జగనన్నపై జనంలో అసహనం.. ఎందుకంటే?

Publish Date:Apr 21, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సంతుష్ట సూచీని పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటే...సంతుష్టి సూచీ దిగజారడానికి జగన్ పాలన శతథా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తతం ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా ఉన్నట్లు కనిపించదు. పాలనా తీరు కారణంగా సామాన్య జనం, బ్యూరోక్రాట్లు, రైతులు, ఉద్యోగులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల వారూ అసంతృత్తితో ఉన్నారు. అసహనంతో రగిలిపోతున్నారు. ధరల బాదుడు ఉద్యోగులూ, సమాన్య ప్రజానీకం నెత్తిన గుదిబండగా మారితే...సీఎస్ స్థాయి అధికారి కూడా ముందస్తు అనుమతి లేకుండా సీఎం జగన్ ను కలిసే అవకాశం లేని పరిస్థితి బ్యూరోక్రాట్లలో అసంతృతి పేరుకుపోవడానికి కారణమౌతున్నది. 

ఇక రైతుల పరిస్థితి తీసుకుంటే పండించిన పంట కొనుగోళ్లకు సర్కార్ ముందుకు రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలు భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ చార్జీల పెరుగుదల అన్ని వర్గాల వారికీ షాక్ కొట్టేలా ఉంది. దేశంలో మిగిలిన ఏ రాష్ట్రం కంటే కూడా రాష్ట్రంలో పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఉద్యోగులు మూడేళ్ల కిందటి వరకూ అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ ప్రతి నెలా మొదటి తారీకున జీతాలు అందేవి. ఇప్పుడవి ఎప్పుడు అందుతాయన్న విషయం స్పష్టంగా చెప్పగల నాథుడే లేని పరిస్థితి ఏర్పడింది. ఇక పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తీరు కారణంగా మోసపోయామన్న అసంతృప్తి ఉద్యోగులలో కొనసాగుతూనే ఉంది.
వీటికి తోడు జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థ ప్రజలపై పెత్తనం చేసే మరో అధికార కేంద్రంగా తయారైంది. గ్రామ స్థాయిలో వారు చేసే దాష్టీకం ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయిని పెంచేల ఉంది. 
ఇక జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఉచిత పథకాలు అందుకుంటున్న వారు కూడా సంతోషంగా లేరు. ఒక వైపు  ఖాతాలలో సొమ్ములు పడుతున్నా....నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నదన్న భావన వారిలో కూడా అసంతృప్తి గూడు కట్టుకోవడానికి కారణమౌతోంది. 
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పార్టీలో అసమ్మతి ఎంతటి స్థాయిలో ఉందో తేటతెల్లం చేసేసింది.  
ఇలా అన్ని వైపులా రాష్ట్రంలో అసహనం, అసంతృప్తి ఉన్న పరిస్థితిలో విపక్షాలు క్రియాశీలం అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాలు ఆ దిశగా దృష్టి పెడుతున్నట్లుగా కనిపించదు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తక్కువ విద్యుత్ వినియోగించేవారికీ, పీఎం సూర్యఘర్  పథకం కింద  సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్న లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీల వసూలు నిర్ణయాన్ని ఏపీసీపీడీసీఎల్ ఉపసంహరించుకుంది.
అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (జూన్ 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పి.వి. సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.
తిరుమలలోని GNC టోల్ గేట్ సమీపంలో ఒక కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది.
నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్‌కి విజ్ఞప్తి చేశారు
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.