Publish Date:Oct 28, 2022
పాలకుడు ప్రజామోదయోగ్యంగా వ్యవహరించాలి, పాలించాలి. ప్రజాసంక్షేమాన్ని ఎల్లపుడూ కోరుకోవాలి. అందుకు పాటుపడాలి. ప్రతీ పథకం, ప్రతీ పనీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయాలి. అప్పుడే ప్రజలు పాలకుడిని నెత్తిన పెట్టుకుంటారు, అభిమానిస్తారు. వీటన్నింటికీ విరుద్ధంగా పాలన సాగిస్తే ఇంటికీ పంపగలరు. ప్రజాగ్రహం అడ్డుకోవడం చాలా కష్టం. అందుకు తాజా ఉదాహరణే ఏపీ సీఎం జగన్ తన నివాసంవద్ద కంచెలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఆట్టే ప్రమాదం లేదు గనుక తీయిం చేస్తుండ డమూను.
ఇటీవల జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దుపై ఏపీ అంతటా నిరసనలతో ప్రభుత్వోద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వం పట్ల తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్ప టికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారని వ్యతిరేకంగా చలో విజయవాడ పిలుపు నిచ్చింది ఏపీసీపీ ఎస్ఈఏ. సమావేశమైన ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెం బర్ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీ ని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిలినియం మార్చ్ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఎక్కడ ఉద్యోగులంతా ఇంటిమీదకి వచ్చి పడతారా అని భయంతో కంచె కట్టించారు. ప్రజలు, ముఖ్యం గా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వచ్చే వారిని దగ్గరికి రానీయకుండా కంచెలు, పోలీసులతో అడ్డు గోడ కట్టించేసుకుంటే పాలకుడని, మంచి సీఎం అని జగన్ ని ఎవరు మాత్రం అంగీకరిస్తారు. రాష్ట్ర మంతటా తీవ్ర నిరసనే వ్యక్తమవుతోంది. అయితే ఇక ఇప్పుడు ప్రజల నుంచీ అంతటా భయపడేంత దాడులకు, ముట్టడికి అవకాశం లేదుగనుక వెంటనే సీఎం ఇంటి కి వెళ్లే రహదారిలో కంచెను తొలిగించే పనులు పడ్డారు పోలీసులు. దారిన వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారని కంచెను తొలగిస్తున్నామని పోలీసులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-removing-fence-at-cm-house-25-146187.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.