Publish Date:Mar 17, 2026
హైదరాబాద్లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ హుక్కా సెంటర్పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత గోప్యంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం (మార్చి 16) రాత్రి నిర్వహించిన దాడిలో యువకులు హుక్కా తాగుతూ పట్టుబడ్డారు. ఈ దాడిలో వివిధ రకాల నిషేధిత హుక్కా ఫ్లేవర్లు, పొగాకు మిశ్రమాలు, పైపులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హుక్కా కేంద్రం నిర్వాహకులుగా భావిస్తున్న సాగర్, మోహన్ లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నగరంలో యువతను పెడదోవ పట్టిస్తూ, ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి అక్రమ హుక్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. . హుక్కా పేరుతో కేవలం పొగాకు మాత్రమే కాకుండా, ఇతర మత్తు పదార్థాలు కూడా సరఫరాచేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-raid-hookah-center-36-215619.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.