16వ శతాబ్ది నాటి సూగురు దేవాలయాన్ని భద్రపరచాలి.. ఈమని శివనాగిరెడ్డి

Publish Date:Jan 18, 2025

Advertisement

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల కిందట సూగూరు సంస్థానా దీశులు నిర్మించిన వైష్ణవాలయాన్ని భద్రపరచి పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం అయన జిల్లాలోని పురాతన శిల్ప సంపదను గుర్తించి వాటి చారిత్రక ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆయన సుగూరు  ఆలయాన్ని సందర్శించారు.

గర్భాలయం, అర్థ మండపం వరకూ, అధిష్టానం,పాదవర్గం ,ప్రస్తరం వరకూ ఉన్న ఈ ఆలయ గోడలపై అపురూప శిల్పాలు ఉన్నాయని కప్పు పైన  శిథిలమైన శిఖరాన్నీ బాగు చేసి ఆలయానికి పూనర్వవైభవం తీసుకురావడానికి కృషి చేయాలని గ్రామస్తులకు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం దిగుడు బావిని, కోట ద్వారాన్ని  వీరభద్ర ఆలయం దగ్గర రోడ్డుపై న నిర్లక్ష్యంగా పడి ఉన్న చాళుక్యుల కాలపు మూడు నందులు, మూడు గణేష్ విగ్రహాలు, సప్తమాతృకలు శైవాచార్యులు, వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు సితార వెంకటేశ్వర్లతో పాటు నాగర్ కర్నూల్ వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్ తోపాటు గ్రామస్తులు  పాల్గొన్నారని తెలిపారు.

By
en-us Political News

  
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది.
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది.
2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం.
ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది.
జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.
ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన సొంత నియోజకవర్గం రాఘోపూర్‌లో వెనుకంజలో ఉన్నారు.
నీసం డిపాజిట్ కూడా రానంతగా బీజేపీ చ తికిల పడుతుందని పరిశీలకులు కూడా ఊహించలేదు. బీజేపీకి పట్టణ ప్రాంతాలలో ఒకింత పట్టు ఉందని అంతా భావిస్తారు.
మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పాతిక వేలపైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
కౌంటింగ్ పూర్తి కాకముందే ఓటమి అంగీకరించేసి ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి ఇంటికి వేంచేశారు. సరే రాజకీయపార్టీకి గెలుపు ఓటములు సహజమే అని సరిపెట్టుకోవడానికి కూడా లేనంత ఘోర పరాభవం బీజేపీకి జూబ్లీ ఉప ఎన్నికలో ఎదురైంది.
 రౌండు రౌండు కూ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యత పెరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు డీలా పడ్డాయి. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆ పార్టీ ఏజెంట్లు బయటకు వచ్చేశారు.
ఇప్పటి వరకూ ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12 651 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.