ఏకగ్రీవం దిశగా రాష్టపతి ఎన్నిక .. సామ్నాసంకేతం ?

Publish Date:Jun 18, 2022

Advertisement

రాష్ట్ర పతి ఎన్నికను ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదా? అందుకే, ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నాయా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అది కూడా, ఇంకెవరి నుంచో కాదు, ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న, బీజేపీ మాజీ మిత్ర పక్షం, మహారాష్ట్ర అధికార కూటమికి నేతృత్వం వహిస్తోన్న శివసేన పార్టీ, ఈ సందేహాన్ని వ్యక్త పరిచింది.  సందేహాన్ని వ్యక్త  పరచడమే కాదు, ఇలా అయితే ఎలా? రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్ట లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని హెచ్చరించింది.

శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌ పేజీలో ప్రచిరించిన వ్యాసంలో ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించ  వలసిన అవసరం ఉందని, పేర్కొంది.  అంతే కాదు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావనకు వచ్చినా, ఆయన నో’ అన్న నేపధ్యంలో మమతా బెనర్జీ మహాత్మాగాంధీ మనవడు,  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరుక్‌ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు.

అయితే ఈ పేర్ల  విషయంలో శివసేన పెదవి విరించింది. బీజేపీ అభ్యర్ధికి ఆ ఇద్దరిలో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేరని, కేవలం పోటీ చేశామంటే చేశామనేందుకు  మాత్రమే పనికొస్తారని  ‘సామ్నా’ సంపాదకీయ వ్యాసంలో పేర్కొంది. బీజేపేని దీటుగా ఎదుర్కొని గట్టిపోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి అవసరం అంటూ ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక  విషయంలో ప్రతిపక్షాల తీరును పరోక్షంగానే అయినా గట్టిగా  ఎండగట్టింది. అదేవిధంగా ఎన్డీయే అభ్యర్థిగా సమర్థుడైన వ్యక్తిని నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని,  ప్రస్తుత రాష్ట్రపతి రాంమ్ నాథ్ కొవింద్ ఎంపిక సమయంలోనూ బీజేపీ ముందు ఇద్దరు ముగ్గురు  పేర్లను చర్చకు తెచ్చి చివరకు కొవింద్’ను ఏంక చేసిందని సామ్నా వ్యాసం పేర్కొంది.

ఇప్పుడు కూడా, ప్రస్తుతం వినిపిస్తున్న వారు కాకుండా ఇంకొకరని తెర మీదకు తెచ్చే అవకాసం ఉందని సామ్నా అభిప్రాయపడింది. అంటే, ప్రతిపక్షాలు బలమైన అభ్యర్ధిని నిలిపితే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని తద్వారా బీజేపీ  దూకుడుకు కళ్ళెం వేయవచ్చనే అభిప్రాయం సామ్నా వ్యక్తపరిచింది. అయిత, ఎవరా  బలమైన అభ్యర్ధి, అనే  ప్రశ్నకు సామ్నా సమాధానం ఇవ్వలేదు.  రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నిరాకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రశ్నకు ఇప్పడు కాదు, ఆరు నెలల క్రితమే సమాధానాలు కనుగొని ఉండవలసింది అని నిష్టూరమడింది. అంతే కాకుండా, ఇంకొక  అడుగు ముందుకేసి, దీంతో ప్రతిపక్ష పార్టీల  చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని  మరో రాయి విసిరింది. 

అయితే మరో రెండు రోజుల్లో, జూన్ 20,21 తేదీలలో  శరద్ పవార్ నాయకత్వంలో ముంబై ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనున్న సమయంలో శివసేన,  ఈ బాంబు ఎందుకు పేల్చింది? అదికూడా, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట పతి ఎన్నిక ఏకగ్రీవం విషయంగా చర్చలు జరిపిన రోజునే సామ్నా సంపాదకీయ వ్యాసంలో  ప్రతిపక్షాల ఐక్యత పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాసం రావడం అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. 

కాగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు, ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ  నేపధ్యంలోనే రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో   గురువారం ఫోను ద్వారా  చర్చలు జరిపారు.  సో.. సామ్నా వ్యాసం రాష్ట్రపతి ఎన్నిక  ఏకగ్రీవానికి సంకేతామా? అంటే, అయినా కావచ్చని, నిజానికి కాంగ్రెస్, ఎన్సీపీ సహా చాలా వరకు పార్టీలు పోటీ కంటే ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.