఈ ఒప్పందం తమిళం-మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను ఊహించింది, LTTEని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది.  ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత, విజిత రోహన అనే గౌరవ గార్డు తన రైఫిల్‌తో రాజీవ్ భుజంపై కాల్చారు. అయితే ఆయన ఇది పసిగట్టి తప్పుకోవడం వల్ల భుజానికి మాత్రమే తగిలింది. నిజానికి అది తలకు పడాల్సింది. 

రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ 21 మే 1991న, శ్రీపెరంబుదూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు జరిగింది.  హత్యకు గురైన మద్రాసు నుండి దాదాపు 40 కిమీ దూరంలో ఇది ఉంది. రాత్రి 10:10 గంటల  తర్వాత తెన్మొళి రాజరత్నంగా గుర్తించబడిన ఒక మహిళ - లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సభ్యురాలుగా రాజీవ్ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించింది.  అయితే ఆమె కిందకు వంగినప్పుడు ఆమె తన శరీరానికి అమార్చుకున్న బాంబులను పేల్చింది. ఈ సంఘటనలో రాజీవ్, రాజారత్నం అనే మహిళతో సహా  14 మంది మరణించారు.

ఇలా అనుకోకుండా ప్రధానిగా మారి మరణం బారిన పడింవారు రాజీవ్ గాంధీ.


◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.