షర్మిలే రైట్.. వైసీపీ అంగీకరించేసిందా?

Publish Date:Oct 28, 2024

Advertisement

చేతులు పూర్తిగా కాలిపోయాకా.. ఆకుల కోసం వెతికినట్లుంది వైసీపీ తీరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస ముందు చూపుకూడా లేని పార్టీగా ఇప్పటికే వైసీపీ పలు సందర్భాలలో రుజువు చేసుకుంది. ఆ పార్టీ పూర్తిగా వైసీపీ అధినేత జగన్  ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచే పార్టీ. అధికారంలో ఉన్న ఐదేళ్లూ దోచుకోవడం, దాచుకోవడం, ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు అన్నట్లుగా సాగింది. ఎందుకంటే అవే జగన్ కు ఇష్టం కనుక. ప్రత్యర్థులను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించే వారికే పార్టీలో గుర్తింపు అన్న విధానం కారణంగా ఆ పార్టీ నేతలంతా నోరేసుకుని పడిపోయేవారు. బూతుల పంచాంగంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి మాటే ఎత్తక, కేవలం కక్ష సాధింపు చర్యలే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే జగన్ పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అధికారం కోల్పోయిన తరువాతైనా పార్టీ అధినేతలో, నేతల్లో మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం. ప్రజా మద్దతు తమవైపే అంటూ స్వోత్కర్ష వినా.. పార్టీ ఓటమికి కారణాలపై ఇంత వరకూ ఆ పార్టీ సమీక్షించింది లేదు. ఆత్మ విమర్శ చేసుకున్నది లేదు. 

ఇక తాజాగా జగన్, ఆయన సోదరి మధ్య ఆస్తి తగాదా పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను పాతాళంలోకి పడిపోయేలా చేసింది. అయితే షర్మిలపై జగన్ ఏమైనా మాట్లాడితే ఏదో సొంత గొడవ అనుకోవచ్చు. కానీ షర్మిలపై విమర్శలు గుప్పించడం, ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడమే పార్టీ విధానం అన్నట్లుగా  పార్టీ నేతలు మైకుల ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేశాయి చేస్తున్నాయి.

ఈ రెండు వారాలలో వైసీపీ నేతలు షర్మిలను దూషించడానికే తక్కువలో తక్కువ రెండు డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు. కేతిరెడ్డి, జూపూడి, పేర్నినాని, రాచమల్లు, సతీష్ రెడ్డి, సుధాకర్ బాబు, వరుధు కల్యాణి, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి.. ఇలా వైసీపీ నేతలందరూ షర్మిలపై బురద జల్లడానికే మైకుల ముందుకు వచ్చారు. ఇక జగన్ సొంత మీడియా  అయితే షర్మల వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా డిబేట్లు నిర్వహించింది. కథనాలు వండి వార్చింది. అయితే ఆలస్యంగానైనా షర్మిల విషయంలో పార్టీ పరంగా ఇలా విరుచుకుపడటం వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టం జరుగుతోందని తెలుసుకున్న వైసీపీ ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా నోరెత్తవద్దని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని పిలుపు నిచ్చింది. కోర్టులు ఉన్న అంశం కనుక అక్కడే తేల్చుకుందామని, రాజకీయ చర్చలు వద్దని స్ఫష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది.  

అయితే అసలీ రచ్చను మొదట మొదలెట్టిందే వైసీపీ. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా మూకుమ్మడి దాడి చేసినట్లుగా షర్మిలపై విరుచుకుప్పడారు. కనీస లాజిక్ కూడా అందకుండా.. వైఎస్ మరణాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ఆపాదిస్తూ అటువంటి వారి మేలు కోసం షర్మిల పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆస్తుల విషయంలో షర్మిలను జగన్ దగా చేశారని జనం నమ్ముతున్నారనీ, ఈ విషయంలో తాము షర్మిలపై ఎంతగా విమర్శలు చేస్తే అంతగా నష్టపోవడం ఖాయమనీ నిర్ధారించుకున్న తరువాత ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పటికే అలస్యమైపోయింది. షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసిపోయింది. చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత ఇప్పుడు ఆకుల కోసం వెదుకుతున్న చందంగా వైసీపీ షర్మిల విషయంలో ఇక నోరెత్తకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీకి ఒనగూడే ప్రయోజనం ఏం లేదు సరికదా.. ఇప్పటి దాకా తాము చేసిన విమర్శలన్నీ తప్పు, అవాస్తవాలని స్వయంగా ఒప్పుకున్నట్లైంది. 

By
en-us Political News

  
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.