పీ.ఎఫ్‌ జోలికి ఎందుకు!

Publish Date:Apr 20, 2016

Advertisement

 

వేసవిలోనూ చల్లగా ఉండే బెంగళూరు నిన్న ఒక్కసారిగా మండిపడింది. పీ.ఎఫ్ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా రోడ్డు మీదకు వచ్చారు. ఈ విషయంలో సంబంధిత మంత్రి బండారు దత్తాత్రేయ ఆగమేఘాల మీద జోక్యం చేసుకుని కార్మికులకు తగిన పరిష్కారాన్ని చూపడంతో సమస్య సద్దుమణిగిపోయింది. కానీ కార్మికుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి ఒక్కసారిగా తెలిసివచ్చింది. ప్రభుత్వం ప్రావిండెంట్‌ ఫండ్‌ మీదే మాటిమాటికీ ఎందుకు తన దృష్టి పెడుతోందన్నదే ఆసక్తికరమైన విషయం!

 

నిబంధనల ప్రకారం 20మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థల్లో ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు మళ్లిస్తారు. అదే మొత్తంలో యజమాని కూడా భవిష్య నిధికి తన వంతు నిధులను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగి పదవీవిరమణ లేదా రాజినామా చేసిన పక్షంలో తన జీతం నుంచి సమకూరిన 12 శాతం, యజమాని అందించిన సొమ్ములోంచి 3.67 వెరసి 15.67 శాతాన్ని, దాని మీద వడ్డీని పొందే అవకాశం ఉంది. పీ.ఎఫ్‌ ఉపసంహరణకు సంబంధించిన తేనెతుట్టుని మొదట ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో కదిపారు. పీ.ఎఫ్‌ సొమ్ముని ఉపసంహరించుకునే సమయంలో 40 శాతం సొమ్ము మీద పన్ను రాయితీ అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించారు. ఆ ప్రకటనను మొదటిసారి విన్న మధ్యతరగతి జీవులు తమకు మరో పన్ను రాయితీ వచ్చిందనుకుని మురిసిపోయారు. ఆ తరువాత కాసేపటికి కానీ వాళ్లకి అర్థం కాలేదు... ఇప్పటి వరకూ అసలు పీ.ఎఫ్‌ సొమ్ముల మీద పన్నులే లేవనీ, ఇక నుంచి అందులోని 60 శాతం మీద పన్ను బాదుడు ఉండబోతోందని! దాంతో ఒక్కసారిగా వేతన జీవుల నుంచి ఒక్కసారిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, రోజుకో వాదన వినిపించడం మొదలుపెట్టింది. పన్ను కేవలం యజమాని భాగమైన నిధి మీదే అని ఓసారి, దీర్ఘకాలిక ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే పన్ను ఉండదని మరోసారి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ మధ్య తరగతి ఆవేశం ముందు ఆర్థికమంత్రి అతిచాతుర్యం పనికిరాలేదు.

 

త్వరలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు మొదటికే మోసాన్ని తెస్తాయని గ్రహించిన కేంద్రం, పూర్వపు స్థితే కొనసాగుతుందంటూ వెనక్కి తగ్గింది. కానీ బడ్జెట్‌ ముగిసిన కొద్దిరోజులకే పీ.ఎఫ్‌ని మరో విధంగా అదుపు చేసేందుకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఉద్యోగి రాజినామా చేస్తే, తన వంతు పీ.ఎఫ్‌ను మాత్రమే ఉపసంహరించుకోవచ్చనీ, మిగతా మొత్తం 58 ఏళ్లు వచ్చిన తరువాతే లభిస్తుందనీ నిబంధన విధించింది. అదుగో ఆ నిబంధన మీదే నిన్న బెంగళూరు భగ్గుమంది. బెంగళూరులో సాగుతున్న కార్మికుల నిరసన హింసాత్మకంగా మారడంతో, ఈ నిబంధనను ఆదరాబాదరాగా వెనక్కి తీసుకున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం చీటికీ మాటికీ పీ.ఎఫ్‌ని అదుపుచేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానం ఇప్పుడిక కలగక మానదు. భవిష్య నిధి నిజంగా భవిష్యత్తు కోసం అక్కరకు రావాలనీ, ఉద్యోగి జీవిత చరమాంకంలో అది ఉపయోగపడాలనీ... అందుకే తాము ఇలాంటి చర్యలను తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్ణయాల వెనుక మరో కారణం ఏదన్నా ఉందేమో అన్న అనుమానం కలుగక మానదు. ప్రస్తుత మోదీ ప్రభుత్వం మౌలిక వసతుల మీదా, పేదల సంక్షేమం మీదా, వ్యవసాయం మీదా అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ లక్షల కోట్లను సేకరించేందుకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో రుణాలను సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులేమో ఈ రుణాలను అందించే పరిస్థితుల్లో లేవు. బాండ్ల ద్వారా సేకరించగలిగే సొమ్మూ అంతంత మాత్రంగానే ఉంటుంది.

