సాగులో ఆమె..

Publish Date:Oct 15, 2020

Advertisement

అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే మహిళలు వ్యవసాయరంగంలోనూ ముందంజలో ఉంటున్నారు. రైతు కూలీలుగానే కాదు రైతులుగా మారి లాభసాటి వ్యసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా వ్యసాయరంగం పై ఆధారపడిన మనదేశంల్లో మహిళలు కొత్తపంథాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా సేంద్రీయ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. నేల చదును చేసి విత్తనాలు నాటి, పంటనుంచి ధాన్యాన్ని సేకరించి, ఇంటికి చేర్చి ఆహారంగా మార్చి ఇంటిల్లిపాదికి అందించడం వరకు మహిళల పాత్ర ఉంటుంది. మహిళా రైతుల సంఖ్య  భారతీయ వ్యవసాయ రంగంలో నానాటికీ పెరుగుతూనే ఉంది. జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలు పరిశీలిస్తే 75శాతం మహిళా శ్రామికులు వ్యవసాయక్షేత్రంలోనే ఉంటున్నారు. రెండున్నర ఎకరాల పొలంలో  సగటున మహిళలు 3,845గంటలు పనిచేస్తున్నారు. నాట్లు వేయడంలో 557 గంటలు, కలుపు తీయడంలో 640గంటలు, పంటకు నీరు పెట్టడంలో 384 గంటల సమయాన్ని గడుపుతున్నారు. వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొందరు తిరిగి ప్రారంభిస్తుంటే.. సాఫ్ట్ వేర్ రంగాలను వదిలి సాగుదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరి గురించి జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

 

సురేఖ...
పుట్టిపెరిగింది నగరం వాతావరణంలో.. కానీ మొక్కలంటే మక్కువ. ఉన్నతవిద్య పూర్తి చేసిన తర్వాత రెండు దశాబ్దాలపాటు ఆమె  మీడియా, అడ్వటైజింగ్, కార్పోరేట్ ట్రైనింగ్ ఫీడ్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యకోసం వెళ్లేవారికి సంబంధిత యూనివర్సటీలా ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కోచింగ్ ఇస్తూ మూడు కోర్సులు, ఆరు క్లాసులు గా బిజీబిజీగా ఉన్న లైఫ్ లో వ్యవసాయం పై మక్కువ మాత్రం తగ్గలేదు. కరోనా కారణంగా అన్నింటికీ బ్రేక్ పడగా.. ఇదే సరైన సమయం అనుకుంటూ గ్రామం వైపు పరుగుదీశారు. నగరానికి చేరువగా ఉన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం లీజుకు తీసుకున్నారు. వ్యసాయంపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటూ మట్టివాసనను ఆస్వాదిస్తున్నారు.
వ్యసాయం లాభసాటిగా ఉండాలంటే అందుబాటులోకి వచ్చిన ఆధునిక పద్ధతుల గురించి అవగాహన ఉండాలి. రైతులకు ప్రభుత్వం సమాచారాన్ని అందించాలి అంటూ అగ్రికల్చర్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. నేల రకాన్ని పరీక్షించడంతో పాటు పంట పెరుగుదలలో తీసుకోవల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎసీ గదుల్లో కోచింగ్ ఇచ్చిన తాను ప్రకృతి మధ్య కు వచ్చిన వ్యసాయపాఠాలు నేర్చుకుని మరికొందరికీ ఆధునిక, లాభసాటి వ్యవసాయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేముందు నేను తెలుసుకోవాలి కదా అంటూ తానే స్వయంగా పొలం పనుల్లో దగారు. భూసారాన్ని పరీక్షించడం నుంచి నాట్లు వేసే వరకు తానే ముందున్నారు.

 

కృష్ణవేణి...
వ్యవసాయ కుటుంబంలో పుట్టిపెరిగారు. మట్టి పరిమళం బాగా తెలుసు. పల్లె నుంచి పట్టణానికి పోయినా ఆ మట్టి పరిమళాన్ని మరిచిపోలేదు.  పెండ్లి, పిల్లలు, ఇంటి బాధ్యతలతో ఏ కాస్త సమయం దొరికిన సామాజిక సేవ చేస్తూ బిజీబిజీగా మారారు. పిల్లలు పెద్దవారై కాస్త తీరిక దొరకగానే ఆమె ఆలోచనలు తిరిగి వ్యవసాయం వైపు మళ్లాయి. ఊరిలో తమకు ఉన్న వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వకుండా తానే దగ్గర ఉండి సాగు చేయిస్తున్నారు. తాను చిన్నప్పుడు చూసిన సంప్రదాయ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయంచే జీవనవిధానం అంటారు కృష్ణవేణి. పంట కోసిన తర్వాత తమ పశువులకు ఆహారం కోసం వెతికే గొర్రెకాపరులకు తమ పొలంలోకి అనుమతి ఇస్తారు. ఎండాకాలంలో దాదాపు రెండు నెలల పాటు గొర్రెలు,మేకలు, పశువులు  పొలంలో దొరికే చెట్టుచేమ తింటూ అక్కడ పేడ వేస్తాయి. ఈ పేడ పొలానికి మంచి ఎరువు అవుతుంది. పంటలేని కాలంలో పశువుల మేతకు అనుమతించడం వల్ల అవి వేసే పేడ ఎంతో మేలు చేస్తుందని ఇది తన చిన్నతనంలో చూసేదాన్ని అని ఆమ చెప్పారు. ఇప్పుడు పురుగు మందులతో వ్యసాయం చేస్తున్నారు. అప్పుడు పశుపక్ష్యాదులతో కలిసి వ్యవసాయం చేసేవారు అంటారు కృష్ణవేణి.

