Publish Date:Jun 22, 2025
ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. ఆరు వందల మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు. వారి ఫోన్లు విని ఏం చేశారు? ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు?లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేక పోయిన వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్రమాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఐదవ సారి సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును ఐదు గంటల మేర ప్రశ్నించారు.
ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవంరం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పని చేశానని అన్నారు ప్రభాకరరావు, దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని ఇక్కడే మీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకు ఇచ్చే ఆ రాచమర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200434.html
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో నాలుగురు మృతి చెందారు. గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న సీతారామం అనే వ్యక్తి మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు.