మూడు నెలల్లో లోకేష్‌కు తెలుగుదేశంలో కీలక బాధ్యతలు?

Publish Date:Jun 11, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీపరంగా ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను...ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయింది.  లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసినా లోకేష్‌ ప్రమోషన్‌కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తునే ఉంది.

లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవ్వడం వెనుకఅనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలు అంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుండటం కారణాలుగా చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో బీజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్‌‌కు అప్పగించాలనే డిమాండ్‌ టీడీపీ నేతల నుంచి చాలా కాలంగా వస్తున్నది.  ఓ వైపు టీడీపీ నేతల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు దీనిపై స్పందించాల్సిన పరిస్ధితి వచ్చింది. 

లోకేష్‌ని ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ గా  చేయబోతున్నారు.. 2029 ఎన్నికల్లోగా లోకేష్‌ని సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో తెలుగుదేశం ఎపుడూ ముందుంటుందనీ,  తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే తెలుగు పార్లమెంట్ సభ్యులలో  అత్యధిక శాతం యువకులేననీ చెప్పారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. 

ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావడం... తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదర దన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు.  తనకు నాలుగు సార్లు సీఎంగా ప్రజలు అవకా శం ఇచ్చారని అంటూనే... లోకేష్‌కి కూడా జనాల మద్దతు ఉందంటూ అన్యాపదేశంగా లోకేష్‌ ప్రమోషన్‌పై స్పందించారు.

తెలుగుదేశం యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండటంతో.. లోకేష్‌కు తర్వలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైంది. కాస్త అటూ ఇటూ  కావచ్చు, ఆలస్యం అయినా అవ్వొచ్చు..  కానీ లోకేష్ కచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్‌ పొలిట్ బ్యూరోలో సంస్కరణ తేవాలంటే  కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి 3నెలల సమయం పడుతుందనే హింట్‌ ఇచ్చారు. 

ఆ క్రమంలో మరో మూడు నెలల్లో లోకేష్‌కు ప్రమోషన్‌ దక్కబోతుందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందంట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగింది.  వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్యభూమిక పోషించా రని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.  మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిం దన్న లోకేష్‌... మిగిలిన విషయాలపై స్పందించనప్పటికి.. తర్వలో ఆయన ప్రమోషన్ గ్యారెంటీ అని పార్టీ సీనియర్లు అంటున్నారు.

By
en-us Political News

  
రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏపీలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు.
తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు.
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.
పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి.
కారు కిందపడ్డ సింగయ్యను వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది.
వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.