 

విశాల..
నగరాలను మార్కెటింగ్ చేసే కార్పొరేట్ వ్యక్తి విశాల. హైదరాాబాద్ ఐటీ క్యారిడార్ లో వీకెండ్స్  మార్నింగ్ టైమ్ లో స్టాఫ్ వేర్ పీపుల్  అంతా బయటకు వచ్చి మాస్  ప్రోగ్రామ్స్ చేసేలా రహ్ గిరి రూపకల్పన చేసిన వారిలో ఆమె ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసినా తమ మూలాలు పల్లెలోనే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే పల్లెవైపు అడుగువేశారు. రాయలసీమలోని తమ గ్రామంలో ఉన్న పొలంలో చిరుధాన్యాలు పండించడంతో పాటు డాటర్స్ ఆఫ్ సాయిల్ పేరుతో ఎప్ బీ పేజీని క్రియేట్ చేశారు. వ్యసాయరంగంలో మహిళ పాత్రను అంతర్జాతీయ వేదికపై తెలియజేసేందుకు కృషి చేస్తున్నారు. మిల్లెట్స్ బ్యాంక్ ను ఏర్పాటుచేసి చిరుధాన్యాలకు మార్కెంటింగ్ కల్పించే ప్రయత్నం చేస్తుననారు. దీనితో పాటు సనాతన వ్యవసాయ పద్ధతులను ఆధునిక తరానికి అందించేందుకు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

 

నిర్మల...
విదేశాల్లో ఉద్యోగం. ఐదంకేల జీతం. కానీ, తాను పుట్టిపెరిగిన సమాజానికి ఎదో చేయాలన్న ఆరాటం. అంతే ఆమె అమెరికా నుంచి మారుమూల గ్రామానికి పయనం. మొదట సామాజిక అంశాలపై స్టడీ చేయాలనుకున్నారు. కానీ, వ్యవసాయం రంగంలో చిన్నసన్నకారు రైతులు, మహిళలు ఎదుర్కోంటున్న సమస్యలను చూసి తాను పనిచేయాల్సింది ఈ రంగంలోనే అనే నిర్ణయానికి వచ్చారు. వలసలకు మారుపేరు అయిన పాలమూరు జిల్లాకు అమెరికా నుంచి ఆమె వలస వచ్చారు. నారాయణపేట్, దామరగిద్ద ప్రాంతంలోని రైతులను కలుసుకుంటూ గత ఐదేండ్లుగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లుతూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పేదవారికి పంచిన గుట్టలు, బండరాళ్లతో ఉన్న భూమిని రైతుల శ్రమదానంతో సాగులోకి తీసుకువచ్చారు. సాగునీటి సౌకర్యం అంతగా లేని ప్రాంతంలో వర్షాధార పంటలైన చిరుధాన్యాలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు పండించిన పంట దళారీల ప్రమేయంలేకుండా నేరుగా వినియోగదారులకు చేరేలా కృషి చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా రైతులకు శిక్షణ ఇచ్చేప్రయత్నాలు చేస్తూ వ్యవసాయరంగాన్ని నమ్ముకున్నవారిని
కష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

 

రేణుక
మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షణ ఇచ్చేలా ఉండాలి అంటున్నారు మహిళా రైతు రేణుక. కాలగర్భంలో కలిసిపోయిన వరివంగడాలను సేకరించి తిరిగి వాటిని సాగులోకి తీసుకువస్తున్నారు. సేంద్రీయవ్యవసాయం తాను చేయడమే కాకుండా తమ ఇరుగుపొరుగు వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు. రేణుక సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం క్యాన్సర్ కారణంగా ఆమె మామగారు చనిపోవడం. ఆహారం, జీవనశైలీ కారణంగానే దీర్ఘకాలిక సమస్యలైన క్యాన్సర్, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండెజబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పడం ఆమెను ఆలోచింప చేసింది. మరి మన తాతముత్తాలు ఏం తినేవారు అన్నదిశగా సాగిన ఆలోచనలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన పురాతన వరి వంగడాలను సేకరించేలా చేశాయి. ఆమె భర్త తిరుపతి సహాకారంతో దాదాపు 51రకాల పాత వరి వంగడాలను సేకరించి వాటిని పండిస్తూ విత్తనాలను ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా పంపిణి చేస్తున్నారు.

 

వ్యవసాయరంగంలో కూలీలుగానే కాదు ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడే మహిళలు ఎందరో ఉన్నారు అని నిరూపిస్తున్నారు ఈ ఐదుగురు మహిళలు. ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని పండిస్తూ సమాజాన్ని ఆరోగ్యదాయకంగా చేసే ప్రయత్నం చేస్తూ వ్యవసాయరంగంలో ఉన్న ప్రతి మహిళకు జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా హాట్సాఫ్...

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.