వద్దనుకొన్నవారికే ఓటేయాల్సివస్తే...

Publish Date:Apr 11, 2014

Advertisement

 

ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో అభ్యర్దులను బట్టి కాక పార్టీలు వాటి అధినేతలను చూసే ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉంది. కొందరు బలమయిన అభ్యర్ధులకు ఈ విషయంలో మినహాయింపు ఉన్నపటికీ, అధిక శాతం ఓట్లు ఆయా పార్టీల పరంగానే పడే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్ధుల గుణగణాలు తదితర అంశాలు మరుగునపడి, పార్టీ పరంగా మాత్రమే చూడబడవచ్చును. ఈ కారణంగా అన్ని పార్టీలలోకి అవినీతిపరులు, అవకాశవాదులు, కేవలం ధనార్జన కోసమే రాజకీయాలలోకి వచ్చే వ్యాపారులు చొరబడే అవకాశం ఏర్పడుతుంది. అస్తవ్యస్తమయి అదుపు తప్పుతున్న రాష్ట్ర పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న ప్రజలు, కనీసం ఈసారయినా ఒక సుస్థిరమయిన ప్రభుత్వాన్ని అందించగల పార్టీకే పట్టం కట్టడం మేలని భావిస్తున్న కారణంగానే ఇటువంటి ఆవాంచనీయమయిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. అలా కాదని ప్రజలు అభ్యర్ధులను చూసి ఓట్లు వేసినట్లయితే, ఏ పార్టీకి మెజార్టీ రాక రాష్ట్రంలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి రాజకీయాలు మరింత భ్రష్టు పట్టే అవకాశం ఉంది.

 

అయితే పార్టీలను, అధినేతలను చూసి ఓటేయాలని ప్రజలు గనుక భావిస్తే, అందరి కంటే ఎక్కువగా లాభపడేది వేర్వేరు పార్టీలలో చేరిపోయి మారు వేషాలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ఎవరికయితే గట్టిగా గుణపాటం చెప్పాలనుకొన్నారో వారికే ఓట్లు వేయవలసి రావడం నిజంగా దురదృష్టకరమే. అయితే ఇది అనివార్యమని ఇప్పటికే స్పష్టమయింది. వారిలో కొంతమంది తెదేపాలో, మరికొంతమంది వైకాపాలో ఇంకొంతమంది తెరాస పంచన చేరిపోవడంతో, ఆయా పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకొనే ప్రజలు, అయిష్టంగానయినా ఆ పార్టీలలో చేరిన కాంగ్రెస్ నేతలకే ఓట్లు వేయవలసి వస్తుంది.

 

కానీ వారందరూ ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకోదలిస్తే సదరు పార్టీల అధినేతలు వారిని ఆపగలరా? ఆపలేన్నపుడు అటువంటి వారిని తెచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దడం ఎందుకు? అనే ప్రశ్నకు జవాబు ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు గనుక, ప్రస్తుతం అటువంటి ప్రమాదం ఉండదని ఆశించవచ్చును.

 

రెండు మూడు నెలల క్రితం కాంగ్రెస్ నుండి బహిష్కరింపబడిన రాజంపేట యంపీ సాయి ప్రతాప్, వేరే పార్టీ ద్వారా తన నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు టికెట్ దొరకకపోవడంతో, దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయగానే మళ్ళీ పరుగున కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అంతే గాక కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వెనక్కి వచ్చేయమని కోరారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ నేతలు చేరిన పార్టీ ఎన్నికలలో ఓడిపోయి రాష్ట్రంలో అధికారం చెప్పట్టలేక చతికిలబడినట్లయితే, అదే సమయంలో కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే, సదరు నేతలుందరూ ఒకరొకరుగా (అధికారాన్ని వెతుకొంటూ) మళ్ళీ కాంగ్రెస్ గూటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. అప్పుడు వారికి ఓటేసిన ప్రజలు ఎలాగు పశ్చాత్తాప పడకతప్పదు. అదేవిధంగా పార్టీ జెండాలు మోసిన స్వంత పార్టీ వారిని కాదని అటువంటి అవకాశవాదులకు టికెట్స్ ఇచ్చి మోసపోయినందుకు ఆయా పార్టీల అధినేతలు కూడా అక్రోశించకమానరు.

 

ఈ దుస్థితిని నివారించాలంటే అన్ని రాజకీయ పార్టీలు తమ స్వంత పార్టీ నేతలకే టికెట్స్ కేటాయించవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనబడటం లేదు గనుక, చివరికి ఈ దుస్థితి కూడా అనివార్యం కావచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.