సెలవలు సరే... మరి ఆటలో!

Publish Date:Apr 19, 2016

Advertisement

 

సంస్కృతి అంటే కేవలం కట్టూబొట్టూ కాదు. కట్టడాలూ కాదు. మన భాష, జీవనశైలి, పెద్దలు నేర్పిన సంస్కారం... అన్నీ సంస్కృతి కిందకే వస్తాయి. వీటిలో మన సంప్రదాయిక ఆటలు కూడా ఉన్నాయన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదేమో! బహుశా అందుకనే కావచ్చు. ఈ ఏడాది యునేస్కో ప్రపంచ వారసత్వ సంపద కింద ప్రాచీన ఆటలను కూడా పరిరక్షించుకోవాలంటూ పిలుపునిచ్చింది. ఇష్టంగా ఆడుకోవాల్సిన ఆటలను పరిరక్షించుకోవాలని పిలుపునివ్వాల్సి రావడం చాలా దురదృష్టకరం కదా!

 

1990వ దశాబ్దం తరువాత వచ్చిన ప్రపంచీకరణ ఒక్కసారిగా భారతదేశ పునాదులను కదిలించివేసింది. శరవేగంగా మారిపోతున్న జీవనశైలికి అనుగుణంగా తెలుగువాడు త్వరగానే అలవాటుపడిపోయాడు. దేశంలో ఎక్కడా లేనంత చురుగ్గా ఇక్కడి విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయికి చేరుకున్నాయి. ర్యాంకులను సాధించేవారిలో, ఉన్నత చదువులను చదివేవారిలో, అమెరికాకు రెక్కలు కట్టుకునేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉండటమే దీనికి సాక్ష్యం. కానీ భౌతికంగా ఎదుగుతున్న మనం ఏం కోల్పోతున్నామో గ్రహించలేకపోయాము. ప్రభుత్వ పాఠశాలలకు విలువలేకుండా పోయింది. ఆటలన్నా, కథల పుస్తకాలన్నా కాలాన్ని వృథా చేసుకోవడం అన్న అభిప్రాయానికి తెలుగు సమాజం వచ్చేసింది. మనం బట్టీలు పట్టే యంత్రాలుగా మారేందుకు సిద్ధపడ్డామే కానీ... ఆలోచించే, స్పందించే, ప్రతిస్పందించే వ్యక్తులుగా ఎదిగేందుకు అంతగా మొగ్గు చూపలేదు. ఈ ప్రహసనంలో ఆటలకు, ఆ మాటకు వస్తే సంప్రదాయిక ఆటలకు దూరం కావడం వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఊహించేందుకు ప్రయత్నిద్దాం.

 

 

పిల్లవాడి ఎదుగుదలలో అ,ఆలు నేర్చుకోవడం ఎంత అవసరమో, ఆటలు కూడా అంతే అవసరం. కానీ దురదృష్టం ఏమిటంటే కిండర్‌గార్టెన్ బడులలో కూడా ఆటస్థలాలు కనిపించడం లేదు. ప్రతి పాఠశాలకీ కనీసం ఆటస్థలం ఉండాలనీ, వారిని ఆడించేందుకు కొన్ని ప్రత్యేకమైన తరగతులు ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.... అలాంటి వసతులు లేకుండానే వేలాది పాఠశాలలు పనిచేసుకుంటూ పోతున్నాయి. ఆటస్థలాల సంగతి దేముడెరుగు, అసలు పరిగెత్తేంతటి ప్రాంగణం కూడా లేకుండా బడులు సాగుతున్నాయి. పోనీ ఇండోర్‌ గేమ్స్‌కి అయినా ప్రాధాన్యత ఉంటుందా అంటే... వెన్ను విరిచే సిలబస్‌ మీద పాఠశాలు దృష్టి పెడుతున్నాయే కానీ, ఆటలాడమని వెన్ను తట్టి ప్రోత్సహించడం లేదు.

 

ఇది కేవలం ప్రాథమిక పాఠశాలల దుస్థితి మాత్రమే. పిల్లలు ఆరు, ఏడు తరగతులకు రాగానే చదువుని రుబ్బడం, రుద్దడం మొదలవుతోంది. పిల్లవాడిలో ఏమాత్రం ఓపిక మిగిలి ఉన్నా ఐఐటీ అనో, ప్రత్యేక ప్రాజెక్టులనో... చాకిరేవు చాకిరీ చేయిస్తారు. ఇక ఇప్పటి కాలేజీలను చూస్తే వాటి బయట ఉండే బ్యానర్ల బట్టి తప్ప అవి కాలేజీలో అపార్టుమెంట్లో అర్థం కాని పరిస్థితి. అలాంటి చోట ఆటల గురించి మాట్లాడినా వింతగా చూస్తారు. వెరసి పిల్లవాడు మానసికంగా, శారీరకంగా ఎదుగుతున్నాడా లేదా అన్నది ఎవరికీ పట్టడం లేదు. అతని మెదడు ద్వారా ఎన్ని మార్కులను సాధించగలం అన్నదే ఇప్పటి ప్రాధాన్యత. ఈ రకంగా బడిలో చితికిపోయే పిల్లవాడు ఇంటికి వచ్చిన తరువాత కాసేపు ఆడుకోవాలనుకోవడం సహజం. కానీ ఇంట్లో ఎక్కడ సుఖపడిపోతాడో అని అక్కడ కూడా అతణ్ని చదువు వెంబడిస్తూనే వస్తోంది. హోంవర్కుల పేరిట, ప్రాజెక్టుల పేరిట అతని సమయాన్ని హరించివేస్తోంది. వెరసి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పిల్లవాడికి చదువే లోకంగా మారుతోంది.

