గులాబీకి గ్రేటర్ షాక్! కారుకు మూడో ప్లేసంటున్న సర్వే? 

Publish Date:Oct 14, 2020

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు గ్రేటర్ షాక్ తగలబోతుందా? బల్దియా ఎన్నికల్లో అధికార పార్టీ ఆగమాగం కానుందా? రెండోసారి జెండా ఎగరేయాలనున్న కారు పార్టీ స్పీడుకు జీహెచ్ఎంసీలో బ్రేక్ పడనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రీపోల్ సర్వేల్లో. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీన్మార్ మలన్నకు చెందిన క్యూ న్యూస్ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో గులాబీ పార్టీకి గుబులు రేపే ఫలితాలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో  రికార్డ్ స్థాయిలో 99 డివిజన్లు గెలిచిన టీఆర్ఎస్ కు ఈసారి అందులో పదో వంతు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలుఉన్నాయని సర్వే ఫలిచాలను బట్టి అర్ధమవుతోంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్ లో ఎన్నికల్లో జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మూడో స్థానం వస్తుందని ప్రీపోల్ సర్వే స్పష్టం చేస్తోంది. అది కూడా నాలుగో స్థానంలో ఉన్న టీడీపీ కంటే కొంచెం మెరుగ్గానే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి

 

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు డివిజన్లు మాత్రమే గెలుచుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకున్నట్లు క్యూ న్సూస్ సర్వేలో తేలింది. గ్రేటర్ లో మెజార్టీ సీట్లు హస్తం కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. బీజేపీ కూడా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని 40 డివిజన్లలో క్యూ న్యూస్ ప్రీపోల్ సర్వే పూర్తైంది. ఇందులో కాంగ్రెస్ 18 డివిజన్లలో ఆధిక్య సాధించి టాప్ లో నిలిచింది. బీజేపీ 13 డివిజన్లలో ముందంజలో ఉంది. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం కేవలం ఐదు డివిజన్లలోనే లీడ్ పొందింది. టీడీపీ నాలుగు డివిజన్లలో సత్తా చాటుతూ టీఆర్ఎస్ కు దరిదాపుల్లోనే నిలిచింది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా... అందులో పాతబస్తిలోనే 50 డివిజన్లున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎందే పూర్తి ఆదిపత్యం కాబట్టి.. ఆ సీట్లపై మిగితా పార్టీలు ఆశలు పెట్టుకోవు. మిగితా 100 డివిజన్లలోనే పోటీ పడతాయి. ఈ వందలోనే 40 డివిజన్లలో సర్వే జరిపింది క్యూ న్యూస్ సంస్థ. సో... దాదాపుగా ఇవే ఫలితాలు మిగితా డివిజన్లలో ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

ప్రీపోల్ సర్వేను పక్కాగా నిర్వహించింది క్యూ న్యూస్ సంస్థ. ఎన్నికల్లో మాదిరే బ్యాలెట్ పేపర్లతోనే సర్వే చేస్తోంది. సర్వే నిర్వహించిన డివిజన్ లోనే బాక్సులు పెట్టగా.. ఆసక్తి గల ఓటర్లు బ్యాలెట్ పేపరులో పార్టీ సింబల్ పై టిక్ చేస్తూ పెట్టేలో వేశారు. తర్వాత అందరి సమక్షంలోనే వాటిని లెక్కిస్తున్నారు. అచ్చం పోలింగ్ జరుగుతున్నట్లుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి డివిజన్ లోని  2 వందల మంది నుంచి ఓటు తీసుకుంటున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు క్యూ న్యూస్ సర్వే నిర్వాహకులు. పారదదర్శకంగా సర్వే ఉండటంతో ఫలితాలపై ప్రజలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 

 

క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన 40 డివిజన్లలో గ్రేటర్ లోని అన్ని ప్రాంతాలు దాదాపుగా కవరయ్యాయి. అయితే ప్రీ పోల్ సర్వేల్లో అధికార పార్టీకి నగరంలోని ఏ ప్రాంతంలోనూ సానుకూలత లభించడం లేదు. టీఆర్ఎస్ కు లీడ్ వచ్చిన ఐదు డివిజన్లలోనూ.. ఆ పార్టీకి ఇతర అభ్యర్థుల నుంచి   పోటీ  తీవ్రంగానే ఉంది. చాలా డివిజన్లలో అధికార పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ ముందున్న స్థానాల్లో ఆ పార్టీకి భారీగా ఓట్లు వచ్చాయి. బీజేపీ కూడా మంచిగానే ఓట్లు సాధించింది. సరూర్ నగర్ లో అధికార పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. సిటీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. ఆ ఏరియాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి జనాల నుంచి ఊహించని సపోర్ట్ లభిస్తోంది. 

 

ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న మేడ్చల్ మాల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ లోని 50 డివిజన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఎంపీ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఈ నాలుగు  నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికార పార్టీ ప్రీపోల్ సర్వేల్లో బాగా వెనకబడి పోయింది. నాగోల్, కాప్రాలో  మాత్రమే కారుకు లీడ్ వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాకిచ్చేలా సర్వే ఫలితాలు వచ్చాయి. ఎల్బీనగర్ పరిధిలో 8 డివిజన్లు ఉండగా.. ఒక్క బీఎన్ రెడ్డి నగర్ లో మాత్రమే టీఆర్ఎస్ ముందుంది. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గం మహేశ్వరం పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కల్గిస్తోంది. 

                        
గ్రేటర్ శివారు ప్రాంత డివిజన్లలో కాంగ్రెస్ ముందుండగా.. న్యూసిటీలో మాత్రం బీజేపీ జోరు కనిపించింది ప్రీపోల్ సర్వేలో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పూర్తి సత్తా చాటింది. ఈ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో  క్యూ న్యూస్ ఇప్పటివరకు నిర్వహించిన ప్రీపోల్ సర్వే లో బీజేపీనే మెజార్టీ సీట్లలో ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడిన కాంగ్రెస్ కూడా అనూహ్యంగా  కొన్ని డివిజన్లలో లీడ్ సాధించింది.  హైదరాబాద్ లోక్ సభ పరిధిలోని గోషామహాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టు కనిపించింది. గోషామహాల్ పరిధిలోని అన్ని డివిజన్లలో బీజేపీ లీడ్ సాధించగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 

 

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ కనుమరుగయ్యందని ప్రచారం చేసే వారి దిమ్మ తిరిగేలా క్యూ న్యూస్ సర్వే ఫలితాలు కనిపిస్తున్నాయి. కూకట్ పల్లి , కుత్బుల్లాపూర్ పరిధిలోని గ్రేటర్ డివిజన్లలో టీడీపీ బలంగానే ఉన్నట్లు తేలింది. కొన్ని డివిజన్లలో ముందుండగా.. మరికొన్ని డివిజన్లలో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఓవరాల్ గా అధికార టీఆర్ఎస్  కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలోనూ టీడీపీకి మంచిగానే ఓట్లు పడ్డాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే టీడీపీకి గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని ప్రీ పోల్ సర్వేను విశ్లేషించిన పొలిటికల్ అలిస్టులు చెబుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.