ఆకలి చుట్టూ అ...రాజకీయ దుమారం !

Publish Date:Oct 17, 2022

Advertisement

ఎవరో కవి, ఆకలికి అన్ని భాషలు వచ్చన్నారు. నిజం. ఆకలికి అన్నిభాషలు వచ్చును. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఆకలి మాట్లాడుతుంది. అలాగే,బెంగాలీ, పంజాబీ మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఉర్దూ, హిందీ ఇలా ఉత్తర దక్షణాది భాషలు అన్నిటిలో, ఆకలి మాట్లాడుతుంది. భారతీయ భాషలే కాదు, ప్రపంచ భాష ఇంగ్లీష్’ లోనూ ఆకలి అనర్గళంగా మాట్లాడ గలదు. అలాగే, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్ ఇలా మొత్తంగా  ఏడువేలకు పైగా ఉన్న ప్రపంచ భాషలు అన్నిటిలో ఆకలి మాట్లాడుతుంది.మాట్లాడుతూనే వుంది. ఆకలి కేవలం మాట్లాడమే కాదు, మాట్లాడిస్తుంది.పోట్లాడుతుంది. కేకలు పెడుతుంది. కేకలు పెట్టిస్తుంది. అంతే కాదు, రాజకీయ గర్జనలు చేస్తుంది. అయితే, రాజకీయ ఆకలి కేకలు ఎంతవరకు నిజం అంటే, బొమ్మా బొరుసు రెండూ నిజమే, రెండు కాదు. 

ప్రపంచంలో ఆకలి ఉన్నది ఎంత నిజమో, ఆకలి రాజకీయమూ అంతే నిజం. ఆకలిని రాజకీయ అస్త్రంగా మలచుకునే  ప్రయత్నాలు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగాను జరుగుతున్నాయి. ఇందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 (జిహెచ్‌ఐ-2022) పేరిట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక  ఒక తాజా ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచిలో భారత దేశం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఆరు మెట్లు దిగజారి 121 దేశాల్లో 107 స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 116 దేశాల్లో 101 స్థానంలో వుంది. 

అయితే, ఈ నివేదిక ఎంతవరకు ప్రామాణికం, నివేదిక తయారు చేసిన ఐఎఫ్ఆర్ఐకు ఉన్న విశ్వసనీయత ఎంత అనే విషయంలో ఎవరి అనుమనాలు వారికున్నాయి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం జిహెచ్‌ఐ-2022 నివేదికను తిరస్కరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు, జిహెచ్‌ఐ-2022ను బోగస్ నివేదిక అని కొట్టి వేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగతున్నకుట్రగా పేర్కొంటున్నాయి.

ఆర్ఎస్ఎస్ అనుబంధ  స్వదేశి జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతో, బాధ్యతారహితంగా జిహెచ్‌ఐ-2022 నివేదికను రూపొందించి/ప్రచురించి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ, ‘వెల్ట్ హుంగర్ హిల్ఫే పై విచారణ జరిపించి  చర్యలు తీసుకోవాలని జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. నిజానికి గత సంవత్సరం ఇదే సంస్థ ఇదే తప్పుడు గణాంకాల ఆధారంగా తప్పుడు  ఆరోపణలు చేసినప్పుడ, ప్రపంచ ఆహారసంస్థ (ఎఫ్ఏఓ) తప్పును ఒప్పుకుని సరిదిద్దుతామని మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసిందని స్వదేశి జాగరణ మంచ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారత దేశం ఆర్థిక, ఆహార, ఔషద సహాయం అందుకుంటున్నఇరుగు పొరుగు దేశాలు పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంకల కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొనడం అసత్యం మాత్రమే కాదు హాస్యస్పదంగానూ ఉందని స్వదేశీ జాగరణ్  మంచ్   పేర్కొంది.  

నిజానికి, కొన్ని విదేశీ సంస్థలు భారత దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు సంబందించిన నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో  ఒక్క ఆకలి విషయంలోనే కాదు  ఇంకా అనేక విధాల దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ మరణాల విషయంలో  భారత దేశ జనాభాలో కనీసం  మూడో వంతు  జనాభా ఉన్నా అమెరికా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి దేశంలో హాహాకారాలు సృష్టించే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.    
మరోవంక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఐఎఫ్ఆర్ఐ నివేదికకు, ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. హరతులిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇది నిదర్శనమని అంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇదే అదనుగా తీసుకుని  ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ గా వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్య ప్రచారంతో దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రధాని మోడీని విమర్శించడంలో ముందుండే  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తమదైన స్టైల్లో  మోడీ పాలనలో  కొద్ది మంది అస్మదీయులకు మాత్రమే అచ్చే దిన్, అమృత కాల్  దేశానికి మాత్రం డబుల్ ఇంజిన్ విధ్వంశం” అని ట్వీట్ చేశారు.      

అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 3000 మంది అభిప్రాయలు సేకరించి, చిత్రించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 విశ్వసనీయత విషయంలో అధికార పార్టీకే కాదు, సామాన్యులకు కూడా సందేహాలున్నాయని అంటున్నారు.  కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి  పేద ప్రజలను కాపాడేందుకు, 2020 నుంచి  కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మంది  పేద ప్రజలకు నెలకు ఐదుకిలోల వంతును ఉచితంగా గోధుమలు/ బియ్యం సరఫరా చేస్తోంది. మరో వంక  శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల ఆకలి కేకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగని భారత దేశంలో ఆకలి లేదని కాదు. అంతా బాగుందని అసలే కాదు. కానీ, జిహెచ్‌ఐ-2022 నివేదిక పేర్కొన్నట్లుగా  పాక్, బంగ్లా, శ్రీలంక కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా అయితే లేదు. ఇక్కడే  జిహెచ్‌ఐ-2022 నివేదిక ‘సృష్టి’ కర్తలు తప్పులో కాలేశారని అంటున్నారు.

అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి,  కానీ, జిహెచ్‌ఐ-2022 వివేదిక నిండా బొక్కలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.  నిజానికి   దక్షిణ ఆసియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మసక బారుతున్న ఆర్థిక వ్యవస్థకు వెలుగు కిరణం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే  అని ఇటీవలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. అయితే, అది సంపూర్ణ సత్యమా, అంటే కాకపోవచ్చును కానీ, జిహెచ్‌ఐ-2022 మాత్రం సంపూర్ణ అసత్యం, అని నిపుణులు అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.