పాలు పోసిన చేతినే కాటేసిన విషనాగు .. టర్కీ!

Publish Date:May 10, 2025

Advertisement

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది, అది సర్ప జాతి లక్షణం. కానీ.. మనిషన్నవాడు, మానవత్వం ఉన్న వాడు ఎవరైనా  చేసిన మేలును మరిచి పోడు. మరిచికూడదు. మరిచి పోతే వాడు మనిషి కాదు. విశ్వాస ఘాతుక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ  మృగం అనవచ్చును.  ఈ  ధర్మం వ్యక్తులకే కాదు  దేశాలకూ వర్తిస్తుంది. కష్ట కాలంలో ఆదుకున్న దేశాన్నిఅవసర సమయంలో ఆదుకోకపోకా వెన్ను పోటు పొడవడం దుర్మార్గాలలో కెల్లా మహా దుర్మారం. అమానుషం. అవును..  సాయమ చేసిన వారికి తిరిగి సాయం చేయక పోయినా  ఫర్వాలేదు కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు, దుర్మార్గానికి పాల్పడితే  అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాస ఘాతుకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అనవచ్చును.    

ఇప్పడు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కాని అప్రకటిత యుద్ధం జరుగతున్న సమయంలో టర్కీ, అలాంటి దుర్మార్గానికి పాల్పడింది. విష సర్పమై  పాలు పోసిన భారత దేశాన్నే కాటు వేసింది. రెండేళ్ళ క్రితం  2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా టర్కీ లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ప్రాణ, ఆస్తి నష్టంకూడా టర్కీలోనే ఎక్కువగా జరిగింది.  భూకంప ప్రభావానికి  దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంచు మించుగా 50 వేల మందికి పైగా   చనిపోయారు.    

అలాంటి సమయంలో.. అంతటి విపత్కర పరిస్థితిలో టర్కీకి నేనున్నానంటూ స్నేహ హస్తం అందించిన తొలి దేశం   భారత దేశం. ప్రపంచ దేశాలన్నీ మీన మేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్‌ దోస్త్‌  పేరిట స్నేహ హస్తాన్ని అందించింది.  భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్‌ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది.  అంతటి  కష్ట కాలంలో  భారత దేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే ఇప్పుడు టర్కీ భారత దేశం చేసిన సహాయాన్ని మరిచి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు  అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది. 

పాకిస్థాన్‌ గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో భారత్‌ పై డ్రోన్‌ దాడులు చేసింది. వందల సంఖ్యలో  డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్‌ ను గాలిలోనే  పేల్చి వేశాయి.  నేల కుల్చాయి.  పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం  ఆ దేశ నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది.అవును. ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి  చెందిన  అసిస్‌ గార్డ్‌ సోనగర్‌  డ్రోన్లుగా ధ్రువీకరించారు. 

అయితే..  ఒక విధంగా ఇది అనూహ్య పరిణామంమ కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత దేశం పట్ల  విపరీతమైన ద్వేషం వుంది. అదేమీ రహస్యం కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ఎర్దొగాన్‌ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతే కాదు..  ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు. 

పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత దేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే   ఊహించింది. ప్రపంచమంతా భారత్ దేశం పట్ల  సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్‌ ప్రభుత్వం పంపింది. టర్కీ సి-130ఈ హెర్క్యూలస్‌ విమానం గత నెల 28న పాకిస్థాన్‌లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకొనేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి  ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది.  తర్వాత ఓ యుద్ధనౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్‌ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ , అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తున్నాయి. కాశ్మీర్‌ అంశంలో గతంలో ఎర్డోగాన్‌ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా  భారత దేశం పై విమర్శలు చేశారు. ఇప్పడు పాముకు పలు పోసినా విషమే చిమ్ముతుందని, టర్కీ మరో మారు రుజువు చేసింది.

By
en-us Political News

  
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.