 

ఇలాంటి సమయంలో పీ.ఎఫ్ నిధులను కనుక నిలువరించగలిగితే లక్షల కోట్లు ప్రభుత్వం వద్దకి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే పీ.ఎఫ్‌ ఉపసంహరణ మీద పన్ను విధించి, ఆ పన్ను నుంచి తప్పించుకోవాలంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టుకోండి అంటూ ఓ రాయి విసిరి చూశారు ఆర్థిక మంత్రి. ఆ మంత్రం పారకపోవడంతో ఉపసంహరణ మీద పరిమితులు విధించారు. తద్వారా పీ.ఎఫ్‌ ఖాతాలో ఉండే సొమ్ము పది లక్షల కోట్లను దాటిపోయే అవకాశం వస్తుంది. ఆ సొమ్ములను ఎలాగూ ప్రభుత్వ బాండ్లలోనే పెట్టుబడి పెడుతుంది. పైగా ఈ సొమ్ములను స్టాక్‌ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెట్టే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా మంచి లాభాలను సాధించి మరిన్ని సంక్షేమ పథకాలను చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు.

 

ఉన్నవాడి నుంచి కొంత తీసుకుని లేనివాడికి ఇవ్వడం ఓ ధర్మం. కానీ మన ప్రభుత్వాలు సాధారణంగా ఉన్నవాడి జోలికి పోవు. కోట్లకు కోట్లుగా తరాల కొద్దీ పోగైన వారి నిధులను ముట్టుకోవు. ఒకవేళ నల్లధనాన్ని వెలికితీస్తామంటూ వాగ్దానాలు చేసినా, అవన్నీ మాటలకే పరిమితం అవుతూ ఉంటాయి. వాళ్లు చేసిన పన్ను ఎగవేతను కూడా చాలా సగౌరవంగా వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే ఉన్నవాడు కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలకు కష్టమని మన నేతలకు తెలుసు. అలాగని లేనివాడికీ పెట్టక తప్పదు. ఓట్ల కోసమో, సంక్షేమ రాజ్యం అన్న పేరు కోసమో వాళ్లకి ఏదో ఓ రూపంలో సాయాన్ని అందిస్తూ ఉంటాయి

 

ప్రభుత్వాలు. పేదల్ని ఉద్ధరించడం అంటే వాళ్లకి తగిన జీవనోపాధి కల్పించడం కాదనీ, వాళ్లని ఎప్పటికప్పుడ ప్రభుత్వాల మీద ఆధారపడేలా చేయడం అని అనాదిగా ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచన. ఇలాంటి సమయాలలో ప్రభుత్వాలకి మిగిలిన ఒకే ఒక్క జీవి మధ్యతరగతి మనిషి. వాళ్ల మీద ఎన్ని పన్నులు వేసినా, ఆ పన్నులను ఎంతగా ముక్కుపిండి వసూలు చేసినా సహించి ఊరుకుంటారే కానీ తిరగబడరన్నది ప్రభుత్వాల నమ్మకం. కానీ సందర్భం వస్తే దేశానికి వెన్నుగా నిలిచే మధ్యతరగతి మనిషి కూడా తిరగబడతాడన్నది చరిత్ర చెబుతోంది. వారిలో ముఖ్యమైన కార్మిక వర్గం కళ్లెర్ర చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని గతం హెచ్చరిస్తోంది. ఈ విషయం బహుశా ఈపాటికి కేంద్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నిన్న బెంగళూరులో కనిపించిన నిరసన దేశవ్యాప్తంగా పెల్లుబికే ప్రమాదం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.