Publish Date:Oct 11, 2025
51 మంది అభ్యర్థులతో తొలి జాబితా
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఆ జాబితా మహామహా రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లైతే.. వారు అత్యధికులు రచయతలు, మేథమెటీషియన్లు, మాజీ బ్యూరో క్రాట్లు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాపై ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారూ, క్లిన్ ఇమేజ్ ఉన్నవారే కావడం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కులం, ధనం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే బీహార్ లో ఆ రెంటినీ పూర్తిగా విస్మరించి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలపాలని ప్రశాంత్ కిషోర్ భావించడం ఆసక్తి కలిగిస్తున్నది.
అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 51 మందితో విడుదల చేసిన జాబితాలో 16 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇటు సామాజిక సమతుల్యత, అటు విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారితో ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన జాబితా విడుదల చేయడం ద్వారా తాను బీహార్ లో ధన స్వామ్యం, నేరస్వామ్యం లేని రాజకీయాలు నడుపుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పకనే చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-release-1st-list-candidates-39-207709.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.