Publish Date:Feb 10, 2025
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోమారు నోటీసులు పంపారు. తాడేపల్లి ప్యాలెస్ బయట ఇటీవల స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించింది. జగన్ పై హత్యాయత్నం అంటూ వార్తలను వండి వార్చింది. ఈ అగ్నిప్రమాదం తాడేపల్లి ప్యాలెస్ బయట రోడ్డు పక్కన ఉన్న లాన్ లో జరిగింది. అయితే దీని వెనుక బారీ కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది.
ప్రతిగా.. ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన ఆధారాలు మాయం చేయడానికి వైసీపీయే స్వయంగా ఈ అగ్నిప్రమాదాన్ని సృష్టించిందంటూ తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి ప్యాలెస్ లోని సీపీ ఫుటేజీ ఇవ్వాలంటూ తాడేపల్లి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసుల మేరకు సీసీ ఫుటేజీ ఇవ్వడానికి వైసీపీ నిరాకరించింది. దీంతో పోలీసులు మరోమారు నోటీసులు పంపించారు. తాడేపల్లి ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నాయకుల జాబితా ఇవ్వాలనీ, అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలను మంగళవారం (ఫిబ్రవరి 11) తాడేపల్లి పీఎస్ లో సమర్పించాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వైసీపీ కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
గతంలో జగన్ పై కోడి కత్తి దాడి కేసులో కూడా పట్టుబట్టి ఎన్ఐఏ దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేయించుకున్నప్పటికీ, ఆ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వక పోవడంతో సంవత్సరాల తరబడి ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో కూడా సంఘటన జరగ్గానే ఇష్టారీతిగా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత ఆ తరువాత దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. తనపై గులకరాయి దాడి కేసులో కూడా జగన్ అదే విధంగా వ్యవహరించారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కూడా ఇష్టారీతిగా ఆరోపణలు గుప్పించడమే తప్ప.. వివరాలను, ఆధారాలను సమర్పించడానికి మాత్రం ముందుకు రావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-serve-notice-to-ycp-office-39-192681.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!