రాణి చీమలకు విదేశాల్లో భారీ డిమాండ్

Publish Date:Mar 14, 2026

Advertisement

 

శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్ గా పిలిచే రాణి చీమలకు యూరప్, ఆసియా దేశాల్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. వీటిని అక్కడ చాలామంది పెంపుడు జంతువుల్లా పెంచుకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ విషయాన్ని గత ఏడాది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్  హెచ్చరించింది.

చీమలను అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఝాంగ్ అనే వ్యక్తి వాటిని ప్రత్యేకంగా టెస్ట్ ట్యూబ్‌లలో పెట్టి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చీమలను టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టి తన బ్యాగులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రాసిక్యూటర్ అలెన్ ములామా కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, ఝాంగ్ బ్యాగులో మొత్తం 1,948 చీమలు ప్రత్యేక ట్యూబ్‌లలో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మరో 300 చీమలు మూడు టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో మరింత ఆధారాలు సేకరించేందుకు నిందితుడి ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది.కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారి డంకన్ జుమా తెలిపారు. కెన్యాలోని మరికొన్ని పట్టణాల్లో కూడా చీమలను సేకరిస్తున్న గ్యాంగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.

ఇక గత ఏడాది మేలో వేల సంఖ్యలో రాణి చీమలను అక్రమంగా దేశం బయటకు తరలించే ప్రయత్నం చేసిన కేసులో నలుగురికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా 7,700 డాలర్ల జరిమానా విధించింది కెన్యా కోర్టు. కెన్యాలో ఇలాంటి కేసులో ఇది మొదటి తీర్పు. ఆ నలుగురిలో ఇద్దరు బెల్జియం దేశస్తులు, ఒకరు వియత్నాం వ్యక్తి కాగా మరొకరు కెన్యాకు చెందినవారు. తమపై వచ్చిన ఆరోపణలను వారు కోర్టులో అంగీకరించారు. ఇది నిఘా వర్గాల సమన్వయంతో చేసిన ప్రత్యేక ఆపరేషన్ అని కేడబ్ల్యూఎస్ వెల్లడించింది.

అయితే ఈ అరుదైన చీమలను తమ హాబీ కోసం మాత్రమే సేకరించామని, ఇది చట్టవిరుద్ధమని తమకు తెలియదని బెల్జియం వ్యక్తులు కోర్టులో తెలిపారు. నిపుణుల ప్రకారం, ఈ రకమైన చీమలు ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

దర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ అక్రమ రవాణా గ్యాంగ్‌కు ప్రధాన నిర్వాహకుడు ఝాంగ్ అని అనుమానిస్తున్నారు. గత ఏడాది మరో పాస్‌పోర్ట్ ఉపయోగించి ఆయన కెన్యా నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.ఇటీవల ఝాంగ్‌ను ఐదు రోజుల కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుపై దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. సింహాలు, ఏనుగుల వంటి పెద్ద జంతువుల సంరక్షణకు పేరుగాంచిన కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, గత ఏడాది ఈ కేసులో వచ్చిన తీర్పును చరిత్రాత్మక నిర్ణయం గా అభివర్ణించింది.


 

By
en-us Political News

  
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.