పిచ్చోడి చేతిలో రాయిలా పీకే వ్యూహాలు!.. త‌ల ప‌గిలేది ఎవ‌రికో?

Publish Date:Nov 1, 2021

Advertisement

దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, పదికి పైగా రాష్ట్రల్లో బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందులో మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా, కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా జోడీని ఢీ అంటే ఢీ అని ఢీకొనే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే , పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ ఒక్కరే, కనిపిస్తారు. మమతా బెనర్జీ గురించి ఇంకే విషయంలో అయినా ఎవరికైనా అభ్యంతరం లేదా భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చును కానీ, మోడీ, షా జోడీని ఎదిరించే దమ్మున్న‌ ముఖ్యమంత్రి దీదీ ఒక్కరే అనే  విషయంలో మాత్రం ఎఎరికీ భిన్నాబిప్రాయం ఉండదు. నిజానికి ఆమె రాజకీయ జీవితం అంతా అలాగే సాగుతూ వచ్చింది అనుకోండి అది వేరే విషయం. 

అదలా ఉంటే, వరసగా మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నమమతా దీదీ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు మరలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల గోవాలో పర్యటించిన ఆమె తమ మనసులో కోరికను నేరుగా బయట పెట్టేందుకు, కొద్దిగా చాలా సిగ్గును అభినయించినా, ప్రధాని పదవిపై ఆమె మనసు పారేసుకున్నారు, అనేది మాత్రం నిజం.అది ఇప్పటికే దేశం అంతటికీ తెలిసిన బహిరంగ రహస్యం.  

కాగా, గోవాలో పర్యటనలో మీడియా ముందుకొచ్చిన మమత 2024 ప్రధాని రేసులో ఉన్నారా అని అడిగితే, “అన్నీ ఇప్పుడే చెప్పెస్తే ఎలా ... రేపు చెప్పుకునేందుకు ఏముంటుంది?” అంటూ చిరు నవ్వుతో సమాధానాన్ని దాట వేశారు. నిజానికి దీదీ ప్రధాని ప్రధాని రేసులో ఉన్నారనే వార్త ఇప్పుడు కాదు  చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా దీదీ కానీ, చివరకు ఆమెను పీఎం చేసే ‘కాంట్రాక్టు’ పుచ్చుకున్న ‘కిరాయి’ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ కానీ, ఎక్కడా ఆవిషయం  చెప్పలేదు.కానీ, 2024 ఎన్నికల్లో ప్రధాని పదవికి దీదీ పోటీలో ఉంటారనే  ఊహాగానాలు మాత్రం షికారు చేస్తున్నాయి. 

అయితే, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సరికి, తృణమూల్ కాంగ్రెస్’ పేరుకు జాతీయ పార్టీ అయినా, ఆ పార్టీ ప్రభావం, ఈరోజు వరకు అయితే చాలా వరకు  బెంగాల్ వరకే పరిమితం. లోక్ సభ మొత్తం స్థానాల సంఖ్య 543 అందులో తృణమూల్ గట్టిగా పోటీ ఇవ్వగల స్థానాలు, బెంగాల్’లోని 42 స్థానాలు మాత్రమే. అక్కడ కూడా తృణమూల్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ 22 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 18 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన రెండు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. 

ఒరిస్సా, అస్సాం, జార్ఖండ్, బిహార్, అండమాన్’ లలో కూడా తృణమూల్ 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ఒక్క సీటులో  కూడా దీదీ గెలవలేదు. జాతీయ స్థాయిలో  తృణమూల్’కు వచ్చింది 22 సీట్లు (అన్నీ బెంగాల్ నుంచే), అలాగే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ వచ్చిన ఓట్లు కేవలం నాలుగు శాతం మాత్రమే. అదే కాంగ్రెస్ విషయాన్ని తీసుకుంటే, కేవలం 52 సీట్లు మాత్రమే వచ్చిన 2019 ఎన్నికల్లోనూ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఇంచుమించుగా 20 (19.49) శాతం వరకు ఓట్లు పోలయ్యాయి.(మూడు వందలకు పైగా సీట్లు దక్కించుకున్న బీజేపీకి వచ్చింది, 32శాతం ఓట్లు మాత్రమే)
అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వరసగా మూడవ సారి విజయం సాధించడం, అధికారానికి నిచ్చెనలు వేసిన బీజేపీ, ముఖ్యంగా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్న మోడీ, షా జోడీ చతికిల పడడంతో మమతా దీదీ, నేషనల్ ఇమేజ్ హటాత్తుగా పెరిగిపోయింది. మరో వంక, ఆమెను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ కూడా ఫైపైకి పాకింది. దీంతో, బీజేపీ వ్యతిరేక శక్తులకు ఆ ఇద్దరూ ఆశా జ్యోతిగా కనిపించారు. 

మరోవంక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కిరాయి వ్యూహాలకు ఇక స్వస్తి అని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్, కొత్త అవతారంలో కాంగ్రెస్/రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసే ప్రయత్నం చేశారు. అలాగే, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, చివరకు బీజేపీ, మోడీని ఓడించడం రాహుల్ గాంధీతో కాంగ్రెస్ తో కాదని, నిర్ణయానికి వచ్చారో, లేక అది కూడా వ్యూహంలో భాగమో ఏమో కానీ, ప్రశాంత్ కిశోర్ మకాం బెంగాల్’కు  మార్చారు. మమత పంచన చేరి కాంగ్రెస్’ టార్గెట్’ గా మరో వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.మమతను  జాతీయ నేతను చేసి 2024 ఎన్నికల్లో మోడీకి ప్రత్యర్ధిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు పార్టీ విస్తరణకు మమత నడుం బిగించారు.వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గోవాలో కాలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరో వంక 2024 లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఒక్క గోవాలోనే కాదు, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగి యూపీ సహా ఇతర రాష్టల్లోనూ కాంగ్రెస్ నాయకులను తృణమూల్’లో చేర్చేందుకు, ప్రశాంత్ కిశోర్ బృందం పనిచేస్తోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, లూయిజినో ఫిలేరియో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తృణమూల్’లో చేరారు. అలాగే, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమారుడు, యూపీలో ఇద్దరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్ల్యేలు కూడా  తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, కాంగ్రెస్ టార్గెట్’గా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ, పరోక్షంగా బీజీపీకి మేలు చేస్తుందే, కానీ, ప్రధాని పీఠం ఎక్కాలనే, దీదీ కలను ఎలా నిజం చేస్తుందనేది,ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.అయితే ఇది  ఒక్క పీకేకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆయన గుప్పిట విప్పితేనే కానీ, అసలు వ్యూహం ఏమిటి? అనేది తేలదు. రాహుల్ పోయి .. మమత వచ్చే .. అన్నట్లుగా  మరో బాంబు పేలుస్తారా ... చూడవలసిందే.. పిచ్చోడి చేతిలో రాయి ఏ తలకు అయినా తగలవచ్చును కదా...

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.