Publish Date:Oct 28, 2024
హైదరాబాద్ లో 144 సెక్షన్ కేవలం మతకలహాలు జరిగినప్పుడు మాత్రమే ఉండేది. కానీ ఈ నెల 27 వతేదీ నుంచి హైద్రాబాద్ లో 144 సెక్షన్ అమలవుతోంది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు పొలిటికల్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. దీపావళికి ముందు ఒక ఎత్తు దీపావళి తర్వాత ఒక ఎత్తు అని పొంగులేటి ఇచ్చిన స్టేట్ మెంట్ కొత్త చర్చకు దారి తీస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో పొంగులేటి ప్రకటన క్లూ దొరికినట్టు తెలుస్తోంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుందని పోలీస్ కమిషన్ సివి. ఆనంద్ వెల్లడించారు జన్వాడా ఫాంహౌజ్ లో పోలీసుల దాడుల నేపథ్యంలో కెటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది . కెటీఆర్ టార్గెట్ గా గత కొంతకాలంగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జన్వాడ ఫాం హౌజ్ లో కుటుంబ సభ్యులు పట్టపట్టడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెటీఆర్ అరెస్ట్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. .బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో 144 సెక్షన్ అమలవుతోందని తెలుస్తోంది నవంబర్ 1 నుంచి 8 వరకు బిఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ కానున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కెసీఆర్ , హరీష్ రావులు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే కాళేశ్వరం దర్యాప్తు ఫైనల్ స్టేజిలో ఉంది. కెసీఆర్ తర్వాత కెటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కెటీఆర్ టార్గెట్ గా పని చేస్తోంది. కెటీఆర్ బామ్మర్ది కి రాజ్ పాకాల చెందిన జన్వాడా ఫాం హౌజ్ లో దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ డిజిపికి ఫోన్ చేసినట్టు సమాచారం. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని కెసీఆర్ డిజిపి జితేందర్ పై అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-bomb-decoded-ktr-arrested-25-187535.html
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.