ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం మొదలైంది. అయితే పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో పలు పోలింగ్ నిలిచిపోయింది. ఢిల్లీలోని మాదీపూర్ ప్రాంతంలో వీవీ ప్యాట్ లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ను నిలిపివేశారు. అలాగే పలు ఇతర చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించాయి.
ఇదిలా ఉండగా సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు ఢిల్లీ సీఎం అతిషిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె ఎన్నికల కోడ్ అతిక్రమించారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద గోవింద్ పూరి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.
ఫతేసింగ్ మార్గ్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిశీ 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు పది వాహనాలతో తిరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు సూచించినా ఆమె పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాగా తనపై కేసు విషయంలో ఢిల్లీ సీఎం అతిశీ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి, ఆయన మద్దతుదారులూ బహిరంగంగా దాడులకు దిగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు వివక్షతో వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/polinig-stalled-in-several-places-39-192375.html
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.