కాంగ్రెస్-జగన్ మధ్య అనైతిక బందం ఉంది: పురందేశ్వరి

Publish Date:Mar 6, 2014

Advertisement

 

 

కాంగ్రెస్ అధిష్టానం కేవలం తెదేపాను దెబ్బ తీయడానికే రాష్ట్ర విభజనకు పూనుకొందని, అదేవిధంగా ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డిని బెయిలుపై బయటకి రప్పించి, సీబీఐ కేసుల స్పీడ్ పూర్తిగా తగ్గించి వేసిందని చంద్రబాబు ఆరోపిస్తుండటం అందరూ వింటున్నదే. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రతీ సభలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరగడం, ఆ తరువాత ప్రజలు తనకి ముప్పై యంపీ సీట్లిస్తే తనకు నచ్చిన వ్యక్తినే ప్రధానమంత్రిని చేస్తానని చెప్పడం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రహస్య ఒప్పందం చేసుకొందని చంద్రబాబు ఆరోపిస్తుంటే,జగన్మోహన్ రెడ్డి అంతకంటే గట్టిగా సోనియాగాంధీ ని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూండటంతో వీరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.


జగన్ మోహన్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎంత తీవ్రంగా విమరిస్తున్నపటికీ, ఏనాడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. పైగా దిగ్విజయ్ సింగ్ తమదీ, జగన్మోహన్ రెడ్డిది ఒకటే డీ.యన్,ఏ. అని, అతను తన కొడుకు వంటి వాడని మెచ్చుకొన్నారు. తనని చెంప దెబ్బ కొట్టమని జగన్ అన్నపటికీ, ఆయన 'జగన్ నా కొడుకు వంటి వాడే' అనే నా స్టాండులో మార్పు లేదని చెప్పడం విశేషం. అదే జేసీ దివాకర్ రెడ్డి సోనియమ్మను పదవిలో దిగిపోమని డిమాండ్ చేసినందుకే షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలన్నా, విమర్శలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడం వారి మధ్య ఉన్న రహస్య అనుబందానికి అద్దం పడుతుంది.      

 

లగడపాటి, రాయాపాటి, ఉండవల్లి, జే.సి. దివాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, హర్ష కుమార్ వంటి వీరవిధేయ కాంగ్రెస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య రహస్య అవగాహన ఉందని విస్పష్టంగా ప్రకటించారు. లగడపాటి రాజగోపాల్ అయితే మరొక అడుగు ముందుకు వేసి పెంపుడు కొడుకు వంటి జగన్మోహన్ రెడ్డి కోసం సోనియాగాంధీ కన్న బిడ్డల వంటి తమని అన్యాయం చేసిందని ఆరోపించారు.

 

కాంగ్రెస్ యంపీ సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగిన సంగతి అందరికీ తెలుసు. ఆయన మరొకటి రెండు రోజుల్లో వైకాపాలో చేరేందుకు సిద్దమయిన సమయంలో వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏకి మద్దతు ఇస్తుందని జగన్మోహన్ రెడ్డి మనసులో మాటని పొరపాటున బయటపెట్టినందుకు వైకాపాలో చెరక ముందే బహిష్కరింపబడిన సంగతి అందరికీ తెలుసు.

 

ఈరోజు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ యంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణా లో కేసీఆర్ తో, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందాలు చేసుకొని వారిద్దరి కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడుకోందని, తమ అభిప్రాయాలకు పూచికపుల్లెత్తు విలువీయకుండా గోరంగా అవమానించిందని ఆమె ఆరోపించారు. తమకు గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీని వీడుతున్నామని తెలిపారు.

 

ఇంతవరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ తమ అధిష్టానానికి జగన్మోహన్ రెడ్డి కి మధ్య రహస్య అవగాహన ఉందని గట్టిగా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలుగా, రాహుల్ గాంధీ టీంలో కీలక వ్యక్తిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే విషయం ద్రువీకరించడం గమనిస్తే, ఇంతకాలంగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమేనని అంగీకరించక తప్పదు.

 

అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన సభలలో కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీ ని ఆడిపోసుకోవడం కూడా అంతా ప్రజలను మభ్యపెట్టడానికేనని స్పష్టమవుతోంది. ఇక ఆయన ప్రజలను ముప్పై యంపీ సీట్లు కోరడం, తనకు నచ్చిన వ్యక్తిని ప్రధాని పదవిలో కూర్చోబెడతానని చెప్పడం దేనికో ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పురందేశ్వరి ఆరోపణలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు, అక్కడ కేసీఆర్ మరియు టీ-కాంగ్రెస్ కలిసి 15యంపీ సీట్లు సాధించిపెడితే యువరాజవారికి పట్టాభిషేకం జరిగిపోతుందని స్పష్టమవుతోంది.

 

నోరు విప్పితే నీతి నిజాయితీ, విశ్వసనీయత, నైతిక విలువలు అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ప్రజలలో తన తండ్రిపై ఉన్న అభిమానాన్నే పెట్టుబడిగా భావిస్తూ వారి ఆ అభిమానాన్ని బలహీనతగా భావిస్తూ ప్రజలను ఎంత దారుణంగా మభ్యపెడుతున్నారో ఈ కరడు గట్టిన కాంగ్రెస్ నేతల ఆరోపణలు బట్టబయలు చేస్తున్నాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.