 

మార్కుల వెంపర్లాటలో పడి అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు ఆటల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం గురించి అంతగా ఆలోచిస్తున్నట్లు లేదు. ఆట అనేది కేవలం ఒక కాలక్షేపం కాదు. అది ఒక వ్యాయామం. ఒక జీవన నైపుణ్యం. పిల్లలు ఆడుకుంటూనే చాలా విషయాలు నేర్చకుంటారు. వారిలో నాయకత్వ లక్షణాలు, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, గెలుపోటములను స్వీకరించే తత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చొరవ... లాంటి సవాలక్ష సానుకూల దృక్పథాలు ఆటలతో అలవడతాయి. ఆటలు ఆడటం వల్ల కండరాలు, ఎముకలు ఎలాగూ బలపడతాయి. ఊపిరితిత్తులు, గుండె కూడా దృఢంగా మారతాయి. వెన్ను గట్టిపడుతుంది. ఇంద్రియాలు మరింత చురుగ్గా మారతాయి. ఇలా ఆట మీద దృష్టి పెట్టడం వల్ల శరీరం ఎలాగూ దృఢంగా మారుతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. చాలా సందర్భాలలో ఆత్మన్యూనత, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలకు ఆటలను ఓ పరిష్కారంగా చూపుతారు వైద్యులు.

 

పిల్లలు ఈ ఆటల రంధిలో పడితే ఎక్కడ పాడయిపోతాడో అని భయపడిపోతున్న తత్వం ప్రస్తుత తరానిది. ఎవరితో కలిసి ఆడుకుంటున్నాడో, ఎలాంటి అలవాట్లు చేసుకుంటాడో, చదువు పాడైపోతుందేమో, కాలం వృథా అయిపోతుందేమో, దెబ్బలు తగుల్తాయి కదా... అంటూ సవాలక్ష అనుమానాలను పోషించుకుంటూ పిల్లలను సుకుమారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితం! జ్ఞానం పెంచాల్సిన చదువు ఇప్పటి పిల్లల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. చదువు ముగిసి జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి వారు మానసికంగా బలహీనంగా తయారవుతున్నారు. ఎలాంటి అలసటా ఎరుగని వారి శరీరాలలో నానా రోగాలు ఎలాగూ తిష్ట వేసుకుంటున్నాయి. చిన్నపాటి సమస్యలను కూడా బెంబేలెత్తి ఆత్మహత్యలకు పాల్పడేంత సున్నితంగా మారిపోతున్నారు.

 

కేవలం బయట నలుగురితో ఆడే ఆటల పరిస్థితే కాదు! నాలుగు గోడల మధ్యా ఆడుకునే ఆటలూ ఇప్పుడు కరువైపోయాయి. ఒకప్పుడు ఇంట్లో ఆడుకునే ఆటలు కూడా మేధస్సునీ, సంప్రదాయాన్నీ పెంపొందించేలా ఉండేవి. కాళ్లాగజ్జీ కంకాలమ్మ వంటి ఆటపాటల్లో ఆయుర్వేద విజ్ఞానం ఉంది. చదరంగంలో జీవితానికి సరిపడా చాతుర్యం ఉంది. కానీ ఇప్పటి పిల్లల చేతుల్లో వీడియో గేమ్స్‌, కళ్ల ముందు కార్టూన్‌ ఛానల్సే మెదుల్తున్నాయి. వీటి వల్ల పిల్లల అవయవాల మధ్య సమన్వయ లోపం ఏర్పడుతుందనీ, చిన్నప్పుడే వారు ఊబకాయం వంటి అనారోగ్యానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. భాష, సంభాషణ, భావ వ్యక్తీకరణ అలవడేందుకు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిన్నా చితకా ఆటలు ఆడుకోవాలని నిపుణులు చెబుతున్నా ఆ మాటలు గాల్లో కలిసిపోతున్నాయి.

 

ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు! ఈ సెలవుల సమయంలోనైనా కాస్త నీడపట్టున పిల్లలు కావల్సినన్ని ఆటలు ఆడుకునేలా పెద్దలు ప్రోత్సహించాలి. ఇంట్లోనూ వారితో కాస్త సమయాన్ని గడుపుతూ, చిన్న చిన్న ఆటలను నేర్పించాలి. భేషజాలను కాసేపు పక్కన పెట్టి పిల్లలతో కలిసి ఆడితే కలిగే సంతోషమే వేరు. అందుకే అన్నారు, ఆటలకు వయసుతో సంబంధం లేదని. ఇప్పటికైనా మన పిల్లలను ఆటల వైపు దృష్టి మళ్లిద్దాం. వీలైతే మనమూ ఆటలాడేందుకు ఓ అడుగు ముందుకేద్దాం! డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. కెరీర్‌లో వెనక్కి తగ్గితే తిరిగి కష్టపడవచ్చు. కానీ జీవితంలో సంతోషమూ, ఆరోగ్యమూ పోతే ఇక ఆ బ్రతుకుకి విలువేముంది. ఆ సంతోషం, ఆరోగ్యాల కోసమైనా ఆటల మీద దృష్టి పెడదాం బాస్‌!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.