రాహుల్ శల్య సారధ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ పని సరి

Publish Date:Jan 4, 2014

Advertisement

 

అసలే రాష్ట్ర విభజనతో కుదేలయియిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు మూలిగే ముసలి నక్కపై తాటి పండుపడినట్లు నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ రిటర్మెంట్ ప్రకటనతో మరో గడ్డు సమస్య ఎదురవనుంది. ఇంతవరకు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోతోంది. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాక సీమాంధ్ర కాంగ్రెస్ వ్యవహారాలలో కూడా ఆయన వ్రేలు పెడితే, ఇక తమ పని గోవిందా! అని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బయపడుతున్నారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై ఉన్నవ్యతిరేఖత ఆయన రాకతో మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పైగా రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు ఎన్నికల పొత్తులకి సిద్దమవుతున్నఈ సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్టీకి శల్యసారద్యం చేస్తే చేజేతులా ఉన్న కొద్దిపాటి అవకాశం కూడా చెడుతుంది.

 

మంచి పరిపాలనా దక్షులుగా పేరు పొందిన చంద్రబాబు, మోడీ ఒకపక్క, అనుభవరహితులయిన రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి మరోపక్క నిలబడితే ప్రజలు మోడీ-బాబు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సీమాంధ్రకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర విభజన ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమయింది. దానికి తోడు రాజకీయ అపరికత్వతతో రాహుల్ గాంధీ యువతకే పెద్దపీట, నీతి నిజాయితీ, పార్టీ ప్రక్షాళన అంటూ సీనియర్లను పక్కనబెట్టి కొత్తవారికి టికెట్స్ అంటే సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో సైతం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన నాటి నుండి ప్రజలు అతనిని మోడీతో బేరీజు వేసి చూడటం మొదలుపెడితే, రాహుల్ గాంధీకి తక్కువ మార్కులు పడతాయి గనుక, ఆయన సారధ్యంలో నడిచే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది.

 

ఇక, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తమకు ఎటువంటి సంబందమూ లేదని రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీతో బాటు సోనియా, రాహుల్ గాంధీలను దుమ్మెత్తి పోస్తున్నన్నారు. కానీ ఇంతవరకు సోనియా, రాహుల్ గాంధీలు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి పల్లెత్తు మాట పలకకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్న సీమాంధ్ర ప్రజలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య అనుబంధం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టవచ్చును. ఇక రాష్ట్ర విభజనతో తెలంగాణా ఏర్పాటు చేసి లబ్ది పొందాలని భావిస్తున్నకాంగ్రెస్ పార్టీ, తెరాసతో పొత్తులు ఖరారు చేసుకోగానే, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ది కోసమే విభజన చేస్తున్నట్లు స్వయంగా ఖరారు చేసినట్లువుతుంది. అది కూడా సీమాంధ్రలో పార్టీపై తీవ్ర విపరీత ప్రభావం చూపవచ్చును. సీమాంధ్రలో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు రాహుల్ గాంధీకి తగిన సలహాలు ఇచ్చేనేతలు కూడా ప్రస్తుతం లేకపోవడం మరో పెద్ద సమస్య. రాజకీయ దురందరులనదగ్గ వారందరూ పార్టీకి దూరమయిపోయారు. ఈ తరుణంలో రాహుల్ గాంధీ వచ్చి శల్యసారధ్యం చేస్తే ఏమవుతుందో ఊహించవచ్చును.

By
en-us Political News

  
సాధారణంగా ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో పర్యటించడం అన్నది సాధారణమే. అలాగే జగన్ కూడా పర్యటిస్తున్నారు అనుకోవడానికి లేకుండా ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలో నూతన విగ్రహ ప్రతిస్ఠాపన చేశారు.
డబ్బున్న వారికి పోలీసు సెక్యూరిటీ ఎందుకు? మీ డబ్బు శక్తి వాడండంటూ, పోలీసు భద్రత ఇప్పుడు హోదా గా మారిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
వైసీపీ మాత్రం కల్తీ జరిగిందన్న విషయం అలా ఉంచండి.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటే నానా హంగామా చేస్తోంది.
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.