నిన్న పులివెందుల..నేడు పుంగనూరు.. జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు దర్పణం!

Publish Date:Aug 5, 2023

Advertisement

చంద్రబాబు పుంగనూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అరాచకానికి దిగడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి. ఫలితంగా  విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. ఇటు అన్నమయ్య జిల్లా అంగళ్లు.. అటు చిత్తూరు జిల్లా పుంగనూరు రెండు ప్రాంతాలూ రణరంగంగా మారాయి. పుంగనూరుకు చంద్రబాబు వెళ్తుండగా.. వైసీపీ శ్రేణులు మార్గమధ్యలోనే ఆందోళనకు దిగాయి.

ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అన్నమయ్య జిల్లా మీదగా పుంగనూరు వెళ్తుండగా.. అంగళ్లులో చంద్రబాబు రాకముందే వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు మొదలుపెట్టారు. చంద్రబాబు అక్కడి నుంచి పుంగనూరు వెళ్లిన తర్వాత మరోసారి దాడులు జరిగాయి. అక్కడ నుండి పుంగనూరు శివార్లలో మళ్ళీ దాడులకు తెగబడ్డారు. 

 వారం క్రితం వినుకొండలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనుచరుల ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు శాంతియుతంగా  నిరసన తెలుపుతుండగా.. సాక్షాత్తు ఎమ్మెల్యే బొల్లా రంగంలోకి దిగి సవాళ్లు విసిరి హల్ చల్ సృష్టించారు. టీడీపీ శ్రేణులు ఎంతకూ రెచ్చిపోకపోవడంతో వైసీపీ శ్రేణులను రంగంలోకి దిగి దాడులకు ఉసిగొల్పారు. టీడీపీ శ్రేణులు తిరగబడడంతో పరస్పర దాడులు జరిగాయి. ఇప్పుడు కూడా  అంగళ్ళు, పుంగనూరు శివార్లలో అదే సీన్ రిపీట్ అయ్యింది. గత ఐదు రోజులుగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ప్రోజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. లెక్కలతో సహా జగన్ సర్కార్ ను ఎండగడుతున్నారు. సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా ఆయన్ను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డాయి.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ప్రతిపక్షాల బాధ్యత. ఇంకా చెప్పాలంటే దీనికి ప్రతిపక్ష నాయకుడే అవసరం లేదు.. సామాన్య ప్రజలు ప్రశ్నించినా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. వాటిని సరిచేసుకొని,  ప్రజలకు మేలు చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే దాడులు.. విమర్శిస్తే కేసులు, తిరగబడితే విధ్వంసం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబు యాత్రలో చేసే విమర్శలు, చూపెట్టిన లెక్కలలో తప్పులు ఉంటే ఆధారాలను బయటపెట్టి ప్రజలకు నిజనిర్ధారణ చేయొచ్చు. కానీ  చంద్రబాబు చేస్తున్న విమర్శలు, చూపుతున్న గణాంకాలూ వాస్తవాలే  కావడంతో జగన్ సర్కార్  గూండాయిజాన్ని ఆయుధంగా ఎంచుకున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే గొంతులను తొక్కి పెట్టేందుకు జగన్  ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తున్నదంటున్నారు.

ఈ మధ్య కాలంలో జరిగిన వినుకొండ, పుంగనూరు మాత్రమే కాదు.. ఇదే ఆగష్టు నెల 2వ తేదీ గడపగడపకు వెళ్లిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబును ప్రశ్నించిన వారిపై వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యే ముందే దాడి చేయడం, మూడు వరాల కిందట పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ ఇంచార్జి చల్లా సుబ్బారావు ఇంటిపై దాడికి పాల్పడి ఆయనను  తీవ్రంగా గాయపరచడం లాంటి ఘటనలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది ప్రభుత్వమా గూండాయిజమా అని జనం విస్తుపోతున్నారని అంటున్నారు. గతంలో ఏపీలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలపై తెలుగుదేశం ఆరోపణలు చేస్తే  వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మంగళగిరి తెలుగుదేశం ప్రధాన  కార్యాలయంపై దాడికి దిగి విధ్వంసం సృష్టించారు. కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి.

అసెంబ్లీలోనే వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు  టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయస్వామిపై దాడి ఘటన, గుంటూరు జిల్లా మాచర్లలో బజారు రౌడీల మాదిరిగా వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పలుచోట్ల దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న టీడీపీ వర్గంపై దాడులు చేయడం సోషల్ మీడియా పుణ్యమా అని ఇంకా ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేవలం ఈ దాడులు మాత్రమే కాదు.. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ల నుండి మేధావుల వరకు.. మహిళల నుండి యువత వరకూ ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో.. రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేసి ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియకుండా ఆ కుటుంబాలను ఎంత మానసిక వేదనకు గురి చేశారో  ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరు.  ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందనడానికి పులివెందులలో  చంద్రబాబుకు లభించిన ఘనస్వాగతం.. మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో తెలుగుదేశం శ్రేణులు తెగించి మరీ గూండాలను అడ్డుకోవడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.