డిప్యూటీ సీఎంగా లోకేశ్‌.. లైన్ క్లియ‌రైందా?

Publish Date:Jan 19, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ కాబోతున్నారా? టీడీపీ శ్రేణుల నుంచి రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్న ఈ డిమాండ్ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సానుకూలంగా స్పందించారా? కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా కొన‌సాగుతున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం టీడీపీ కార్య‌క‌ర్త‌ల డిమాండ్ పై సానుకూలంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీకి మూడో త‌రం వార‌సుడిగా.. రాబోయే కాలంలో పార్టీని న‌డిపించే నాయ‌కుడిగా లోకేశ్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో త‌న స‌మ‌ర్ధ‌త‌ను చాటుకున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా న‌మ్ముతోంది. దీనికి కార‌ణం  లోకేశ్ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితిని క‌న‌బ‌ర్చ‌డ‌మే. ప్ర‌తి ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురెళ్లి లోకేశ్ స‌వాల్ చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వైసీపీ అధిష్టానానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లోకేశ్ దూకుడు కార‌ణంగానే జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు భ‌య‌ప‌డి మూడేళ్లు బ‌య‌ట‌కురాని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం ఒక్క‌సారిగా రోడ్లెక్కి అప్ప‌టి ప్ర‌భుత్వంపై పోరు బాట‌ ప‌ట్టారు. దీంతో జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం ప‌డిన‌ట్ల‌యింది.

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ కూడా ప్ర‌భుత్వంలో నారా లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న ప‌రిధిలోఉన్న శాఖ‌ల్లో కీల‌క మార్పులు తీసుకువ‌స్తూ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌న‌దైన మార్క్ ను చూపిస్తున్నారు. అన్నివిధాలా లోకేశ్ త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకోవ‌టంతో తెలుగుదేశం శ్రేణులు డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను ప్ర‌మోట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీలోని కీల‌క నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగుదేశం అధికార ప్ర‌తినిధి మ‌హాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న ర‌ఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ప‌లువురు నేత‌లు ఒక్కొక్క‌రుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పైనే శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, తెలుగుదేశం క్యాడ‌ర్ అభిప్రాయం అని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు శ్రీ‌నివాస్ రెడ్డి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. కానీ, తెలుగుదేశం ముఖ్య‌నేత‌లతో మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కూట‌మి నేత‌ల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుందామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు ఉండేవారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్నారు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు.. అదో రాజకీయ పదవి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల్లో డిప్యూటీ సీఎంలు ఒక‌రు, అంత‌కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఉప‌ముఖ్య‌మంత్రి అంటే రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప‌ద‌వికాక‌పోయిన ఆ స్థానంలో ఉన్న‌వారు ముఖ్య‌మంత్రి త‌రువాత ముఖ్య‌మంత్రిగా రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు భావిస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేస్తూనే.. ఇత‌ర శాఖ‌ల‌పై స‌మీక్ష‌లు చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. మంత్రుల కంటే డిప్యూటీ సీఎంకు ప‌వ‌ర్స్ ఎక్కువ అనే చెప్పొచ్చు. దీంతో కూట‌మిలో అతిపెద్ద పార్టీ అయిన తెలుగుదేశం నుంచి  నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ గట్టిగా వస్తోంది.  మంత్రిగా ఉండ‌టం వ‌ల్ల కేవ‌లం కొంత‌మేర మాత్ర‌మే లోకేశ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కాగ‌లుగుతున్నారనీ, ఉప‌ముఖ్య‌మంత్రి హోదా ఉంటే పాల‌న‌పై పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధించి, అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా లోకేష్ కు ప్రమోషన్ తెలుగుదేశం బలోపేతానికి సైతం దోహదపడుతుందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. 

మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న డిమాండ్ ప‌ట్ల జ‌న‌సేన పార్టీ నేత‌లు మౌనంగానే ఉన్నారు. అయితే తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ ను అవ‌కాశంగా తీసుకొని కూట‌మిలో విబేధాలు త‌లెత్తేలా చేయాల‌ని వైసీపీ సోష‌ల్ మీడియా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నది. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లమంటూ టీడీపీకి వ్య‌తిరేకంగా పోస్టులు పెడుతుండ‌టం విశేషం. అయితే, లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాల‌న్న డిమాండ్ పై జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. మ‌రో వైపు చంద్ర‌బాబు కూడా ఈ అంశంపై  స్పందించ‌లేదు. కానీ, లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాల‌న్న డిమాండ్ రోజురోజుకు ఎక్కువ‌వుతుండ‌టంతో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే అంశంపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది.

By
en-us Political News

  
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.